TG News : తెలంగాణలో దోపిడీ ముఠా? నిప్పులు చెరిగిన కేటీఆర్
ఆ ఆరుగురిని దోపిడీ ముఠాగా పేర్కొన్న కేటీఆర్
రేవంత్ రెడ్డి ఆరుగురు ముఠా సభ్యులను ఏర్పాటు చేసి రాష్ట్రంలో తిప్పుతున్నాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కేటీఆర్
TG News : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి, అధికార పక్షం, ప్రతిపక్షం, ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాసేపటి క్రితం కేటీఆర్ (KTR) చేసిన ఆరోపణలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ సోదరులతోపాటు మరో నలుగురిని అలీబాబా అరడజన్ దొంగలతో కేటీఆర్ పోల్చడం హాట్ టాపిక్ గా మారింది.
మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో ఆరుగురు కూడిన దొంగల ముఠా తిరుగుతోందని, రాష్ట్రంలో ఉన్న కంపెనీలల్లో వసూళ్లు చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఈ ముఠాను ఏర్పాటు చేసాడని అన్నారు. ఈ ముఠా కంపెనీల్లో వసూళ్లు చేయడమే కాకుండా కబ్జాలతో పాటు, బ్లాక్ మెయిల్ లకు పాల్పడుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సోదరులైన తిరుపతిరెడ్డి, కొండల్...




