Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ఘనంగా కొండేటి కొమురా రెడ్డి జన్మదిన వేడుకలు
State, warangal

ఘనంగా కొండేటి కొమురా రెడ్డి జన్మదిన వేడుకలు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (Greater Warangal Municipal Corporation) పరిధిలోని 15వ డివిజన్ గొర్రెకుంటలో జిల్లా ఉపాధ్యక్షులు Kondeti Komura Reddy జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా 15వ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి, శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొండేటి కొముర రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు....
Warangal Police | వరంగల్ ను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలి
Crime, warangal

Warangal Police | వరంగల్ ను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలి

వరంగల్ పోలీస్ కమిషనరేట్  (Warangal Police Commissionerate) పరిధిలో నేరాల నియంత్రణపై కఠిన వైఖరి అవలంబించనున్నట్లు పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు అయిన యువత గంజాయి మత్తుకు బానిసలవకుండా, గంజాయి సరఫరా చేస్తున్న మూలాలను గుర్తించి నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం కాకతీయ మెడికల్ కళాశాలలో( Kakatiya Medical College)లో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో కమిషనర్ పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, పెండింగ్ వారెంట్ల అమలు, అధికారుల పనితీరు వంటి అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు. ప్రతి కేసులో వేగం, పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. గంజాయి సరఫరాదారులపై ప్రత్యేక దృష్టి గంజాయి వినియోగదారులను పట్టుకోవడం మాత్రమే కాకుండా, సరఫరా చేస్తున్న ప్రధాన నెట్వర్క్‌ను ఛేదించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పా...
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఇదే.!
Crime

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఇదే.!

మ‌హిళా కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య వికారాబాద్‌లో విషాదం నెలకొంది. పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ బలిజ దివ్య ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సాయిబాబా కాలనీకి చెందిన బసవరాజ్ హోంగార్డుగా పనిచేసి ఆరేళ్ల క్రితం మరణించాడు. అతడి మూడో కుమార్తె బలిజ దివ్య 2020వ బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. గత ఐదేళ్లుగా వికారాబాద్ జిల్లా ధారూర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప‌డింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప‌రిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బలిజ దివ్య మృతదేహం వద్ద ఒక సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రియమైన అమ్మ, నా కుటుంబసభ్యులు నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. నా చావుకు ఎవరు కారణం క...
రాజకీయాలకు ఒత్తిళ్లకు లొంగని సింగం… “ఒత్తిడి కాదు… చట్టమే ఫైనల్”
Fatafat_with_pr

రాజకీయాలకు ఒత్తిళ్లకు లొంగని సింగం… “ఒత్తిడి కాదు… చట్టమే ఫైనల్”

సీఐ విశ్వేశ్వ‌ర్‌తో ‘ఫటాఫట్’ ఇంటర్వ్యూ! రాజకీయ జోక్యాలు, పైస్థాయి ఒత్తిడులు.. ఇవేవీ ఆయన కర్తవ్య నిర్వహణ ముందు నిలవలేవు. "చట్టం ముందు అందరూ సమానమే" అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ప్రజల మన్ననలు పొందుతున్నారు సి.ఐ. డి. విశ్వేశ్వర్. అన్యాయాన్ని ఎదురిస్తూ, బాధితులకు అండగా నిలుస్తున్న ఆయన పనితీరుకు స్థానికులు 'గబ్బర్ సింగ్' అని పేరు పెట్టారు. విశ్వేశ్వర్ – ధైర్యం, నీతి నిజాయితీకి మారుపేరు. గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో చట్ట పరిపాలనకు కొత్త అర్థం తెచ్చారు. ఇటీవల తన కఠినమైన, నిష్పాక్షిక వైఖరితో ప్రజల్లో చర్చనీయాంశమయ్యారు. రాజకీయ ఒత్తిడులు, రాజకీయ జోక్యాలు ఎన్ని వచ్చినా “చట్టం ముందు అందరూ సమానమే” అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న ఆయన పనితీరు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.రాజకీయ ఒత్తిడులకు తలవంచని ఆయన ధైర్యసాహసం స్థానికుల్లో, పేద ప్రజలకు న్యాయం కోసం పో...
Khammam | 600 గుడిసెల తొలగింపు.. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త‌త‌..
Crime, Khammmam

Khammam | 600 గుడిసెల తొలగింపు.. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త‌త‌..

Khammam : ఖమ్మం నగర శివార్లలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న వినోబా నవోదయ కాలనీలో అధికారులు చేపట్టిన ఇళ్ల కూల్చివేత చర్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. భూదాన్ భూముల్లో నివసిస్తున్న సుమారు 600 నిరుపేద కుటుంబాలను మంగళవారం ఉదయం భారీ పోలీసు బలగాల మోహరింపుతో ఖాళీ చేయించి ఇళ్లను కూల్చివేశారు.ఖమ్మం, కొత్తగూడెం మరియు పరిసర జిల్లాల నుంచి వందలాది మంది పోలీసులు, రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. కూల్చివేసిన ఇళ్ల శిథిలాలను తరలించేందుకు మట్టి మూవర్లు, ట్రాక్టర్ ట్రాలీలు, మినీ ట్రక్కులను ఉపయోగించారు. 18 ఎకరాల భూమిలో.. అధికారుల సమాచారం ప్రకారం, సుమారు ఎనిమిదేళ్ల క్రితం గ్రామీణ పేదల సంఘం సహకారంతో భూదాన్ బోర్డుకు చెందిన 18 ఎకరాల భూమిలో ఈ కుటుంబాలు గుడిసెలు నిర్మించుకుని నివసిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ తొలగింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపార...
error: Content is protected !!