ACB Investigation | అక్రమ ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) నూనె శ్రీధర్ను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం ఐదో రోజు విచారించారు. ఇప్పటివరకు చేపట్టిన విచారణలో శ్రీధర్ అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ మెంట్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీధర్ బ్యాంకు లాకర్లలో భారీగా ఆస్తి పత్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో స్వాధీనం చేసుకున్న ఆస్తులు విలువ సుమారు రూ. 5 కోట్లు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project ) నిర్మాణంలో 6, 7, 8 పనులు పర్యవేక్షించిన ఈఈ నూనె శ్రీధర్ అక్రమాస్తుల చిట్టా లెక్కించిక కొద్దీ పెరిగిపోతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే వందల కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించిన అధికారులు.. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో మరికొన్ని ఆస్తుల్ని కనుగొన్నారు.
ACB Investigation : ముగిసిన కస్టడీ
జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న శ్రీధర్ను కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు (ACB Investigation) ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. సోమవారం అతని బ్యాంకు లాకర్లను తెరిచారు. వాటిలో లభించిన స్థిరాస్తుల పత్రాలు, బంగారం విలువ రూ.5 కోట్లపైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. శ్రీధర్ కస్టడీ గడువు మంగళవారంతో ముగిసింది. ఈ క్రమంలో కోర్టు అనుమతితో అతన్ని మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈగా పనిచేసిన శ్రీధర్పై ఏసీబీ అధికారులు ఈ నెల 11న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అధికారుల సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు గుర్తించారు. వాటి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం రూ. 150 కోట్ల మేర ఉంటుందని అంచనా.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.