Hyderabad : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ పథకం లబ్ధిదారులు ( Aasara pensions ) తమ పెన్షన్లు పొందేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇకపై ఫేసియల్ రికగ్నేషన్ సాంకేతికత (facial recognition technology ) త్వరలో అందుబాటులోకి రానుంది.
తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ 40 లక్షలకు పైగా ఆసరా లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించనుంది. ఇప్పటివరకు, తపాలా శాఖ లబ్ధిదారులకు వారి ఆధార్ కార్డు, వేలి ముద్రలను ఉపయోగించి బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా పెన్షన్లను పంపిణీ చేస్తోంది.
బీట్ పోస్ట్మెన్ నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా, 60 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల చాలా మంది వృద్ధులు, వారి వేళ్లపై వేలిముద్రలు చాలావరకు అరిగిపోయాయి. దీంతో బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెన్షన్లు సకాలంలో అందించలేకపోతున్నారు. దీని కారణంగా లబ్ధిదారులు నెలవారీ పెన్షన్ చెల్లింపులను కోల్పోతున్నందున, పంపిణీ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, పెన్షనర్ల ఖచ్చితమైన గుర్తింపును కోసం అలాగే మోసపూరిత క్లెయిమ్లను నియంత్రిచడానికి పోస్టల్ అధికారులు ముఖ గుర్తింపును ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.
“ముఖ గుర్తింపు ద్వారా నెలవారీ పెన్షన్లను పంపిణీ చేసే ప్రయోగం పురోగతిలో ఉంది. ఆగస్టు నుండి తెలంగాణ అంతటా 4,986 బ్రాంచ్ పోస్టాఫీసులు, 685 సబ్-పోస్టాఫీసులు మరియు 32 హెడ్ పోస్టాఫీసులలో ఈ చొరవను ప్రారంభించాలని శాఖ యోచిస్తోందన్నట్లు తెలుస్తోంది.
Aasara pensions : రాష్ట్రంలో 1.50కోట్ల ఆసరా లబ్ధిదారులు
వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగులకు పెన్షన్లు, నేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, హెచ్ఐవి రోగులు, ఫిన్లేరియా రోగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు – అర్హులైన లబ్ధిదారులకు తొమ్మిది రకాల పెన్షన్లు పంపిణీ చేయబడుతున్నాయి. రాష్ట్రంలో 1.50 కోట్లకు పైగా లబ్ధిదారులు తమ పెన్షన్లను పొందుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







