Hyderabad : చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Railway Terminal) ను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు పరిశీలించారు. శనివారం బలమైన ఈదురుగాలుతో కురిసిన భారీ వర్షాలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో రూఫ్ సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూ లిన విషయం తెలిసిందే.. దీంతో సీలింగ్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సహా రైల్వే అధికారులు చర్లపల్లి రైల్వే టెర్మనల్ కు చేరుకున్నారు. సీలింగ్ కూలిపోవడానికి తీవ్రమైన గాలి దుమారమే ప్రధాన కారణమని స్థానిక రైల్వే అధికారులు జీఎంకు వివరించారు.
ఇక చర్లపల్లి స్టేషన్ లో గాలి దుమారానికి దెబ్బతిన్న ఇతర ప్రాంతాలను జీఎం అరుణ్ కుమార్ జైన్ (GM Arun Kumar Jain) పరిశీలించారు. అనంతరం జీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీలింగ్ ధ్వంసమైన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అంతేగాక ప్రయాణికుల భద్రత కోసం పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా కేంద్రప్రభుత్వం చర్లపల్లి సహా పలు రైల్వే స్టేషన్లను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.
Charlapally లో గాలివాన బీభత్సం
ఇదిలాఉండగా హైదరాబాద్లో శనివారం భారీ వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి చర్లపల్లి రైల్వే టెర్మినల్(Charlapally Railway Terminal) లో రేకులు ఊడిపడ్డాయి. దక్షిణ భాగం వైపు కొత్తగా నిర్మించిన ప్రధాన ముఖద్వారం వద్ద రూఫింగ్ షీట్లు కూడా పడిపోయాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల ప్రధాన ముఖ ద్వారం పైకప్పు భాగాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. అయితే ఆ సమయంలో ప్రయాణికులు అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు, స్టేషన్ సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.