Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
మొంథా ఎఫెక్ట్.. నేడూ అతిభారీ వ‌ర్షాలు – Montha Cyclone Update
State, Karimnagar

మొంథా ఎఫెక్ట్.. నేడూ అతిభారీ వ‌ర్షాలు – Montha Cyclone Update

Montha Cyclone Update | ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న మొంత తుఫాను ఉత్తర-వాయువ్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలి, తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, బుధవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా కేంద్రీకృతమై ఉంది. ఈ వ్యవస్థ ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.దీని ప్రభావంతో గురువారం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలలోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర మరియు దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 60–70 కి.మీ వేగంతో, గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఈ ప్రాంతాలలో క్రమంగా గంటకు 40–50 కి.మీ., లేదా 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావ‌ర‌ణ శాఖ అధిక...
Cyclone Montha | మొంథా తుపాన్ ఎఫెక్ట్.. అధికారుల‌కు సీఎం రేవంత్‌ అత్యవసర ఆదేశాలు
State, Hyderabad

Cyclone Montha | మొంథా తుపాన్ ఎఫెక్ట్.. అధికారుల‌కు సీఎం రేవంత్‌ అత్యవసర ఆదేశాలు

Hyderabad | మొంథా తూపాన్‌ (Cyclone Montha) తీవ్ర వాయుగుండంగా మారి దక్షిణ భారతదేశంలో కుంభ‌వృష్టి కురిపిస్తోంది. తెలంగాణలో కూడా తుఫాను ప్రభావం పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం దాటిన మొంథా తుఫాన్‌ భద్రాద్రి కొత్తగూడం మార్గంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ‌వారం ఉద‌యం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ (Warangal) , నల్గొండ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి కలెక్టర్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సమన్వయంతో నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని చెప్ఆప‌రు.సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి, వర్షాల ప్రభావం, నష్టాలపై అత్య‌వ‌సరంగా చేప‌ట్టాల్సిన ప‌నుల‌పైసమీ...
Maoist | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ: కీలక మావోయిస్టు సరెండర్
Crime

Maoist | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ: కీలక మావోయిస్టు సరెండర్

Hyderabad | మావోయిస్టు పార్టీ (Maoist party ) కి వ‌రుస‌ ఎదురుదెబ్బలు త‌గులుతున్నాయి. అగ్ర నాయకులు వరుసగా లొంగిపోవ‌డం పార్టీకి మింగుడుప‌డ‌డం లేదు. తాజాగా ఆ పార్టీ కీలక నేత, తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు, నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్ బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ పోలీసుల‌కు లొంగిపోయారు. మంగ‌ళ‌వారం ఆయన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సమక్షంలో అధికారులకు లొంగిపోతున్నట్లు ప్రకటించారు. బండి ప్రకాశ్ ప్ర‌స్థానం గత 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన బండి ప్రకాశ్, తెలంగాణలో ఆ పార్టీ కార్యకలాపాల్లో ప్రధాన పాత్ర పోషించారు. మొదట సింగరేణి కార్మికుడిగా పనిచేశారు. 1980లో పీపుల్స్ వార్ ఉద్యమాలతో ఆకర్షితుడై, సింగరేణి కార్మిక సమాఖ్యలో చేరారు. 1988లో బెల్లంపల్లి ప్రాంతంలో కమ్యూనిస్ట్ నేత అబ్రహం హత్య కేసులో ప్ర‌కాశ్ అరెస్ట‌య్యారు.ఆదిలాబాద్ సబ్ జైలులో శిక్ష అనుభవ...
KTR | తెలంగాణ‌లో బుల్డోజ‌ర్ పాల‌న రాహుల్ స‌మాధానం చెప్పాలి..
Hyderabad

KTR | తెలంగాణ‌లో బుల్డోజ‌ర్ పాల‌న రాహుల్ స‌మాధానం చెప్పాలి..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ప్రజలు బీఆర్‌ఎస్ ప్రగతిని గుర్తు చేసుకోవాలి – KTR Hyderabad | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు బీఆర్‌ఎస్ పదేళ్ల ప్రగతి పాలనను, గత రెండేళ్ల కాంగ్రెస్ మోసపూరిత పాలనను తూకం వేసి సరైన నిర్ణయం తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విజ్ఞప్తి చేశారు. శనివారం షేక్‌పేట్ డివిజన్‌లోని రిలయన్స్ జూబ్లీకేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పాలన నడుపుతోందని విమర్శించారు. “తెలంగాణలో మైనార్టీ ప్రాతినిధ్యం లేకుండా తొలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆరుగురు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వని కాంగ్రెస్‌పై అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి,” అని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండూ క‌లిసే ప‌నిచేస్తున్నాయి.. కేటీఆర్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి, బీజేపీ నే...
ACB Raid | రూ.2 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన కోపరేటివ్‌ జిల్లా అధికారి
Crime, Adilabad

ACB Raid | రూ.2 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన కోపరేటివ్‌ జిల్లా అధికారి

ACB Raid in Mancherial | మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు(ACB Raid) చేసి ఓ అవినీతి తిమింగ‌ళాన్ని ప‌క్కా ప్లాన్‌తో ప‌ట్టుకున్నారు.. శనివారం మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ పట్టణంలోని తన నివాసం వద్ద రూ.2 లక్షల లంచం(Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు చిక్కాడు. ఏసీబీ ఆదిలాబాద్ ఏఎస్పీ మధు( ASP Madhu ) క‌థ‌నం ప్రకారం.. ఆసిఫాబాద్ సహకార జిల్లా ఇన్‌చార్జి అధికారిగా పని చేస్తున్న సమయంలో అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి గతేడాది నవంబరులో సస్పెన్ష‌న్‌కు గుర‌య్యాడు. అయితే సదరు ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు, సస్పెండ్ ఎత్తివేయడం కోసం ఏకంగా రూ.7 లక్షలను లంచంగా డిమాండ్ చేశాడు.ఇందులో భాగంగా మొదటి విడతగా రూ. 2 లక్షల ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు శనివారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయంలోని ...
error: Content is protected !!