Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
పేకాట శిబిరంపై పోలీసుల దాడి: నలుగురి అరెస్ట్
warangal

పేకాట శిబిరంపై పోలీసుల దాడి: నలుగురి అరెస్ట్

గీసుకొండ మండల పరిధిలోని కొమ్మాల గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం గీసుకొండ పోలీసులు మరియు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. ​ఘటన వివరాలు.. ​గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ శివారులోని కడారి రాజుకు చెందిన వ్యవసాయ భూమిలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీనిపై స్పందించిన గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ నేతృత్వంలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందంతో కలిసి దాడి నిర్వహించారు. ​పట్టుబడిన నిందితులు: ​కడారి రాజు (40), కొమ్మాల ​దునికే కొమురయ్య (41), విశ్వనాధపురం ​బసికే ప్రభాకర్ (57), కొమ్మాల ​లకావత్ గణేష్ (24), విద్యార్థి, విశ్వనాధపురం ​పరారీలో ఉన్నవారు: వాంకుడోత్ రాజు, పల్లె నరేష్‌లు పోలీసుల నుండి తప్పించుకున్నారు. ​స్వాధ...
తెలంగాణలో సెగలు పుట్టిస్తున్న ఎండలు: మే, జూన్ నెలల్లో నిప్పుల కొలిమే! ‌‌‌‌– Heatwave
Special Stories

తెలంగాణలో సెగలు పుట్టిస్తున్న ఎండలు: మే, జూన్ నెలల్లో నిప్పుల కొలిమే! ‌‌‌‌– Heatwave

Telangana Heatwave Alert | తెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మున్ముందు ఈ తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎల్ నినో ఎఫెక్ట్: ఎందుకీ తీవ్రత? పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 0.5 నుంచి 1 డిగ్రీ వరకు పెరగడంతో 'ఎల్ నినో' పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం దక్షిణ భారతదేశంపై తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలపై ప్రభావం: ఎల్ నినో కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంది, దీనివల్ల వర్షపాతం తగ్గి వేసవి కాలం సుదీర్ఘంగా కొనసాగవచ్చు. ముంచుకొస్తున్న ముప్పు: రానున్న మే, జ...
ప్రైవేట్ పాఠశాలకు ‘రైతుబంధు’.. విద్యాసంస్థ భూమికి వ్యవసాయ పట్టా! – Rythu Bandhu Scam
Special Stories

ప్రైవేట్ పాఠశాలకు ‘రైతుబంధు’.. విద్యాసంస్థ భూమికి వ్యవసాయ పట్టా! – Rythu Bandhu Scam

​రెవెన్యూ అధికారుల అండతో ఖజానాకు గండి.. వరంగల్ జిల్లా ధర్మారంలో వెలుగుచూసిన వైనం ​Private School Rythu Bandhu Scam | విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యాసంస్థ అధినేతలే అక్రమ మార్గంలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారు. రెవెన్యూ నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల అండదండలతో వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా రికార్డుల్లో చూపిస్తూ.. ఏకంగా 'రైతుబంధు', 'రుణమాఫీ' వంటి ప్రభుత్వ పథకాలను అక్రమంగా పొందుతున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం రెవెన్యూ శివారులో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ​నాలా (NALA) భూమికి పట్టా ఎలా? ​నిబంధనల ప్రకారం.. విద్యాసంస్థలు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే భూమిని వ్యవసాయేతర భూమి (నాలా) కింద మార్చాల్సి ఉంటుంది. గీసుగొండ మండలం ధర్మారం శివారులో సదరు పాఠశాల యజమాని ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఇప్పటికే నాలా అనుమతులు కలిగి ఉన్నారు. అయితే, ఇక...
​వ్యాపారాల అభివృద్ధికి ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ తప్పనిసరి: అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి
warangal

​వ్యాపారాల అభివృద్ధికి ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ తప్పనిసరి: అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి

చిన్న వ్యాపారమైనా, పెద్ద కంపెనీ అయినా ప్రభుత్వ గుర్తింపు ఉంటేనే మరిన్ని అవకాశాలు లభిస్తాయని, ప్రతి మహిళా పారిశ్రామికవేత్త తన వ్యాపారాన్ని 'ఉద్యమ్'లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి పిలుపునిచ్చారు. ​శుక్రవారం గీసుగొండ మండల కేంద్రంలోని ప్రగతి మండల సమైక్య కార్యాలయంలో, అధ్యక్షురాలు గట్టు రాధిక అధ్యక్షతన వీఓఏలకు (VOA) నిర్వహించిన మండల స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి మహిళా ఆదాయాభివృద్ధి కార్యక్రమాన్ని ఉద్యమ్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ​ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రయోజనాలు ​తక్కువ వడ్డీకే రుణాలు: బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేట్లతో లోన్లు పొందే అవకాశం. ​ప్రభుత్వ చేయూత: ప్రభుత్వ టెండర్లలో ప్రాధాన్యత, వివిధ సబ్సిడీ పథకాలు. ​మార్కెటింగ్ సౌకర్యం: బ్రాండింగ్, ల...
Boiled Rice | 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి! కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నపం..
State

Boiled Rice | 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి! కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నపం..

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి భారీ ఎత్తున బాయిల్డ్ రైస్ సేకరించాలని, పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణ తెలంగాణలో యాసంగి (Rabi) పంట బాయిల్డ్ రైస్ (Boiled Rice ) మిల్లింగ్‌కు ఎంతో అనుకూలమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ యాసంగి సీజన్‌లో తెలంగాణలో సుమారు 90 ఎల్ఎంటీ (LMT) ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ (5% నూకతో), 5 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ (10% నూకతో) సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం స్పంద...
error: Content is protected !!