Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
Theft Gang | వింత దొంగల ముఠా  గుట్టు ర‌ట్టు – నకిలీ వాంతులతో నగలు దోచే మహిళా గ్యాంగ్
State

Theft Gang | వింత దొంగల ముఠా గుట్టు ర‌ట్టు – నకిలీ వాంతులతో నగలు దోచే మహిళా గ్యాంగ్

Women Theft Gang | విచిత్రమైన మహిళా దొంగల ముఠా సంచలనాన్ని రేపింది. బస్సులు, ఆటోలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో తోటి మహిళా ప్రయాణికులను నమ్మించి, "వాంతి" చేస్తున్నట్లు నటిస్తూ నగలు, డబ్బులు కాజేస్తున్న ఆరుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. క‌నీవినీ ఎరుగుని రీతిలో కొత్త ర‌హాలో న‌మ్మించి న‌గ‌లు, డ‌బ్బులు కాజేస్తున్న ఆరుగురు సభ్యులతో కూడిన పూర్తిగా మహిళా ముఠా ఉందంతం ఇది. ఈ మ‌హిళ‌ల‌ గుంపు వాంతి చేసుకుంటున్నట్లు నటించి భయాందోళనలకు గురిచేస్తుంటారు. ఆ తర్వాత తోటి ప్ర‌యాణికులు ప‌ర‌ధ్యానంలో ఉండ‌గా వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పారిపోతారని అధికారులు వెల్ల‌డించారు. DCP శశాంక్ సింగ్ మాట్లాడుతూ, "వారిలో ఒకరు ఆటోగానీ బ‌స్సుగానీ ప్ర‌యాణిస్తుండ‌గా ఎంతో క‌లివిడిగా ప్ర‌వ‌ర్తిస్తూ క‌లివిడిగా మాటల్లో దింపుతారు. అందులో ఒకరు వికారం వచ్చినట్లు నటించి దుపట్టా లేదా పాలిథిన్ బ్యాగ్‌లోకి 'వాంతి' చేయడం ప్ర...
Vikarabad | వికారాబాద్ జిల్లాలో దారుణం – భార్య, వదిన, కూతురిపై కత్తితో దాడి చేసి ఆత్మహత్య
Crime

Vikarabad | వికారాబాద్ జిల్లాలో దారుణం – భార్య, వదిన, కూతురిపై కత్తితో దాడి చేసి ఆత్మహత్య

Vikarabad Tragic Incident | వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి త‌న‌ భార్య, వదిన, కూతురిని హత్య చేసి, తానూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే కులకచర్లకు చెందిన వేపూరి యాదయ్య ఆదివారం తెల్లవారు జామున ఇంట్లో నిద్రిస్తున్న భార్య అలివేలు (32), కుమార్తెలు అపర్ణ (13), శ్రావణి (10), వదిన హనుమమ్మ (40)ల పై కత్తితో కిరాతకంగా దాడి చేసి బ‌లిగొన్నాడు. ఆపై అత‌డూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దాడితో గాయాలపాలై ప్రాణాలతో బయటపడిన‌ యాదయ్య పెద్ద కూతురు అపర్ణ త‌రుకొని ఇరుగుపొరుగువారికి చెప్పింది. స్థానికులు వచ్చి చూసేసరికి భార్య, వదిన, చిన్న కుమార్తెతో పాటు యాదయ్య మృతదేహాలు క‌నిపించాయి. స్థానికులు కులకచర్ల పోలీసుల‌కు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న గాయాలతో విల‌విల‌లాడుతున్న అపర్ణను ఆస్పత్రికి తరలించారు. ప...
Colleges Bandh | 3 నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌
State, Hyderabad

Colleges Bandh | 3 నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల అల్టిమేటం హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపులపై వెంట‌నే నిర్ణయం తీసుకోకపోతే నవంబర్‌ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ కాలేజీలు నిరవధికంగా బంద్ (Colleges Bandh ) చేస్తామ‌ని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్‌ రమేష్‌ బాబు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఎటువంటి స్పష్టమైన నిర్ణయం రాలేద‌ని తెలిపారు. మొత్తం రూ.1,200 కోట్ల బకాయిల్లో ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించింద‌ని చెప్పారు. మిగిలిన రూ.900 కోట్లు దీపావళికి ముందు ఇవ్వాలని కోరామ‌ని కానీ, ఇప్ప‌టివ‌ర‌కు చెల్లించ‌లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.కాగా నవంబర్‌ 2 లోపు ప్రభుత్వం చెల్లింపులపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే, నవంబర్‌ 3 నుంచి రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా...
గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్‌పాయిజ‌న్‌.. ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలు ‌‌ – Food Poisoning
State

గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్‌పాయిజ‌న్‌.. ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలు ‌‌ – Food Poisoning

Jogulamba Gadwal : ఐజా మండలం షేక్‌పల్లిలోని ఎస్సీ రెసిడెన్షియల్ పాఠ‌శాల‌-క‌ళాశాల‌లో శనివారం ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) తో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్రీనివాస్ (ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం), అఖిలేష్‌ (ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం) భరత్ (ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం) ముగ్గురు విద్యార్థులను చికిత్స కోసం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వారికి ఉద‌యం అల్పాహారంగా జీరా రైస్ వడ్డించినట్లు సమాచారం. పాఠశాల సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే బాధిత విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. యాదృచ్ఛికంగా, ఈ పాఠశాల ధర్మవరంలోని బీసీ హాస్టల్ నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 50 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలా...
Telangana Govt| తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!
Hyderabad

Telangana Govt| తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

Hyderabad : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు (Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలు, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి శాఖలకు పెండింగ్‌ బిల్లులు మొత్తం రూ.1,031 కోట్లు విడుదల చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.ఈ మేర‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు నిధుల‌ను విడుదల చేశారు. శుక్రవారం ప్రజా భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో ఉప‌ముఖ్య‌మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా డిప్యూటీ సీఎం క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ నెల‌కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ విడుదల చేసింది. మ‌రోవైపు రూ.10 లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం ని...
error: Content is protected !!