Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర
National

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర

PrayagRaj : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని ప్రయాగరాజ్ లో జ‌రుగుతున్న మ‌హా కుంభామేళా (Maha Kumbh 2025) ఆధ్యాత్మికంగానే కాకుండా ఉపాధి క‌ల్ప‌నకు దోహ‌దం చేస్తోందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ మ‌హా కుంభామేళా అనేక ఉద్యోగాల‌ను సృష్టించి నిరుద్యోగ నిర్మూల‌నకు బాట‌లు వేసింద‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ముఖ్యంగా ప‌ర్యాట‌క, ర‌వాణా, లాజిస్టిక్స్‌, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, ఐటీఈ, రిటైల్ రంగాల్లో ఆయా వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌ల‌కు గ‌ణ‌నీయ లాభాలు తీసుకొచ్చి యువ‌త‌రానికి ఉద్యోగావ‌కాశాల క‌ల్ప‌న‌కు మార్గం సుగ‌మం చేసింద‌ని తేలింది. తాత్కాలిక‌.. శాశ్వ‌త అవ‌కాశాలు ఇప్ప‌టికే మ‌హా కుంభామేళా సంద‌ర్భంగా అనేక వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌ల ద్వారా యువ‌త తాత్కాలిక ఉద్యోగాలతో ఉపాధి పొందుతున్నారు. దీంతో ఆయా కంపెనీలు ఆర్థికంగా మ‌రింత బ‌లోపేతం కానున్న నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో శాశ్వ‌త ప్రాతిపాదిక‌న కూడా యువ‌త‌కు ఉద్యోగ‌...
Victory Venkatesh : విక్టరీ వెంకటేష్ ఆ ఫీట్ అందుకుంటాడా…
Cinema

Victory Venkatesh : విక్టరీ వెంకటేష్ ఆ ఫీట్ అందుకుంటాడా…

Victory Venkatesh : ఫ్యామిలీ ఆడియన్స్ కి అప్పటి తరంలో శోభన్ బాబు తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)అని చెబుతారు. ఆయన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తారు మనకు తెలిసిందే. ఎక్కువగా వారిని దృష్టిలో పెట్టుకుని సినిమాలను చేస్తుంటారు. కెరీర్లో మొదట యాక్షన్ సినిమాలను చేసిన తర్వాత ఫ్యామిలీ మూవీస్ చేసి అభిమానులను పొందారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలుగా ఉండి పోటాపోటీగా సినిమాలు చేస్తూ ఒకరి రికార్డులను మరొకరు కొల్లగొడుతూ మంచి మంచి సినిమాలను తీశారు. వారికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. కానీ ఈ నలుగురిలో మెగాస్టార్ (Megastar) మాత్రమే ఒక ఫీట్ సాధించారు. సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో 200 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టి న హీరోగా ఆ ఫీట్ రెం...
Prayagraj Kumbh Mela : కుంభ‌మేళాలో సిలిండ‌ర్ పేలి మంట‌లు..
Crime

Prayagraj Kumbh Mela : కుంభ‌మేళాలో సిలిండ‌ర్ పేలి మంట‌లు..

Fire Accident in Prayagraj Kumbh Mela : ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ ఉత్స‌వానికి హాజరైన ల‌క్ష‌లాది మంది జనాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అధికారులు హుటాహుటిన‌ స్పందించి మంటలను అదుపు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ స‌మ్మేళ‌నమైన మహా కుంభమేళాలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడం ప్రారంభించడంతో, అనేక వాన్టేజ్ పాయింట్ల నుంచి దట్టమైన పొగలు కనిపించాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా విచారణ కొనసాగుతోందని, వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అలారం అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన‌ అక్కడికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు, పరిస్థితిని చూసి స్థానిక అధికారులు సిబ్బంది ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. పెద్ద పెద్ద ద‌ట్ట‌మైన‌ పొగ మేఘాలు ...
Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి
State, Business

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : సింగపూర్‌ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ గ్రూప్ (CapitaLand Group), హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల అత్యాధునిక ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ.450 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. సింగపూర్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులు, క్యాపిట ల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్‌మెంట్ పీటీఈ సహా సీనియర్ క్యాపిటల్యాండ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. కంపెనీ CEO & ED గౌరీ శంకర్ నాగభూషణం ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కాగా తెలంగాణలో పెట్టుబడులకు క్యాపిటాల్యాండ్ గ్రూప్ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపార, సాంకేతిక హబ్‌గా హైదరాబాద్ స్థా...
BJP : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిపై క్లారిటీ ఇచ్చిన కిష‌న్‌రెడ్డి
State

BJP : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిపై క్లారిటీ ఇచ్చిన కిష‌న్‌రెడ్డి

Telangana BJP : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ పదవిలో కొన‌సాగుతుండ‌గా ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ (Bharatiya Janata Party) అధ్య‌క్ష రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అర‌వింద్‌, రఘునందన్ రావు, డీకే అరుణ వంటి ప్రముఖ నేత‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. BJP : ఇత‌ర పార్టీల్లా కాదు.. బీజేపీలో మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టే విధానం ఇత‌ర పార్టీల‌కంటే భిన్నంగా ఉంటుంద‌ని కేంద్ర మంత్రి (Union Minister of Coal and Mines) కిష‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిల్లాల అధ్యక్షుల ఎంపిక జరుగుతోందన్నారు. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కూడా పూర్తవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ తరహాలో ముందే నిర్ణయాలు తీ...
error: Content is protected !!