Sarkar Live

Boycott Turkey | పాక్ తో స్నేహం.. ట‌ర్కీ విలాపం..

Boycott Turkey Trend in India న్యూఢిల్లీ : / టర్కీ (తుర్కియే) చాలా సంవత్సరాలుగా భారత్ లో వ్యాపార, నిర్మాణ, సాంకేతిక భాగస్వామిగా కొనసాగుతోంది. భారత్‌లో చేపడుతున్న అనేక ప్రాజెక్టుల్లో టర్కీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కానీ, ఆపరేషన్ సిందూర్ (Operation

Boycott Turkey

Boycott Turkey Trend in India న్యూఢిల్లీ : / టర్కీ (తుర్కియే) చాలా సంవత్సరాలుగా భారత్ లో వ్యాపార, నిర్మాణ, సాంకేతిక భాగస్వామిగా కొనసాగుతోంది. భారత్‌లో చేపడుతున్న అనేక ప్రాజెక్టుల్లో టర్కీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కానీ, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత పరిస్థితి పూర్తగా రివర్స్ అయింది. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించడమే కాకుండా.. డ్రోన్లను సరఫరా చేసి ఇపుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇవ్వడం.. భారత ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దేశవ్యాప్తంగా బాక్ కాట్ టర్కీ (Boycott Turkey) నినాదంతో టర్కీ భారీగా నష్టపోవాల్సి వస్తోంది.

Boycott Turkey : దేశవ్యాప్తంగా ఇపుడు ఇదే ట్రెండ్

దిల్లీలోని ITO వద్ద చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ CTI నాయకత్వంలో తుర్కియే (turkiye) , అజర్‌బైజాన్‌ (Azerbaijan) లకు వ్యతిరేకంగా ప్రచారం జరిగింది . ఈ సమయంలో, వ్యాపారులు టర్కీ, అజర్‌బైజాన్‌లతో ఎప్పుడూ వ్యాపారం చేయమని, అక్కడికి వెళ్లబోమని ప్రమాణం చేశారు. ఈ రెండు దేశాలకు 70% మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారని వ్యాపారవేత్తలు చెబుతున్నారు.

కాశ్మీరీ గేట్, చాందినీ చౌక్, చావ్రీ బజార్, నయా బజార్, ఖరీ బావోలి, గాంధీ నగర్, సదర్ బజార్, రోహిణి, కరోల్ బాగ్, లజ్‌పత్ నగర్, సరోజినీ నగర్, కమలా నగర్, బవానా, నరేలా తదితర మార్కెట్‌లు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వ్యాపారులు నిరసనలో పాల్గొన్నట్లు సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ తెలిపారు.

ఢిల్లీలోని అతిపెద్ద ట్రావెల్ అండ్ టూర్ ఏజెన్సీ డైరెక్టర్ మనోజ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, టర్కీ, అజర్‌బైజాన్‌లకు ట్రిప్‌లు బుక్ చేసుకున్న వారిలో 70% మంది తమ బుకింగ్‌లను రద్దు చేసుకున్నారని అన్నారు. అలాగే, చాలా ట్రావెల్ ఏజెన్సీలు ఈ దేశాలకు బుకింగ్‌లు తీసుకోవడం లేదు. 2024లో 2.75 లక్షల మంది టర్కీని, 2.25 లక్షల మంది అజర్‌బైజాన్‌ను సందర్శించారని సీటీఐ కన్వీనర్ ప్రియాంక సక్సేనా, ఉపాధ్యక్షుడు రాజేష్ ఖన్నా తెలిపారు.

ఈ రెండు దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం 12 నుండి 14 శాతం వరకు దోహదపడుతుంది. ఇందులో భారత ప్రజలకు ముఖ్యమైన పాత్ర ఉంది. భారతీయ వ్యాపారవేత్తలు, ప్రజలు ఈ దేశాలకు ప్రయాణించకపోతే టర్కీ, అజర్‌బైజాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఢిల్లీకి చెందిన వందలాది మంది వ్యాపారులు ఈ దేశాలతో చేసిన ఆర్డర్‌లను రద్దు చేసుకుంటున్నారని, ఇతర దేశాలలో తమ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారని బ్రిజేష్ గోయల్ అన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!