Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Vidaamuyarchi | అజిత్ మూవీ మేకర్స్ పట్టుదలతో లేరా..
State

Vidaamuyarchi | అజిత్ మూవీ మేకర్స్ పట్టుదలతో లేరా..

తమిళ స్టార్ హీరో అజిత్(Ajith) నుంచి వస్తున్న మూవీ విదాముయార్చి(Vidaamuyarchi). ఈ మూవీ తెలుగులో పట్టుదల అనే పేరుతో రిలీజ్ కాబోతోంది. గ్లామర్ క్వీన్ త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాలవల్ల విడుదల కాలేదు. ఈనెల 6న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. ఆ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ గ్రాండ్ గా ఉన్నాయి. అజిత్ స్టైలిష్ లుక్ తో అదరగొట్టారు. ట్రైలర్ తో ఈ మూవీపై సూపర్ బజ్ ఏర్పడింది. కానీ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సందడి మాత్రం లేదు. ఒక మూవీ రిలీజ్ కి ముందు ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్లు కలిసి మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూ లు ఇస్తారు. అందులో హైలెట్స్ ని చెబుతూ ప్రేక్షకులు ఆ మూవీ ఎందుకు చూడాలో, అందులో ఏముందో చెప్పి వారిలో మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తారు...
Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప‌థ‌కంలో అనర్హుల గుర్తింపు షురూ..
State

Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప‌థ‌కంలో అనర్హుల గుర్తింపు షురూ..

Indiramma Atmiya Bharosa Scheme : రాష్ట్ర ప్రభుత్వం వ్య‌వ‌సాయ రైతు కూలీల కోసం ప్ర‌త్యేకంగా ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విషయం తెలిసిందే.. ఈ స్కీమ్‌ కింద రైతు కూలీల‌కు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయాన్ని రెండు విడ‌త‌లుగా అందించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో వివ‌రాల న‌మోదుకు ఇప్ప‌టికే గ‌డువు పూర్త‌యింది. గ్రామ సభలు, మండల కార్యాలయాల్లో నాలుగు రోజులపాటు దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,24,487 కొత్త ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి దాదాపు సుమారు 6 లక్షల మందిని లబ్ధిదారులను ఎంపిక చేసింది. కొత్తగా వ‌చ్చిన 2,24,487 అప్లికేష‌న్ల‌లో 19,193 ద‌ర‌ఖాస్తుల‌ను ఆమోదించారు. 1,44,784 ద‌ర‌ఖాస్తులు తిర‌స్క‌ర‌ణ‌కు గురయ్య‌యాయి. మరో 59,542 దరఖాస్తుల‌ను పెండింగ్‌లో పెట్టారు. ఇందిరమ్మ...
Chandrababu Naidu | ధ‌నిక దేశంగా భార‌త్.. 2047 కల్లా సాధ్యం
State

Chandrababu Naidu | ధ‌నిక దేశంగా భార‌త్.. 2047 కల్లా సాధ్యం

Chandrababu Naidu On Visksit Bharat | భార‌త‌దేశం అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంద‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని కొనియాడారు. దీంతో 2047 నాటికి అభివృద్ధి చెంది ధనిక‌ దేశంగా భార‌త్ ఖ్యాతిని సంపాదించుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కేంద్ర బ‌డ్జెట్ భేష్ ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు కోసం ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు అక్క‌డి మీడియాతో మాట్లాడ‌టంతోపాటు ప‌లు కార్య‌క్ర‌మాల్లో ప్రసంగించారు. 2025 కేంద్ర బడ్జెట్ (Union Budget 2025)ను ఆయన అభినందించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (MSMEs), గ్రామీణ అభివృద్ధి, పెట్టుబడి విధానాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింద‌ని, దీని ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. పన్ను మినహాయింపు పరిమ...
KTR | ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంకు కేటీఆర్.. విచార‌ణ వాయిదా
State

KTR | ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంకు కేటీఆర్.. విచార‌ణ వాయిదా

భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR ) సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల తర్వాత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ (Congress Party)లో చేరిన నేపథ్యంలో వీరిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. కేటీఆర్‌ వేసిన పిటిషన్‌పై ఈ రోజు (సోమవారం) సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. బీఆర్‌ఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో విచార‌ణ ఇలా.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ను విచారించాల‌ని సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం నిర్ణయించింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి క...
MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ఈరోజు నుంచే నామినేషన్లు షురూ
State

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ఈరోజు నుంచే నామినేషన్లు షురూ

MLC Elections In Telangana : తెలంగాణ‌లో రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దీంతో సోమ‌వారం నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభించింది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. 11వ‌తేదీన న నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఈనెల‌ 13న సాయంత్రం 3 గంటల వరకు తుది గ‌డువు ఉంటుంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అదే రోజు ప్రకటిస్తారు. ఇక పోలింగ్ ఫిబ్ర‌వ‌రి 27న జరుగుతుంది. వొచ్చేనెల 3న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల (Telangana MLC Elections) నేప‌థ్యంలో ఆయా జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. MLC Elections Schedule : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదీ.. నామినేషన్ ప్రక్రియ: ఫిబ్రవ...
error: Content is protected !!