Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Rain Alert | చ‌ల్ల‌ని క‌బురు.. మ‌రికొద్దిరోజుల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌ర్షాలు
State

Rain Alert | చ‌ల్ల‌ని క‌బురు.. మ‌రికొద్దిరోజుల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌ర్షాలు

Hyderabad Rain Alert : రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ అంతటా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD)-హైదరాబాద్ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ తోపాటు అనేక ఇతర జిల్లాల్లో వర్షం ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మే 19న హైదరాబాద్‌లో 29°C ఉష్ణోగ్రత నమోదైంది, తేమ 70%, తూర్పు-ఆగ్నేయ దిశ నుండి గంటకు 9.3 కి.మీ వేగంతో గాలులు వీచాయి. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5°C తక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్ మరియు అనేక ఇతర జిల్లాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. Rain Alert ...
పాకిస్తాన్ కోసం గూఢచర్యం ఆరోపణలు.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు – Uttar Pradesh police
Crime

పాకిస్తాన్ కోసం గూఢచర్యం ఆరోపణలు.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు – Uttar Pradesh police

Uttar Pradesh police UP businessman : పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తోంద‌నే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్, ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అయిన కొన్ని రోజుల తర్వాత, పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) రాంపూర్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తను అరెస్టు చేసింది. పాకిస్తాన్ తరఫున సరిహద్దు అక్రమ రవాణా, గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు STF కి నిఘా సమాచారం అందడంతో నిందితుడు షాజాద్‌ను మొరాదాబాద్‌లో అరెస్టు చేశారు. అధికారుల ప్రకారం, షాజాద్ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌లోని తన నిర్వాహకులకు చేరవేస్తున్నాడు ఇటీవలి సంవత్సరాలలో వ్యాపారం నిర్వహించే నెపంతో షాజాద్ అనేకసార్లు పాకిస్తాన్‌ను సందర్శించాడని STF ఒక ప్రకటనలో తెలిపింది. అతను సౌందర్య సాధనాలు, బట్టలు, సుగ...
ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి
Crime

ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి

Fire accident in Hyderabad : హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుల్జార్ హౌస్‌లోని మొదటి అంతస్తులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఏర్పాటు చేసిన ఏసీ కంప్రెషర్ పేలి మంటలు చెలరేగినట్లు (Fire Accident) అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. ఘటనా స్థలిలోనే నలుగురు చనిపోగా.. మరో 13 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మరికొంతమంది గాయపడగా.. క్షతగాత్రులను మలక్‌పేటలోని యశోద ఆస్పత్రి, అపోలో, డీఆర్డీవో ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....
రైల్వే కొత్త నియమాలను మీరు గమనించారా? -Indian Railway Rules – 2025
National, Trending

రైల్వే కొత్త నియమాలను మీరు గమనించారా? -Indian Railway Rules – 2025

Indian Railway Rules | మనం రైలులో ప్ర‌తిసారి మన టికెట్‌పై రాసిన కోచ్, సీటు నంబర్‌ ప్ర‌కార‌మే కూర్చుని ప్ర‌యాణిస్తాం కాదా.. అయితే, కొంతమంది వెయిటింగ్ టిక్కెట్లతో ఏసీ, స్లీపర్ కోచ్‌లలో య‌థేచ్ఛ‌గా ద‌ర్జాగా ప్ర‌యాణిస్తుంటారు. కానీ ఇప్పటి నుంచి మీరు ఇలా చేయకపోవడమే మంచిది, ఎందుకంటే భారతీయ రైల్వే కొత్త నిబంధనను తీసుకువ‌చ్చింది. దీని ప్రకారం మీరు వెయిటింగ్ టికెట్‌తో AC లేదా స్లీపర్ కోచ్‌లలో ప్రయాణిస్తున్నట్లు దొరికితే, TTE మీకు భారీ జరిమానా విధించవచ్చు. అవును, మీరు ఇకపై వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్, AC కోచ్‌లలో ప్రయాణించలేరు. మీరు రైలులో ప్రయాణించబోతున్నట్లయితే, ఈ కొత్త నియమాన్ని తప్పకుండా పరిశీలించండి, బహుశా ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త‌ నిబంధనలు ఒకే PNR (ట్రావెల్ బుకింగ్ నంబర్) పై సమూహంగా ప్రయాణిస్తున్న వారిని, కొంతమంది కన్ ఫార్మ్ టికెట్‌, మరికొందరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారిని ప...
BSNL BiTV : రీఛార్జ్ లేకుండా 450 లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా చూసేయండి..
Technology

BSNL BiTV : రీఛార్జ్ లేకుండా 450 లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా చూసేయండి..

BSNL BiTV : భారతదేశ ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారులందరికీ ఉచితంగా లైవ్‌ టీవీ ఛానెళ్లను అందించడం ద్వారా సంచ‌ల‌నం సృష్టించింది. బిఎస్‌ఎన్ఎల్‌ కంపెనీ 450 కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను చూపిస్తోంది. వీటి కోసం వినియోగదారులు ఎటువంటి అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు చేసే ఏ రీఛార్జి ప్లాన్ తీసుకున్నా ఈ బిఐ టీవీ సౌకర్యం అందిస్తున్న‌ట్లు బిఎస్ఎన్ఎల్ పేర్కొంది. మ‌రో విష‌య‌మేంటంటే ప్రజల ఫోన్లలో ఇంటర్నెట్ లేకపోయినా, వారు ప్రత్యక్ష టీవీ ఛానెళ్లను చూడగలుగుతారు. ఈ సేవ పేరు BSNL BiTV. ఈ సేవ ఎలా పనిచేస్తుందో ఇపుడు తెలుసుకుందాం. BSNL BiTV అనేది ఒక కొత్త టెక్నాల‌జీ. దీని ద్వారా కంపెనీ తన వినియోగదారులకు వారి మొబైల్ ఫోన్లలో 450 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను అందిస్తుంది. మీరు ఉచితంగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు కూడా వీక్షించ‌వ‌చ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అందరు BSNL కస్టమర్లు...
error: Content is protected !!