Delhi Elections | ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం
Delhi Elections 2025 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu) ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly elections) భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బాబు బయల్దేరారు.
ఎన్డీయేలో టీడీపీ ప్రాముఖ్యత
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (NDA)లో తెలుగుదేశం పార్టీ (TDP) రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీ 16 గెలుచుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్డీయే వ్యూహాన్ని మరింత బలపరిచేందుకు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు.
తెలుగు వారి మద్దతు కోసం చంద్రబాబు ప్రచారం
ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ వంటి ప్రాంతా...




