పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపికయ్యారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది.సువేందు అధికారి పేరును బీజేపీ నేత భట్టాచార్య ప్రతిపాదించగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.పరిపాలనలో సమతుల్యత కోసం ఇద్దరికి డిప్యూటి సీఎం పదవులు దక్కనున్నాయి.అమిత్ షా పర్యవేక్షణలో జరిగిన భేటీలో సువేందు అధికారిని బెంగాల్ సీఎంగా ప్రకటిస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు డిప్యూటీ సీఎంల నియామకంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.








