Sarkar Live

SCR | రైలు ప్రయాణికులకు శుభవార్త చ‌ర్ల‌ప‌ల్లి – విశాఖ మ‌ధ్య ప్ర‌త్యేక రైళ్లు..

SCR | వేస‌వి సెలవుల్లో ప్రయాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతోంది. ఈ మేరకు చ‌ర్ల‌ప‌ల్లి (Charlapalli) – విశాఖ‌ప‌ట్నం (Vishakhapatnam) మ‌ధ్య రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు దక్షిణమధ్య

IRCTC New Rules in Tatkal Ticket Issue

SCR | వేస‌వి సెలవుల్లో ప్రయాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతోంది. ఈ మేరకు చ‌ర్ల‌ప‌ల్లి (Charlapalli) – విశాఖ‌ప‌ట్నం (Vishakhapatnam) మ‌ధ్య రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు. మే 17న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు చ‌ర్ల‌ప‌ల్లి నుంచి విశాఖ‌ప‌ట్నంకు(07441) రైలు బ‌య‌ల్దేర‌నుంది. మే 18న రాత్రి 11 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నం నుంచి చ‌ర్ల‌ప‌ల్లికి(07442) రైలు బ‌య‌ల్దేర‌నుంది. ఈ ప్ర‌త్యేక రైళ్ల‌లో 3ఏసీ, 3ఏసీ(ఎకాన‌మీ) క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు తెలిపారు.

SCR : హైదరాబాద్ నుండి కలబురగికి ప్రత్యేక రైళ్లు

ఉర్స్-ఎ-హజ్రత్ ఖ్వాజా బందన్ నవాజ్ పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి కలబురగి (Gulbarga) మధ్య ప్రత్యేక అన్ రిజర్వ్డ్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. మార్గంలో మొత్తం నాలుగు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని SCR చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు.

హైదరాబాద్ నుండి కలబురగికి రెండు రైళ్లు, రివర్స్ దిశలో రెండు రైళ్లు నడుస్తాయి, ఈ సర్వీసులు మే 17, 18వ తేదీల్లో షెడ్యూల్ చేయబడ్డాయి. కలబురగి(Kalaburagi) లో జరిగే ఉత్సవానికి హాజరయ్యే భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!