Rain | రాష్ట్రంలో రానున్నఐదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని తెలిపింది. తర్వాత రెండు రోజుల్లో ఇది మరింత బలపడుతందని పేర్కొంది. ఈక్రమంలో రాబోయే రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని.. ప్రస్తుతం కేరళ, తమిళనాడు, కర్నాటకలో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది.
కాగా గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆదిలాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.
రేపు పలు జిల్లో వర్షాలు
ఈనెల 23న శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది.
Rain Alert : 24న ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈనెల 24న శనివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాం గద్వాల, నాగర్ కర్నూల్, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. అలాగే, ఆది, సోమవారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం వెల్లడించింది. ఈమేరకు పైన పేర్కొన్న జిల్లాలకు ఎల్లో అలెర్ట్ని జారీ చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.