Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Karur stampede : కరూర్ తొక్కిసలాట కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
National

Karur stampede : కరూర్ తొక్కిసలాట కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మధురై: కరూర్‌లో జరిగిన దారుణమైన తొక్కిసలాట (Karur stampede) ఘటనపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలన్న వాదనను తిరస్కరించింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున, ప్రస్తుతానికి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. సభలు, ర్యాలీల్లో తాగునీరు వంటి కనీస సదుపాయాలు ఎందుకు కల్పించలేదని టీవీకే పార్టీని ప్రశ్నించింది. నీళ్లు, ఆహారం, టాయిలెట్లు, పార్కింగ్ వంటి అవసరాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు సమావేశం నిర్వహించేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారని పోలీసులు వివరణ ఇవ్వాలని కోరింది. బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని పెంచే అంశంపై ప్రభుత్వం రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. న‌టుడు విజ‌య్ పర్య‌ట‌న‌లు వాయిదా ఈ ఘటన నేపథ్యంలో టీవీకే పార్టీ అధ...
రంగశాయిపేటలో రావణవధ కు ఏర్పాట్లు పూర్తి – Dasara Ravanavadha
State, warangal

రంగశాయిపేటలో రావణవధ కు ఏర్పాట్లు పూర్తి – Dasara Ravanavadha

Dasara Ravanavadha 2025 | వ‌రంగ‌ల్ : విజయదశమి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న‌ గురువారం సాయంత్రం రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో రావణవధ‌ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ తెలిపారు. మంగళవారం మహంకాళి గుడి ఆవరణలో రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ ప్రధానకార్యదర్శి దామెరకొండ కరుణాకర్ లు ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించినారు.ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ మాట్లాడుతూ ఈ ఏడాది 36 ఫీట్ల ఎత్తైన రావణ ప్రతిమను ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రకాల బాణసంచాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ రావనవధ (Ravanavadha) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు, విశిష్టఅతిథిగా నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్, గౌరవ అతిథులుగా వరంగల్...
దుర్గాష్టమి రోజున‌ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. – Happy Durga Ashtami Wishes 2025
LifeStyle, Cultural

దుర్గాష్టమి రోజున‌ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. – Happy Durga Ashtami Wishes 2025

Happy Durga Ashtami Wishes 2025 : దేవీ న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి దుర్గాష్టమి, దీనిని మహాష్టమి అని కూడా పిలుస్తారు. దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు ఈ ప‌ర్వదినాన్ని ఎంతో భక్తితో జరుపుకుంటారు. 2025 లో, దుర్గాష్టమిని సెప్టెంబర్ 30, మంగళవారం నాడు శారదియ నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజుగా జరుపుకుంటారు. ఈ రోజు దుర్గాదేవి మరొక అవతారమైన మహాగౌరికి ప్ర‌త్యేక‌మైన‌ది. తొమ్మిది రోజుల వేడుకలలో అష్టమి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. 15 మహా దుర్గాష్టమి శుభాకాంక్షలు (Happy Durga Ashtami Wishes 2025) 1🙏 దుర్గాష్టమి శుభాకాంక్షలు 🙏🌸అమ్మవారి ఆశీర్వాదం మీ జీవితాన్ని ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందాలతో నింపుగాక. 🔱 2 🌺 శుభ దుర్గాష్టమి 🌺శక్తి స్వరూపిణి అమ్మవారి కరుణతో మీ జీవితం విజయాలతో మెరవాలి. ✨ 3 🔱 జయ జయ మహాదుర్గే! 🔱దుర్గాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు 🙏🌼 4 🌸 దు...
హైద‌రాబాద్-విజ‌య‌వాడ 8లైన్ల ర‌హ‌దారిపై కీల‌క అప్‌డేట్‌ – Hyderabad Vijayawada expressway
State, AndhraPradesh

హైద‌రాబాద్-విజ‌య‌వాడ 8లైన్ల ర‌హ‌దారిపై కీల‌క అప్‌డేట్‌ – Hyderabad Vijayawada expressway

Hyderabad Vijayawada expressway | హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం ఇక మరింత సులభం కానుంది. జాతీయ రహదారి (NH65)ని 8 లేన్‌లుగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ‌మైంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికాగా, ఈ భారీ ప్రాజెక్ట్ పనులు 2026 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. ప్రతి రోజు భారీ ట్రాఫిక్‌తో ఇబ్బందులు ప‌డుతున్న ఇరురాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు ఇది భారీ ఊర‌ట ల‌భించ‌నుంది. ఈ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో 17 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి ఫ్లైఓవర్లు కూడా నిర్మించ‌నున్న‌ట్లు మంత్రి కోమ‌టిరెడ్డి వెల్లడించారు. ఇటీవల దిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావించానని మంత్రి తెలిపారు. కేవలం రెండు గంటల్లో హైదరాబాద్ నుండి విజయవాడకుకొత్త రహదారి పూర్తయిన తర్...
తమిళనాడు కరూర్‌లో విషాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య‌ – Tamil Nadu Karur stampede
National

తమిళనాడు కరూర్‌లో విషాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య‌ – Tamil Nadu Karur stampede

Tamil Nadu Karur stampede : శ‌నినివారం (సెప్టెంబర్ 27) తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 39కి చేరింది. చెన్నై నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరూర్‌లోని వేదిక వద్ద మధ్యాహ్నం నుండి భారీ సంఖ్యలో గుమిగూడిన ప్ర‌జ‌లను ఉద్దేశించి విజయ్ ప్రసంగిస్తుండగా, రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. టీవీకే నాయకుడు, స్టార్ హీరో జోసెఫ్‌ విజ‌య్ చూడటానికి వారు గంటల తరబడి వేచి ఉన్నారు. తన ప్రచార వాహనంపై నుంచి ప్రసంగిస్తున్న విజయ్, ప్రజలు మూర్ఛపోతున్నారని, పడిపోతున్నారని గమనించి చాలా మంది కార్మికులు కేక‌లు వేయ‌డంతో తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు. ఇంతలో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిస్థితిని సమీక్షించడానికి సచివాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి వి...
error: Content is protected !!