Sarkar Live

Author: Maulika

Maoist Surrender | మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: ఒకే రోజు 37 మంది లొంగుబాటు.. వారిపై రూ. 65 లక్షల రివార్డు
National

Maoist Surrender | మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: ఒకే రోజు 37 మంది లొంగుబాటు.. వారిపై రూ. 65 లక్షల రివార్డు

Maoist Surrender Dantewada : మావోయిస్టు పార్టీకి మరోమారు ఎదురుదెబ్బ‌ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్‌, దంతెవాడ జిల్లాలో ఆదివారం, (నవంబర్ 30) ఏకంగా 37 మంది మావోయిస్టులు పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొత్తం రూ. 65 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ 37 మందిలో 12 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. 'పూనా మర్గం'కు ఆకర్షితులై.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న 'పూనా మర్గం' (Puna Narkom - నక్సలిజం వీడి తిరిగి రండి) అనే ప్రచార కార్యక్రమానికి ఆకర్షితులై తాము లొంగిపోతున్నట్లు వారు ప్రకటించారు. తాము హింసామార్గాన్ని విడిచిపెట్టి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకముంద‌ని మావోయిస్టులు వెల్ల‌డించారు. లొంగిపోయిన మావోయిస్టులను దంతెవాడలోని డీఆర్‌జీ (DRG) కార...
IPS Transfers | 32 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ
State, Hyderabad

IPS Transfers | 32 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ

IPS Transfers | తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అడిష‌న‌ల్ డీజీగా జ‌యేంద్రసింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా ప‌రిమ‌ళ హ‌న నూత‌న్ జాక‌బ్‌, పోలీసు అకాడ‌మీ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా చేత‌న్ మైల‌బ‌త్తుల‌, మ‌హేశ్వ‌రం జోన్ డీసీపీగా కే నారాయ‌ణ రెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పీవీ ప‌ద్మ‌జ‌, నాగర్‌క‌ర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్, హైద‌రాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిర‌ణ్ ప్ర‌భాక‌ర్, మ‌హ‌బూబాబాద్ ఎస్పీగా శ‌బ‌రీష్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖిత‌, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా గిరిధ‌ర్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు. ఇక హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా గైక్వాడ్ వైభ‌వ్, ములుగు ఎస్పీగా కేక‌న్ సుధీర్ రామ్‌నాథ్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి ఎస్పీగా సంకీర్త్, గ‌వ‌ర్న‌ర్ ఏడీసీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్‌, పెద...
Group-II నియామకాల్లో కీల‌క మలుపు
State, Hyderabad

Group-II నియామకాల్లో కీల‌క మలుపు

Group-II recruitment : గ్రూప్–II నియామకాలపై సంవత్సరాలుగా కొనసాగుతున్న గందరగోళం మ‌ధ్య‌ తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) కీలక తీర్పు వెలువరించింది. రివాల్యుయేషన్ ఫలితాలను, Telangana Public Service Commission (TGPSC) విడుదల చేసిన తుది సెలక్షన్ లిస్టును పూర్తిగా రద్దు చేసింది. దీంతో మరోసారి ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకతపై చర్చకు దారితీసింది. అస‌లు వివాదం ఏమిటంటే… గ్రూప్–II నియామకాల ప్రక్రియ‌లో TGPSC పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని పి. ప్రసన్నలత, బొక్కు సుజాత సహా మొత్తం 23 మంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మార్పులు చేసిన OMR షీట్లను మూల్యాంకనంలో చేర్చార‌ని వారి ప్ర‌ధాన‌ ఆరోప‌ణ‌. దీనివల్ల తుది జాబితా పూర్తి అన్యాయంగా, అసమంజసంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ అభ్యర్థులు చూపిన ఆధారాలు బలంగా ఉండ‌టంతో వారి వాదనలను కోర్టు అంగీకరించింది. టాంపరింగ్ చేసిన OMR షీట్‌లే అసలు వి...
IB Vacancy 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు- 362 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌
Career

IB Vacancy 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు- 362 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌

IB Vacancy 2025 : ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau Recruitment -IB)లో కొత్తగా భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) విభాగంలో మొత్తం 362 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Central Government Recruitment) ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ నుంచి డిసెంబరు 14 వరకు స్వీకరించనున్నారు. అర్హతలు, వయోపరిమితి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ప‌దో తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 -25 ఏళ్ల‌ మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం వయోసడలింపు (Age Relaxation) వర్తిస్తుంది. IB Vacancy 2025: ఎంపిక ప్రక్రియ IB మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నియామకాల్లో ఎంపిక పలు దశల్లో నిర్వహించబడనుందని అధికారులు వెల్లడించారు. -ముందుగా టైర...
Telangana : మ‌ధ్యాహ్న భోజ‌నానికి నిధుల విడుదల- ఏయే జిల్లాకు ఎంతెంత ?
State

Telangana : మ‌ధ్యాహ్న భోజ‌నానికి నిధుల విడుదల- ఏయే జిల్లాకు ఎంతెంత ?

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న I నుంచి VIII తరగతుల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన (Midday meal scheme ) పథకం కోసం ప్రభుత్వం ఎట్టకేల‌కు నిధులు విడుదల (Funds Releases) చేసింది. కొన్ని నెలలుగా ఈ పథకానికి సంబంధించిన వంట ఖర్చులు (cooking expenses), కుకింగ్ హెల్పర్స్ (community cooking helpers)కు ఇచ్చే చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం రూ. 44.91 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాఠశాలలలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడుద‌లైన నిధులు ఇలా.. ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో వంట ఖ‌ర్చు కోసం రూ. 34.91 కోట్లు, క‌మ్యూనిటీ కుకింగ్ హెల్ప‌ర్స్‌కు రూ.10 కోట్లు విడుద‌ల చేసింది. సహాయకులైన హెల్పర్స్‌కు, సెప్టెంబరు నెలలకు కలిపి రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంది.ప్రభుత్వం విడుదల...
error: Content is protected !!