Telangana Assembly | అసెంబ్లీలో నిరసనల పర్వం.. రుణమాఫీపై బీఆర్ఎస్ నిలదీత
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. వార్షిక బడ్జెట్పై ఈ రోజు కూడా ప్రతిపక్షాల నిరసనల మధ్య చర్చ ప్రారంభమైంది. మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పరిశ్రమలు, సమాచార సాంకేతికత శాఖలకు కేటాయింపులపై చర్చ కొనసాగింది. ముఖ్యంగా మునిసిపాలిటీల సవరణ బిల్లు (Municipalities Amendment Bill) లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లుల (Panchayat Raj Amendment Bill) ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేటీఆర్, హరీశ్రావు
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) గట్టిగా నినాదాలు చేస్తూ పంట రుణ మాఫీపై తక్షణమే చర్చ చేపట్టాలని కోరారు. వార్షిక బడ్జెట్పై చర్చను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మంత్రులు చేస్తుండగానే నిరసనతో హోరెత్తించారు. రుణ మాఫీ అంశాన్ని ప్రధానంగా తీసుకోవాలని డి...




