Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో “ఓటు చోరీ” వివాదం — ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదు! Jubilee Hills By-Election
State, Hyderabad

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో “ఓటు చోరీ” వివాదం — ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదు! Jubilee Hills By-Election

Jubilee Hills By-Election : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “ఓటు చోరీ” ప్రచారం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌కే తిప్పికొడుతోందన్న చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) నేపథ్యంలో యూసుఫ్‌గూడ డివిజన్‌లో భారీ స్థాయిలో నకిలీ ఓటర్లు నమోదైనట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూసుఫ్‌గూడలో ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదైనట్లు తేలింది. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని కృష్ణనగర్ బి బ్లాక్ తాజా ఓటర్ల జాబితా ప్రకారం, బూత్ నంబర్ 246 కింద ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదు అయి ఉన్నారు. అంతేకాకుండా ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలలో ఓటర్లను నమోదు చేసుకుంటున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయి. BRS ప్రతినిధి వై సతీష్ రెడ్డి ఎక్స్‌లో ఇలా పోస్ట్ చేశారు, “వేలాది మందిలో ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. (ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు) ఇక్క‌డి ఓటరు, జాగ్రత్తగా చూ...
Congress | కొండా Vs పొంగులేటి – ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ మంత్రుల పంచాయితీ
Special Stories

Congress | కొండా Vs పొంగులేటి – ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ మంత్రుల పంచాయితీ

హైదరాబాద్‌: కాంగ్రెస్​ పార్టీ (Congress Party) లో కొద్దిరోజుల క్రితం మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ మధ్య వివాదం మరువక ముందే.. కాంగ్రెస్ మంత్రుల మ‌ధ్య మరో పంచాయితీ మొదలైంది. వ‌రంగ‌ల్‌లోని మేడారం జాత‌ర‌ అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కి అలాగే ఆ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ‌ (Konda Surekha)కు మధ్య విభేదాలు ముదిరి పాకాన ప‌డ్డాయి. మంత్రి పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వరంగల్‌ రాజకీయాలతోపాటు దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి అన‌వ‌స‌రంగా జోక్యం చేసుకుంటు న్నార‌ని కొండా దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే ఈ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు చేశారు. పొం...
3వ తరగతి నుంచే Ai పాఠాలు – వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభం
career

3వ తరగతి నుంచే Ai పాఠాలు – వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభం

Ai education in primary Schools | 2026 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని 3వ తరగతి నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రాథమిక స్థాయిలోనే స్కిల్ ఇండియా పర్యావరణ వ్యవస్థలో ఈ అంశాన్ని చేర్చడానికి విద్యా మంత్రిత్వ శాఖ వేగంగా కృషి చేస్తోంది. ఆర్థిక వ్యవస్థలో Ai కొత్త ఉద్యోగ అవకాశాల కోసం రోడ్‌మ్యాప్‌పై NITI ఆయోగ్ నివేదికను ప్రారంభించిన సందర్భంగా, పాఠశాల విద్య శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది కొత్త సెషన్ నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పాఠశాల విద్యార్థుల కోసం 3వ తరగతి నుంచి Ai పాఠ్యాంశాలను తయారు చేస్తామని అన్నారు. దేశంలోని అన్ని పాఠశాలల్లో Ai పాఠ్యాంశాలు ప్రస్తుతం, CBSE పాఠశాలలు 8వ తరగతి నుంచే ఈ సబ్జెక్టును చ‌దువుకునే అవకాశాన్ని విద్యార్థులకు అందిస్తున్నాయి. వీలైనంత త్వరగా అన్ని పాఠశాలల్లో పాఠశాల విద్యలో A...
Heavy Rains | వ‌చ్చే నాలుగు రోజులు కుండ‌పోత‌ వ‌ర్షాలు..
State

Heavy Rains | వ‌చ్చే నాలుగు రోజులు కుండ‌పోత‌ వ‌ర్షాలు..

11న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం Heavy Rains in Telangana | తెలంగాణ‌లో రాబోయే నాలుగు రోజులు ఉరుములు మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు తెలంగాణ, ఏపీ మీదుగా ద్రోణి కొనసాగుతోంద‌ని.. దీనికి ఉపరితల ఆవర్తనం తోడైందని వెల్ల‌డించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈనెల 11నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని హెచ్చ‌రించింది. దీంతో వచ్చేవారం మళ్లీ కుండపోత వర్షాలు తప్పవని పేర్కొన్నది. ఈమేర‌కు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Heavy Rains) కురిసే ప్ర‌మాద‌ముంద‌ని తెలిపింది. ఇక శనివారం, ఆదివారాల్లో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర...
Gold Price | పసిడి రికార్డు ధరలు – షాక‌వుతున్న జ‌నం
Business

Gold Price | పసిడి రికార్డు ధరలు – షాక‌వుతున్న జ‌నం

Gold Price Today : కొద్దిరోజులుగా బంగారం ధరలు తారాజువ్వ‌లా నింగికెగసిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో బంగారం ధర రోజుకో సరికొత్త రికార్డును నమోదు చేస్తోంది. మొన్నటి వరకు 10 గ్రాముల ధర రూ.లక్ష దాటితేనే అవాక్క‌యిన జ‌నం తాజాగా రూ.1.25 లక్షలకు చేరుకోవడం చూసి షాక్ అవుతున్నారు. పుత్తడి ఔన్సు తొలిసారి 4వేల డాలర్ల మార్కును దాటింది. అమెరికా ఫెడరల్‌ ‌గవర్నమెంట్‌ ‌షట్‌డౌన్‌, ఆ ‌దేశ ఆర్థిక పరిస్థితిపై నెలకొన్న అనిశ్చితులు పసిడికి తాజాగా డిమాండ్‌ ‌పెంచుతున్నాయి. బంగారం ధర బుధవారం మరింత పెరిగింది. ఒక్కరోజే రూ.2,290 పెరిగి గ‌రిష్ఠ‌ స్థాయికి చేరింది. హైద‌రాబాద్‌లో ధ‌ర‌లు ఇలా.. Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర బుధవారం తొలిసారి రూ.1,26,070కి ఎగబాకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,750కి చేరింది. మరోవైపు వెండి ధర...
error: Content is protected !!