Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ACB : రూ.12 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ.. చివరకు..
Crime

ACB : రూ.12 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ.. చివరకు..

ACB | రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ప్రజలను లంచాలతో పీడిస్తున్న అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం ఇస్తే చాలు ఇట్టే వాలిపోతున్నారు ఏసీబీ అధికారులు.. పక్కాగా వల పన్ని లంచావతారులను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మే29న లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఇబ్రంహీంపట్నం మండలం ఆర్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకంలో స్థలాన్ని నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ (RI) ను ఏసీబీ అధికారులు (ACB Officials) అరెస్టు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం చోటుచేసుకుంది. సర్వే నంబర్‌ 355లో ఏడు గుంటల భూమిని నమోదు చేసేందుకు ఆర్‌ఐ కృష్ణ ఏకంగా రూ.12లక్షల లంచం ఇవ్వాల‌ని ఒత్తిడి చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు చివ‌ర‌కు రూ.9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్...
MLC Kavitha : పార్టీ మార్పుపై ఎమ్మెల్సీ కవిత కీల‌క ప్ర‌క‌ట‌న‌
State

MLC Kavitha : పార్టీ మార్పుపై ఎమ్మెల్సీ కవిత కీల‌క ప్ర‌క‌ట‌న‌

BRS MLC Kavitha | బిఆర్ఎస్ పార్టీలో విబేధాలు కొనసాగుతున్న వేళ సంచలన ఆరోపణలు చేసి రాజకీయంగా తీవ్ర కలకలం రేపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా కీలక ప్రకటన చేశారు. పార్టీ నుంచి తాను బయటకు వస్తున్నట్లు ఒక తెలుగు పత్రికలో వచ్చిన వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు, అవి నిరాధారమైనవని కొట్టిపారేశారు. తనను సంప్రదించకుండానే ఇలాంటి ఊహాజనిత వార్తలు ప్రచురించడం పట్ల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు కల్వకుంటల కవిత Xలో ఒకపోస్టు చేశారు. మూడు రోజుల వ్యవధిలో ఒక స్థానిక పత్రిక వాస్తవ విరుద్ధమైన కథనాలను ప్రచురించిందని కవిత విమర్శించారు. "నా గురించి ఈ వార్తను నన్ను సంప్రదించకుండా ప్రచురించడాన్ని జర్నలిజం లేదా శాడిజం అని పిలవాలా?" అని ఆమె నకిలీ వార్తలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ పోస్టులో సదరు వార్తల క్లిప్పింగ్‌లను కూడా షేర్ చేశారు. కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త...
Fish Prasadam | చేప మందు పంపిణీకి ఈసారి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
Hyderabad, State

Fish Prasadam | చేప మందు పంపిణీకి ఈసారి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

Hyderabad Fish Prasadam 2025 : ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లక్షలాది మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో స‌చివాలయంలో చేప ప్రసాదం పంపిణీపై బుధ‌వారం సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు గతేడాది కంటే అదనంగా మరిన్ని ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ఈసారి చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను సిద్దం చేసినట్లు మ‌త్స్య‌శాఖ‌ అధికారులు మంత్రికి తెలిపారు. చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని సూచించారు. క్యూ లైన్ల‌లో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని, మహిళలకు వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన...
MSP | రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
National

MSP | రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

New Delhi : దేశ‌వ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వరి మద్దతు ధర (MSP) పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఖరీఫ్‌ ‌సీజన్‌కు వరి మద్దతు ధరను రూ.69ల‌కు పెంచింది. తాజా పెంపుతో క్వింటా వరి మద్దతు ధర రూ.2,369 కి చేరింది. ఈ మద్దతు ధర కోసం కేంద్రం రూ.2.70 లక్షల కోట్ల కేటాయించింది. అంతేకాదు.. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్ల నిధుల‌ను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. పెట్టుబడిపై రైతులకు 50 శాతం లాభం ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్‌ ‌సీజన్‌లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2025-26 ఖరీఫ్‌ ‌సీజన్‌కు సంబంధించి క్వింటాల్‌ ‌వరిపై రూ.69 పెంచడంతో కనీస మద్దతు ధర రూ.2369కి చేరింది. కేంద్ర క్యాబినెట్‌ ‌నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ‌బుధ‌వారం మీడియాకు వెల్లడించారు. గత 10-11 ఏళ్లలో ఖరీఫ్‌ ‌పంటలకు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌(MSP) ను భారీగ...
పంటనష్ట పరిహారం నిధుల విడుదల  – Crop Loss Compensation
State, Hyderabad

పంటనష్ట పరిహారం నిధుల విడుదల – Crop Loss Compensation

Crop Loss Compensation | రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుధఫాలుగా వడగళ్ల వానలు, అకాలవర్షాలకు పంట నష్టం సంభవించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు వ్యవసాయ శాఖ రైతుల వారీగా పంటనష్టం అంచనవేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ నష్ట పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు వీలుగా సర్వేకు ఆదేశాలివ్వగా నివేదికలు ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన 51.528 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని త్వరలోనే నష్టపోయిన రైతుల ఎకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను వ్యవసాయశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. డమైనది. రాష్ట్రవ్యాప్తం...
error: Content is protected !!