Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ఏపీలో కొవిడ్ కేసు.. ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు -COVID-19
State, AndhraPradesh

ఏపీలో కొవిడ్ కేసు.. ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు -COVID-19

Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో COVID-19 ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం ఒక సలహా జారీ చేసింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు వంటి బ‌హిరంగ‌ సమావేశాలను నిలిపివేయాలని ప్రజలను కోరింది. వృద్ధులు (60 ఏళ్లు పైబడిన వారు), గర్భిణులు ఖచ్చితంగా ఇంటి లోపలే ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలు పరిశుభ్రత పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు, ఇందులో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, దగ్గు, తుమ్ములు వ‌చ్చిన‌పుడు ముఖాన్ని తాకకుండా ఉండటం వంటివి చేయాల‌ని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలలో, ముఖ్యంగా రద్దీగా ఉండే లేదా సరిగా గాలి లేని ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని అభ్యర్థించింది. అంతకుముందు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ...
త్వరలో 5000 మంది సర్వేయర్ల నియామకం – Surveyor Jobs in Telangana
career, State

త్వరలో 5000 మంది సర్వేయర్ల నియామకం – Surveyor Jobs in Telangana

Surveyor Jobs in Telangana | రాష్ట్రంలోని నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అతిత్వరలో లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గురువారం వెల్లడించారు. తొలివిడ‌త‌లో 5000 మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను నియమించునున్నామని ఆయన తెలిపారు. న‌క్షా లేని గ్రామాలు, లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల శిక్ష‌ణపై గురువారం మంత్రి పొంగులేటి అధికారుల‌తో స‌మీక్ష సమావేశం నిర్వహించారు. Surveyor : 26 నుంచి రెండు నెలలపాటు శిక్షణ కొత్త సర్వేయర్ల (Surveyor )కు ఈనెల 26న సోమవారం నుంచి రెండు నెలల పాటు ఆయా జిల్లా కేంద్రాల్లోనే శిక్ష‌ణ ఇప్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ద‌ర‌ఖాస్తుదారులు సోమ‌వారం వారివారి జిల్లా స‌ర్వే అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని మంత్రి సూచించారు. మంత్రి పొంగులేటి చెప్పిన వివరాలను బట్టి శిక్ష‌ణ పూర్తి చేసుకున్న సర్...
Rain : వచ్చే ఐదు రోజలు భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
State

Rain : వచ్చే ఐదు రోజలు భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain | రాష్ట్రంలో రానున్నఐదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని తెలిపింది. తర్వాత రెండు రోజుల్లో ఇది మరింత బలపడుతందని పేర్కొంది. ఈక్రమంలో రాబోయే రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని.. ప్రస్తుతం కేరళ, తమిళనాడు, కర్నాటకలో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. కాగా గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆదిలాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రేపు పలు జిల్లో వర్షాలు ఈనెల 23న శుక్రవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల...
Chhattisgarh : ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి
Crime

Chhattisgarh : ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం (Bastar district) లోని అబుజ్మద్ అడవుల్లో భారీ కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మరణించినట్లు చెబుతున్నారు. నారాయణపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ ప్రకారం, మావోయిస్టుల మాడ్ డివిజన్‌కు చెందిన అగ్రశ్రేణి క్యాడర్లు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బుధవారం తెల్లవారుజామున సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. చత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం బీజాపూర్ – నారాయణపూర్ జిల్లాల మధ్య గల మాడ్ డివిజన్ పరిధిలోని అబూజ్మాడ్ అడవుల్లో భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ కొన‌సాగిస్తున్నాయి. బుధవారం ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుప‌డి జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర పోరు జ‌రిగింది. ఇప్పటి వరకు ఈ ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్...
తిరుమల తిరుపతి దేవస్థానంలో యాంటీ-డ్రోన్ టెక్నాలజీ -TTD Board meeting
State

తిరుమల తిరుపతి దేవస్థానంలో యాంటీ-డ్రోన్ టెక్నాలజీ -TTD Board meeting

TTD Board meeting : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని యాంటీ-డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు నిర్ణయించింది. TTDలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బదిలీ చేయడానికి లేదా వారికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అందించడం ద్వారా బదిలీ చేయడానికి కూడా నిర్ణ‌యించారు.మంగళవారం తిరుమలలో టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన టీటీడీ బోర్డు సమావేశం (TTD Board meeting) లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. బోర్డు సమావేశం తర్వాత టీటీడీ ఈఓ జె.శ్యామలారావు బోర్డు సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను మీడియాకు వివరించారు. "గోవింద నామావళి" మంత్రాన్ని రీమిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు డిడి నెక్స్ట్ లెవల్ చిత్ర బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిటిడి బోర్డు నిర్ణయించింది. తిరుచానూరు, అమ...
error: Content is protected !!