ACB | రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ప్రజలను లంచాలతో పీడిస్తున్న అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం ఇస్తే చాలు ఇట్టే వాలిపోతున్నారు ఏసీబీ అధికారులు.. పక్కాగా వల పన్ని లంచావతారులను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మే29న లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఇబ్రంహీంపట్నం మండలం ఆర్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
పట్టాదారు పాసు పుస్తకంలో స్థలాన్ని నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) ను ఏసీబీ అధికారులు (ACB Officials) అరెస్టు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం చోటుచేసుకుంది. సర్వే నంబర్ 355లో ఏడు గుంటల భూమిని నమోదు చేసేందుకు ఆర్ఐ కృష్ణ ఏకంగా రూ.12లక్షల లంచం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు చివరకు రూ.9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పకడ్బందీ ప్లాన్ తో ఆర్ఐను పట్టుకున్నారు.
గతంలో బాధితుడు ఆర్ఐకి రూ.3 లక్షలు ముట్టజెప్పాడు. మిగతా డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక బాధితులతో ఒకరైన బాలకృష్ణ ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు మే 29న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆర్ఐ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








