Heat Stroke | ప్రత్యేక విపత్తుగా ‘వడదెబ్బ’… ప్రభుత్వ పరిహారం ఎంతంటే?
Heat Stroke : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఈ వేసవి తీవ్రత పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు (temperatures) 44 డిగ్రీల వద్దకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘హీట్ స్ట్రోక్’ (వడదెబ్బ)ను ప్రత్యేక విపత్తుగా (State Specific Disaster) ప్రకటించింది. ఎండల కారణంగా మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇవ్వనుంది.
Heat Stroke : ఎండల తీవ్రత.. సర్కారు చర్యలు
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వడదెబ్బకు కార్మికులు, రైతులు, వృద్ధులు ఎక్కువగా గురవుతుంటారు. అలాగే బహిరంగంగా పనిచేసే కార్మికులు (construction workers, delivery workers), గర్భిణులు, అధిక బరువు ఉన్నవారు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు కూడా దీని బారిన పడుతుంటారు. ఈ హీట్ స్ట్రోక్ అనేది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది సాధారణంగా అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో లేదా...




