Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
RG Kar case | మళ్లీ మొదటికొచ్చిన ఆర్‌జి క‌ర్‌  ఆస్పత్రి కేసు..
Crime

RG Kar case | మళ్లీ మొదటికొచ్చిన ఆర్‌జి క‌ర్‌ ఆస్పత్రి కేసు..

RG Kar case updates : కోల్‌క‌తాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్‌లో వైద్యురాలి హ‌త్యాచారం ఘ‌ట‌న‌పై నిర‌స‌న‌లు ఉధృత‌మయ్యాయి. ప‌శ్చిమ బెంగాల్ సంయుక్త వైద్యుల వేదిక (WBJPD) దీక్ష‌ల‌కు పూనుకుంటోంది. డిసెంబర్ 19 నుంచి కోల్‌కతా నడిబొడ్డున నిరసన దీక్ష ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. లేడీ డాక్ట‌ర్‌ హ‌త్యాచారం కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరు చేయడంపై WBJPD మండిప‌డుతోంది. ఈ ఘ‌ట‌న‌పై 90 రోజుల లోపు చార్జ్‌షీట్ సమర్పించడంలో సీబీఐ విఫలం కావ‌డం వ‌ల్లే నిందితులు బెయిల్ పొంద‌గ‌లిగార‌ని ఆరోపిస్తోంది. సీబీఐ చార్జ్‌షీట్‌లో జాప్యం వైద్యురాలిని అత్యాచారం చేసి హ‌త్య చేయ‌డంపై ఐదు వైద్యుల సంఘాల సమాఖ్య WBJPD డిసెంబరు 26 వరకు కోల్‌కతాలోని డోరీనా క్రాసింగ్ వద్ద ఈ నిరసనను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఘ‌ట‌న‌పై సీబీఐ ద‌ర్యాప్తును వేగ‌వంతం చేయాల‌ని, కేసులో అదనపు చార్జ్‌షీట్ వెంటనే సమర్పించాలని డిమాండ్...
Ustad Zakir Hussain | ప్ర‌ముఖ త‌బ‌లా క‌ళాకారుడు జాకీర్ హుస్సేన్ క‌న్నుమూత‌
Cinema

Ustad Zakir Hussain | ప్ర‌ముఖ త‌బ‌లా క‌ళాకారుడు జాకీర్ హుస్సేన్ క‌న్నుమూత‌

Ustad Zakir Hussain | ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక ఆసుపత్రిలో క‌న్నుమూసిన‌ట్లు ఆయన కుటుంబ సభ్యులు సోమవారం వెల్ల‌డించారు. 73 ఏళ్ల హుస్సేన్ అనారోగ్య కార‌ణాల‌తో గత రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విష‌మించ‌డంతో ICU కి తరలించారు. చివ‌ర‌కు సోమ‌వారం ఆయ‌న తుదిశ్వాస విడిచారు. తన ప్రసిద్ధ ఆరు దశాబ్దాల కెరీర్‌లో హుస్సేన్ ఈ సంవత్సరం ప్రారంభంలో 66వ వార్షిక గ్రామీ అవార్డులలో మూడు సహా నాలుగు గ్రామీ అవార్డులను సాధించారు. అత్యంత ప్రసిద్ధ అంతర్జాతీయ, భారతీయ సంగీతకారులతో కలిసి పనిచేశారు. అయితే ఇది 1973లో ఇంగ్లీష్ గిటారిస్ట్ జాన్ మెక్‌లాఫ్లిన్, వయోలిన్ వాద్యకారుడు L.శంకర్, పెర్కషన్ వాద్యకారుడు TH 'విక్కు' వినాయక్‌లతో కలిసి అతని అద్భుతమైన ప్రాజెక్ట్ లు చేశారు. ఇది భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. Ustad Zakir Hus...
Christmas Special Trains : క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
National

Christmas Special Trains : క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

Christmas Special Trains : క్రైస్త‌వుల‌కు అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్ వచ్చిందంటే చాలు పెద్ద సంఖ్య‌లో ప్రత్యేక ప్రాంతాలకు వెళ్తుంటారు. దేశంలో ప్రసిద్ధి గాంచిన విల్లుపురం(Villupuram), బ్రహ్మపూర్ (Brahmapur) ప్రాంతాల‌ను సందర్శిస్తారు. తమిళనాడులో గ‌ల‌ విల్లుపురానికి ఎంతో చరిత్ర ఉంది. క్రిస్మస్ సందర్భంగా ఇక్క‌డికి భారీగా సందర్శకులు వ‌స్తారు. విల్లుపురంలోని చర్చిలలో ఏటా కరోల్ గానంతో సహా ప్రత్యేక సేవలను నిర్వహిస్తారు. ఇవి ఇక్క‌డికి వ‌చ్చే క్రైస్తవులు ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు.సామూహిక ప్రార్థనలు, భోజనాలు, వేడుక‌లు ఇక్క‌డ అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహిస్తారు. ఇక ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. బ్రహ్మపూర్‌లో పెద్ద సంఖ్యలో క్రైస్తవ జ‌నాభా ఉంది. ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా చర్చి సేవలు, ఊరేగింపులు వంటివి ఘ‌నంగా జ‌రుగుతాయి. క్రిస్మ‌స్ (Christmas) సంద‌ర్భంగా ప్ర‌త్యేక రైళ్లు.. ...
మహాకుంభ మేళా కోసం రైల్వే శాఖ యుద్ధప్రాతిపదికన పనులు
Trending

మహాకుంభ మేళా కోసం రైల్వే శాఖ యుద్ధప్రాతిపదికన పనులు

Indian Railways prepares for Maha Kumbh 2025 |  ప్రయాగ్ రాజ్ లో జరగ‌నున్న మ‌హా కుంభ‌మేళాలో భ‌క్తుల సౌక‌ర్యార్థం కేంద్ర ప్ర‌భుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులోభాగంగా రైల్వేల ప‌రంగా ఇండియ‌న్ రైల్వేస్‌ ఉత్తరప్రదేశ్ స్టేట్ బ్రిడ్జ్ కార్పొరేషన్‌తో కలిసి, ప్రయాగ్‌రాజ్‌లో రైల్వే ట్రాక్‌లను పున‌రుద్ధ‌రిస్తోంది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జ‌ర‌గ‌నున్న మహా కుంభ్ 2025 సమయంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం కోసం భారతీయ రైల్వే ప‌లు ప్రాజ‌క్టుల‌ను చేప‌ట్టింది. మౌలిక సదుపాయాల క‌ల్ప‌న కోట్లాది మంది భక్తులు త‌ర‌లివ‌చ్చే కుంభ‌మేళాలో రద్దీని నిర్వ‌హించేందుకు ప్రయాగ్‌రాజ్ తోపాటు పరిసర ప్రాంతాలలో దాదాపు అన్ని లెవల్ క్రాసింగ్‌ల వద్ద రైలు అండర్ బ్రిడ్జిలు (RUBలు), రైల్ ఓవర్ బ్రిడ్జిలు (ROBలు) నిర్మించారు. ఈ పరిణామాలు మెగా జాత‌ర‌కు ముందే పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చనున్...
Rythu Bharosa | రైతు కూలీల‌కు రూ.12వేల ఆర్థిక‌సాయం.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌
State

Rythu Bharosa | రైతు కూలీల‌కు రూ.12వేల ఆర్థిక‌సాయం.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌

Telangana Rythu Bharosa | నిరుపేద కూలీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా 12వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.. ఈ ప‌థ‌కాన్ని ఈ నెల నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. డిసెంబర్‌ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని భూమి లేని నిరుపేదకు రూ. 12వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka Mallu ) ఖమ్మం జిల్లాలో జ‌రిగిన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ప్రతి సంవ‌త్స‌రం ఇచ్చే 12వేల రూపాయలను రెండు విడతల్లో నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. ఈ తొలి విడతగా ఆరు వేలు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. రైతు భరోసాపై కూడా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్ట‌త ఇచ్చారు. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భ‌రోసా డబ్బులు జ‌మ చేస్త...
error: Content is protected !!