Sarkar Live

Author: Maulika

Replace School uniform : సర్కారు మరో నిర్ణయం..  పాఠశాల విద్యార్థుల‌ యూనిఫామ్‌లో మార్పు
State

Replace School uniform : సర్కారు మరో నిర్ణయం.. పాఠశాల విద్యార్థుల‌ యూనిఫామ్‌లో మార్పు

తెలంగాణ ప్రభుత్వ (Telangana government) పాఠశాలల్లో చదివే ఆరో తరగతి, ఏడో తరగతి బాలురకు ఇకపై షార్ట్స్ (నిక్క‌ర్లు) బదులుగా ప్యాంట్లు (pants) అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల అభ్యర్థనలు, ఉపాధ్యాయ సంఘాల సూచనల మేరకు ఈ మార్పును చేపట్టారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానం ఇప్పటి వరకు ఏడో తరగతి వరకు చదివే బాలురకు షార్ట్స్ (shorts), ఎనిమిదో తరగతి నుంచి ప‌దో తరగతి వరకు ప్యాంట్లు అందించేవారు. అయితే.. ఆరు, ఏడో తరగతి విద్యార్థులు (students) కూడా ప్యాంట్లు ఇవ్వాల‌ని విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల నేత‌లు అభ్యర్థించారు. దీనిపై ప్ర‌భుత్వం స్పందించింది. ఆరు, ఏడో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు నిక్క‌ర్ల బ‌దులు, ప్యాంట్లు అందించాల‌ని నిర్ణ‌యించింది. Replace School uniform : ప్ర‌తి విద్యార్థికీ రెండు ప్యాంట్లు ప్రతి ఏడాది ప్రభుత్వం (government) విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌లు ఉచితంగా ...
Supreme Court stay | అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం అభ్యంత‌రం
Trending

Supreme Court stay | అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం అభ్యంత‌రం

Supreme Court stay : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అల‌హాబాద్ హైకోర్టు (Allahabad High Court) ఇటీవ‌ల ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. ఒక మ‌హిళ ఛాతీని తాక‌డం గానీ, ఆమె పైజామా తాడును లాగ‌డం గానీ చేస్తే అది నేరం కిందికి రాద‌ని అల‌హాబాద్ హైకోర్టు ఇటీవ‌ల వ్యాఖ్యానించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ తీర్పుపై స్టే విధిస్తున్న‌ట్టు ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం ఈ రోజు ప్ర‌క‌టించింది. అల‌హాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే.. ఒక మహిళను బలవంతంగా నగ్నంగా చేయడానికి ప్రయత్నించడం దాడిగా పరిగణించాలి గానీ దాన్ని అత్యాచారంగా భావించ‌లేమ‌ని ఓ కేసులో అల‌హాబాద్ హైకోర్టు మార్చి 17న తీర్పు చెప్పింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది మహిళా భద్రతకు విఘాతం క‌లిగించే తీర్పు అని, ఇది నిందితులను రక్షించేలా ఉంద‌ని న్యాయ నిపుణులు, మ‌హిళా సంఘాల ప్ర‌తినిధులు, సామాజికవేత్త‌లు అభ్యంత‌రం చె...
ATM withdrawals | భారంగా మారున్న ఏటీఎం వినియోగం.. పెర‌గ‌నున్న చార్జీలు!
Business

ATM withdrawals | భారంగా మారున్న ఏటీఎం వినియోగం.. పెర‌గ‌నున్న చార్జీలు!

ATM withdrawals ఏటీఎం వినియోగం ఇక భారం కానుంది. న‌గ‌దు విత్‌డ్రా ఖ‌రీదు (costlier)గా మార‌నుంది. ఏటీఎం ఇంట‌ర్‌చేంజ్ ఫీజు (ATM interchange fees) పెంచ‌డానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India (RBI)) గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఇందుకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. ఇది మే 1 నుంచి అమ‌ల్లోకి రానుంది. ఇంట‌ర్‌చేంజ్ ఫీజు అంటే.. ఏటీఎం లావాదేవీల (financial transactions)ను అధికంగా ఉపయోగించే ఖాతాదారుల (customers)పై ఈ మార్పు భారం కానుంది. ఉచిత పరిమితిని మించిన ప్రతి లావాదేవీపై అదనపు రుసుములు ఇక నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజు (ATM interchange fees) అనేది ఒక బ్యాంకుకు మరో బ్యాంకు ఏటీఎంను ఉపయోగించిన ఖాతాదారుల లావాదేవీల కోసం చెల్లించాల్సిన చార్జీ. ఈ రుసుములు సాధారణంగా ఖాతాదారులకే భారంగా మార‌నున్నాయి. ATM withdrawals : ప్ర‌తి లావాదేవీపై అద‌న‌పు చార్జి మే 1 ను...
TTD darshan tickets : టీటీడీ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్ల విడుద‌ల‌.. న్యూ అప్‌డేట్‌
State

TTD darshan tickets : టీటీడీ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్ల విడుద‌ల‌.. న్యూ అప్‌డేట్‌

TTD darshan tickets : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల సౌకర్యార్థం ప్రతినెలా వివిధ సేవల కోసం దర్శనం (Tirumala Tirupati Devasthanams) టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదులను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేస్తోంది. ఈ క్రమంలో 2025 జూన్ నెలలో భక్తులకు అందుబాటులో ఉండే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను, వసతి గదుల కోటాను విడుద‌ల చేసింది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను ఈ రోజు (మార్చి 22న) మధ్యాహ్నం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ సేవా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇతర భక్తుల కోసం TTD darshan tickets అదే విధంగా ఇతర భక్తుల కోసం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ (TTD) మార్చి 24న ఉదయం 1...
Revanth Reddy | చైన్నైకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకో తెలుసా?
National

Revanth Reddy | చైన్నైకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకో తెలుసా?

Revanth Reddy Chennai visit : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) ఈ రోజు సాయంత్రం చెన్నై పర్యటన (Chennai visit)కు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో టీపీసీసీ చీఫ్ మ‌హేష్‌ గౌడ్ (Mahesh Goud) కూడా ఆయనతో పాటు వెళ్లనున్నారు. రేపు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Tamil Nadu Chief Minister M.K. Stalin) అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)) అంశంపై చర్చించనున్నారు. Revanth Reddy : కీల‌కాంశంగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ఒక కీల‌క‌ రాజకీయ అంశంగా మారింది. ఎన్నికల నియోజకవర్గాల పరిమాణాన్ని, భౌగోళిక పరిమితులను, ఓటర్ల విభజనను ఇది ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులు రాజకీయ పార్టీల భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్వి...
error: Content is protected !!