ACB Raids in Mancherial | మంచిర్యాల జిల్లాలో ఏసీబీ(ACB) వలకు మరో అవినీతి చేప చిక్కింది. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం .. కోటపల్లి మండలం అంగరాజుపల్లి పీహెచ్సీలో ఇన్చార్జి జూనియర్ అసిస్టెంట్గా (Junior Assistance) విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాస్ అనే వ్యక్తి అదే శాఖలో పని చేస్తున్న వ్యక్తి కి సంబంధించిన డీఏ ( DA ) నిధుల విడుదల చేసేందుకు రూ.6 వేలను లంచంగా డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంచిర్యాలలో బొమ్మరిల్లు హోటల్ వద్ద రూ.6 వేల లంచం తీసుకుంటుండగా పక్కా ప్లాన్ తో పట్టుకున్నట్లు వెల్లడించారు.
లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    