Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
China dam : ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట.. పక్క దేశాలను ముంచుతుందా? చైనా స్పందన ఇదే.
World

China dam : ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట.. పక్క దేశాలను ముంచుతుందా? చైనా స్పందన ఇదే.

World Biggest Dam : టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ (China dam) ను నిర్మించాలని చైనా యోచిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు దీనిపై చైనా ప్రకటన ఇచ్చింది. శుక్రవారం ఈ ప్రణాళికను సమర్థిస్తూ, చైనా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇతర దేశాలకు ఏమాత్రం ఇబ్బందులు ఏవీ ఉండ‌వ‌ని చెప్పింది. దశాబ్దాల అధ్యయనం త‌ర్వాత‌ భద్రతా సంబంధిత సమస్యలను ప‌రిష్క‌రించామ‌ని US $ 137 బిలియన్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న‌ ఈ 'బాహుబలి' ప్రాజెక్ట్‌పై ఉన్న అనుమానాలు, భయాలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తోసిపుచ్చారు. China dam పై చైనా ఏమి చెప్పింది? వాస్తవానికి, China dam ప్రాజెక్ట్ పర్యావరణపరంగా చాలా సున్నితమైన హిమాలయ ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ఇది భూకంపాలు తరచుగా సంభవించే టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులో ఉంది. దశాబ్దాలుగా చైనా విస్తృత...
BJP leader Annamalai | కొర‌డాతో కొట్టుకున్న బిజెపి నేత.. వీడియో వైర‌ల్‌
National

BJP leader Annamalai | కొర‌డాతో కొట్టుకున్న బిజెపి నేత.. వీడియో వైర‌ల్‌

BJP leader Annamalai : త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడు కె.అన్నామ‌లై వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపారు. అన్నా యూనివర్సిటీలో 19 సంవత్సరాల యువతిపై జరిగిన లైంగిక దాడిపై ఆందోళ‌న‌కు దిగిన ఆయ‌న త‌న‌ను తాను కొర‌డాతో కొట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కొన్నిరోజులుగా అన్నామ‌లై (BJP leader Annamalai) నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. త‌మిళ‌నాడులో డీఎంకే (DMK) ప్ర‌భుత్వాన్ని తొలిగించే వ‌ర‌కు 48 రోజుల‌పాటు ఉప‌వాసం ఉంటాన‌ని, చెప్పులు ధ‌రించ‌న‌ని భీష్మించుకున్నారు. నిన్న బీజేపీ, అన్నాడిఎంకే (AIADMK) నేత‌లు నిర‌సన చేపట్ట‌గా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Annamalai : లైంగిక దాడిపై బీజేపీ నిర‌స‌న‌లు అన్నా యూనివర్సిటీ (Anna University) క్యాంపస్‌లో ఈనెల 23న ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌ను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఓ యువ‌కుడితో ఆ యువ‌తి యూనివ‌ర్సిటీ క్యాంప్‌లో ఉండ‌గా ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని ...
APGVB | ఖాతాదారులకు అలర్ట్..  ఏపీజీవీబీ ఇక ఉండ‌దు..
Business

APGVB | ఖాతాదారులకు అలర్ట్.. ఏపీజీవీబీ ఇక ఉండ‌దు..

APGVB Bank Merger : ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (APGVB ) తెలంగాణ‌లో ఇక ఎక్క‌డా క‌నిపించ‌దు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు (TGB)లో అది క‌లవ‌నుంది. కొత్త సంవ‌త్స‌రం ఆరంభం నుంచి ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. 493 శాఖ‌లు ఉన్న APGVB తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో విలీనం కానుంది. మొత్తం 928 శాఖ‌లతో కొత్త రూపం దాల్చ‌నుంది. ఇది రూ. 70 వేల కోట్ల లావాదేవీల‌ను నిర్వ‌హించ‌నుంద‌ని అంచ‌నా. ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకులో భాగంగా.. రాష్ట్రాల వారీగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగానే ఏపీజీవీబీని టీజీబీలోకి విలీనం చేయాల‌ని నిర్ణయించింది.ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకు స్ఫ‌ర్తితో ఈ ప్ర‌క్రియ చేప‌ట్టింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) 2025 జ‌న‌వ‌రి 1న ఆవిష్క‌రించ‌నుంద‌ని చైర్‌పర్స‌న్ ఇ.శోభ తెలిపారు. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ ...
Sabarimala special trains శ‌బ‌రిమ‌ల ప్ర‌త్యేక‌ రైళ్లు ర‌ద్దు.. కారణమిదే.. !
National

Sabarimala special trains శ‌బ‌రిమ‌ల ప్ర‌త్యేక‌ రైళ్లు ర‌ద్దు.. కారణమిదే.. !

Indian Railways | అయ్య‌ప్ప మాల‌ధారుల కోసం శ‌బ‌రిమ‌ల‌కు నడిపిస్తున్న‌ ప్ర‌త్యేక రైళ్ల (Sabarimala special trains ) ను దక్షిణ మధ్య రైల్వే (SCR) ర‌ద్దు చేసింది. యాత్రికుల సంఖ్య‌ ర‌ద్దీ త‌గ్గ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. మొత్తం 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. సాధారణంగా శ‌బరిమల యాత్రా సీజన్ డిసెంబర్ నుంచి జనవరి మధ్య ఉంటుంది. జనవరి 15 వరకు యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటూ క్ర‌మేణా తగ్గుతుంది. ఈ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) 120కు పైగా ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసింది. కానీ.. ఇప్పుడు యాత్రికుల సంఖ్య తగ్గడం కారణంగా జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య రైళ్లను రద్దు చేసింది. శ‌రిమలకు రైల్వే స‌ర్వీసులు శ‌బరిమల అయ్యప్ప స్వామి దేవ‌స్థానికిఇ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీరి రవాణా సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను న‌డిపిస్తోంద...
SBI PO Recruitment 2025 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీవో ఉద్యోగాలు
Career

SBI PO Recruitment 2025 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీవో ఉద్యోగాలు

SBI PO Recruitment 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్ల (POs) నియామక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. SBI PO 2025 రిజిస్ట్రేషన్ ఈరోజు (2024 డిసెంబర్ 27) ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక SBI వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. SBI PO నియామక ప్రక్రియలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు 600 ఖాళీలను అందుబాటులో ఉంచారు. భారత బ్యాంకింగ్ రంగంలో కెరీర్ సాధించాలని ఆశించే వారికి ఇది స‌ద‌వ‌కాశం. ఆసక్తి గల అభ్యర్థులు SBI PO 2025 రిజిస్ట్రేషన్‌తోపాటు దరఖాస్తు సమర్పణ ప్రక్రియను 2025 జనవరి 16 లోపు పూర్తి చేయాలి. అభ్యర్థులు SBI PO 2025 రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఫారం, ఫీజు చెల్లింపు వివరాలు ఇలా ఉన్నాయి. SBI PO 2025 పోస్టుల వివరాలు ఖాళీలు: 600 అర్హతలు: అభ్యర్థి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.డిగ్రీ చివర...
error: Content is protected !!