Sarkar Live

Author: Pramod Sarkar

ప్ర‌మోద్ స‌ర్కార్‌.. డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల పోలింగ్‌? – Jubilee Hills Byelection
State, Hyderabad

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల పోలింగ్‌? – Jubilee Hills Byelection

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక (Jubilee Hills Byelection) పూర్తయ్యాకే రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Polls) జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదట్లో ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉన్నాయి. జూన్‌లో హైకోర్టు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ, కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రభుత్వం మరింత గడువు కోరే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని బహిరం...
Manipur | మణిపూర్ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం – రూ.8,500 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం
National

Manipur | మణిపూర్ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం – రూ.8,500 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం

2023 హింస చెలరేగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా రేపు మణిపూర్‌లో పర్యటించనున్నారు. మణిపూర్ (Manipur) ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయెల్ శుక్రవారం మాట్లాడుతూ ప్రధాని మోదీ సెప్టెంబర్ 13న ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శిస్తారని, రూ.8,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారని చెప్పారు. ప్రధాని మోదీ మణిపూర్ షెడ్యూల్ ప్రధానమంత్రి ముందుగా మిజోరం నుండి చురచంద్‌పూర్‌కు చేరుకుంటారని, ఆ తర్వాత రాజధాని ఇంఫాల్‌కు వెళతారని ఆయన చెప్పారు. "మణిపూర్ సమగ్ర అభివృద్ధికి తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి చురచంద్‌పూర్‌లో రూ. 7,300 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు" అని గోయెల్ ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. సెప్టెంబర్ 13న ఇంఫాల్‌లో రూ.1,200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ పర్యటన మణిపూర్‌లో శాంతి, సాధా...
Dairy Milk Price : అమూల్, మదర్ డైరీ పాల ధరలు తగ్గుతున్నాయా? తాజా అప్‌డేట్ ఇదే..
LifeStyle

Dairy Milk Price : అమూల్, మదర్ డైరీ పాల ధరలు తగ్గుతున్నాయా? తాజా అప్‌డేట్ ఇదే..

Dairy Milk Price : దేశంలో జీఎస్టీ (GST) సంస్కరణల ప్రభావం పాల ఉత్పత్తులపై కూడా కనిపించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాలు, పాలు సంబంధిత ఉత్పత్తులపై పన్ను జీరోకి త‌గ్గించ‌డంతో వినియోగదారులకు ఉపశమనం లభించ‌నుంది. ముఖ్యంగా అమూల్ (Amul), మదర్ డైరీ (Mother Dairy) సంస్థలు కొత్త ధరలను ప్రకటించాయి. అమూల్ పాలు అమూల్ తాజా పౌచ్ పాలపై ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పౌచ్ పాలపై జీఎస్టీ 0 శాతం ఉండటంతో ధరలు అలాగే కొనసాగుతాయి. అయితే అమూల్ టెట్రా ప్యాక్ (UHT milk) పాల ధర మాత్రం తగ్గనుంది. UHT పాలు ఎక్కువ రోజులు ఫ్రిజ్ అవసరం లేకుండా నిల్వ ఉండే ప్రత్యేకత కలిగి ఉంటాయి. మదర్ డెయిరీ పాల ధర లీటరుకు 3 నుండి 4 రూపాయలు తగ్గవచ్చు. అమూల్ టెట్రా ప్యాకెట్ పాల ధర మాత్రమే తగ్గుతుంది. UHT పాలను మీరు చాలా నెలలు ఫ్రిజ్‌లో ఉంచకుండానే ఉపయోగించవచ్చు. UHT ప్రక్రియలో, పాలను కనీసం 135 డిగ్రీల సెల్సియస్‌కు ...
Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు
Crime, warangal

Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

Mulugu : ములుగు జిల్లా వెంకటాపురం మండలం విఆర్ కె పురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేనత్తను ఆమె అల్లుడు గొడ్డలితో నరికి చంపాడు. వివ‌రాల్లోకి వెళితే గ్రామానికి చెందిన గ్రామానికిచెందిన విజయ్ కుమార్ గత కొంత కాలంగా అత‌డు మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. మ‌ద్యానికిడబ్బులు లేకపోవడంతో తన మేనత్త ఎల్లమ్మ (60)ను త‌ర‌చూ డబ్బులు అడుగుతూ వేదించేవాడు. అయితే ఆమె త‌న వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని చెప్పడంతో వీరి మ‌ధ్య గొడవలు పెరిగాయి. ఈ క్ర‌మంలో మేనత్తపై అల్లుడు గొడ్డలితో ఒక్క‌సారిగా దాడి చేయడంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు (Mulugu Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన విజయ్ కుమార్ గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సం...
మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్​ పై చిగురిస్తున్న ఆశలు.. ‌‌–Machilipatnam Repalle Railway Line
AndhraPradesh

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్​ పై చిగురిస్తున్న ఆశలు.. ‌‌–Machilipatnam Repalle Railway Line

కోల్‌కతా–చెన్నై మధ్య కొత్త ప్రత్యామ్నాయ మార్గం విజయవాడ మార్గంలో తగ్గనున్న ప్రయాణికుల రద్దీ, జర్నీ టైం తీరప్రాంత రైల్వే కారిడార్‌లో కీలక లింక్ మచిలీపట్నం–తిరుపతి రైలు సేవలపై డిమాండ్ విజయవాడ : కృష్ణా జిల్లా ప్రజల దీర్ఘకాల స్వప్నం అయిన మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌ (Machilipatnam Repalle Railway Line) పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ, లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి న్యూఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్‌తో భేటీ అయి ప్రాజెక్టు త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. మచిలీపట్నం-రేపల్లె లైన్ ఎందుకు కీలకమైనది మచిలీపట్నం-రేపల్లె లైన్ (Machilipatnam Repalle Railway Line) ప్రాముఖ్యత గురించి బాలశౌరి చర్చించారు. కోల్‌కతా ‌‌– చెన్నై మధ్య ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడం ద్వారా విజయవాడ జంక్షన్‌లో రద్దీని తగ్గుతుందని, దాదాపు 70 కి.మీ...
error: Content is protected !!