Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
మహిళా కమిషన్‌ చైర్మన్‌ గా గద్వాల విజయలక్షి
State

మహిళా కమిషన్‌ చైర్మన్‌ గా గద్వాల విజయలక్షి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ నూతన చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ​కమిషన్ సభ్యుల వివరాలు: ​చైర్మన్‌తో పాటు కమిషన్‌లో సభ్యులుగా ఆరుగురు మహిళా ప్రతినిధులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వారు: ​కాసోజు శంకరమ్మ ​చిత్యాల శ్వేత ​శశికళ యాదవ రెడ్డి ​సదా లక్ష్మి ​ఎన్. రాధా బాయి ​ఉజ్మా ఆషై షాకిరా...
సదా… ఆనందంగా.. ప్రభుత్వ భూమిని మింగిన సర్వేయర్
Special Stories

సదా… ఆనందంగా.. ప్రభుత్వ భూమిని మింగిన సర్వేయర్

Surveyor Land Scam : విధులకు పంగనామం.. రియల్ ఎస్టేట్‌కు జై! కంచే చేను మేసిన చందంగా.. భూములను కొలవాల్సిన సర్వేయర్ ఏకంగా ప్రభుత్వ భూమినే స్వాహా చేసేశారు. సామాన్య ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి, నేడు కోట్లాది రూపాయల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఒక ప్రభుత్వ సర్వేయర్ నిర్వాకం (Surveyor Land Scam) సొంత గ్రామంతోపాటు ఆయనతో కలిసి చదువుకున్న దోస్తుల్లో కూడా చర్చనీయాంశం అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సర్వేయర్ గా ఉంటూ వెంచర్ ల దందా కొనసాగిస్తున్న సదరు సర్వేయర్ అంశం ఇప్పుడు వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ​సొంత గ్రామంలోనే ‘ప్లాట్ల’ పర్వం ​సదరు సర్వేయర్ తన సొంత గ్రామమైన శాయంపేట హావేలి లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని యధేచ్ఛగా ప్లాట్లు చేసి బందువులకే విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో మార్పులు చేర్పులు చేయడంలో తనకున్న పట్టును ఉపయోగించుకుని, సర్కారు భూమి...
POCSO కేసు V/S హానీ ట్రాప్
Special Stories

POCSO కేసు V/S హానీ ట్రాప్

17 ఏళ్ల అమ్మాయితో తిరగడం చట్టరీత్యా నేరమని బండి సంజయ్ కొడుకుకు తెలియదా 17 ఏళ్ల మైనర్ బాలికను మాయమాటలతో లోబర్చుకున్నాడని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తల్లిదండ్రులు 5 కోట్లు డిమాండ్ చేశారంటూ బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath POCSO Case) చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. మైనర్ బాలికతో సాగించిన వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక వ్యక్తిగత వివాదంగా కాకుండా, రాజకీయ మరియు న్యాయపరమైన పెను తుఫానుగా మారింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ​ అసలు ఏం జరుగుతోంది? POCSO V/S హానీ ట్రాప్! ​ఈ కేసులో రెండు భిన్నమైన వాదనలు తెరపైకి రావడం సంచలనం కలిగిస్తోంది. ​బాధితుల వాదన: తమ 17 ఏళ్ల కుమార్తెను భగీరథ్ మాయమాటలతో నమ...
ముగిసిన రాజకీయ అనిశ్చితి: రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం !
National

ముగిసిన రాజకీయ అనిశ్చితి: రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం !

Tamil Nadu Politics | తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీవీకే (TVK) అధినేత విజయ్, శనివారం నాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరేల్కర్‌ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో, ఆదివారం ఉదయం 10 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూడగట్టిన మెజారిటీ: 120కి చేరిన బలం 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో సాధారణ మెజారిటీ మార్కు 118. తొలుత 108 సీట్లతో మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఉన్న టీవీకేకు మిత్రపక్షాల మద్దతు లభించడంతో బలం 120కి పెరిగింది: టీవీకే: 107 సీట్లు (విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయడంతో 108 నుంచి 107కి తగ్గింది). మద్దతు ఇస్తున్న పార్టీలు: కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఐ(ఎం) (2), వీసీకే (2), ఐయూఎంఎల్ (2). వీసీకే మరియు ఐయూఎంఎల్ పార్టీలు బేషరత...
ధాన్యం మళ్లింపుపై దర్యాప్తు జరగాల్సిందే: హైకోర్టు కీలక తీర్పు
Hyderabad

ధాన్యం మళ్లింపుపై దర్యాప్తు జరగాల్సిందే: హైకోర్టు కీలక తీర్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ధాన్యం మళ్లింపు వ్యవహారంపై దర్యాప్తు కొనసాగాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మిల్లర్లపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయడానికి నిరాకరిస్తూ, వారి పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ​ప్రధానాంశాలు.. ​కేసు నేపథ్యం: 2022-23 కాలంలో మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు సొంత ప్రయోజనాల కోసం మళ్లించారని, ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా రూ. 3,960 కోట్ల మేర బకాయి పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ​మిల్లర్ల వాదన: ధాన్యం నాణ్యత సరిగా లేదని, ప్రభుత్వం మిల్లింగ్ ఛార్జీలు, గన్నీ బ్యాగుల ఖర్చులు చెల్లించలేదని, అందుకే తాము బాధ్యులం కాదంటూ సుమారు 360 మంది మిల్లర్లు 58 పిటిషన్లు దాఖలు చేశారు. ​ప్రభుత్వ వాదన: మిల్లర్లు ధాన్యాన్ని అమ్ముకుని ఆ సొమ్మును సినిమా రంగం, ఇతర స్థిర, చరాస్తుల్లో పెట్టుబడులుగా పెట్టారని అడ్వకేట్ జనరల్ వాదించారు. ​కోర్టు వ్యాఖ్య...
error: Content is protected !!