Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
ACB Raid | రూ.2 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన కోపరేటివ్‌ జిల్లా అధికారి
Crime, Adilabad

ACB Raid | రూ.2 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన కోపరేటివ్‌ జిల్లా అధికారి

ACB Raid in Mancherial | మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు(ACB Raid) చేసి ఓ అవినీతి తిమింగ‌ళాన్ని ప‌క్కా ప్లాన్‌తో ప‌ట్టుకున్నారు.. శనివారం మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ పట్టణంలోని తన నివాసం వద్ద రూ.2 లక్షల లంచం(Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు చిక్కాడు. ఏసీబీ ఆదిలాబాద్ ఏఎస్పీ మధు( ASP Madhu ) క‌థ‌నం ప్రకారం.. ఆసిఫాబాద్ సహకార జిల్లా ఇన్‌చార్జి అధికారిగా పని చేస్తున్న సమయంలో అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి గతేడాది నవంబరులో సస్పెన్ష‌న్‌కు గుర‌య్యాడు. అయితే సదరు ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు, సస్పెండ్ ఎత్తివేయడం కోసం ఏకంగా రూ.7 లక్షలను లంచంగా డిమాండ్ చేశాడు.ఇందులో భాగంగా మొదటి విడతగా రూ. 2 లక్షల ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు శనివారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయంలోని ...
Student Suicide | పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం..
Crime

Student Suicide | పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం..

Student Suicide in Hanmakonda | హనుమకొండ జిల్లా వంగర ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య (Student Suicide) ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని వనం వర్షిత శుక్రవారం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. దీపావళి సెలవుల అనంత‌రం అక్టోబర్ 23న పాఠశాలకు తిరిగివచ్చిన వర్షిత, మరుసటి రోజు ఉదయం తన యూనిఫాం చున్నీతో ఉరి వేసుకున్నది. విగ‌త జీవిగా ఉన్న వ‌ర్షిత‌ను గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్క‌డికి చేరుకొని మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న డీఈఓ వాసంతి పాఠశాలను సందర్శించి విచారణ చేప‌ట్టారు. స్నేహితుల ప్రకారం, వర్షిత చదువులో ప్రతిభావంతురాలు. క్లాస్ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, అందరితో కలిసిమెలిసి ఉండేది. ...
జీఎస్టీ 2.0: నవంబర్‌ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ – చిన్న వ్యాపారాలకు భారీ ఊరట! – New GST Registration System
Business

జీఎస్టీ 2.0: నవంబర్‌ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ – చిన్న వ్యాపారాలకు భారీ ఊరట! – New GST Registration System

New GST Registration System | నవంబర్ 1, 2025 నుండి కొత్త GST రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవస్థ కింద, తక్కువ-రిస్క్‌గా గుర్తించబడిన దరఖాస్తుదారులు, నెలవారీ అవుట్‌పుట్ పన్ను బాధ్యత రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్నవారు సహా, మూడు పని దినాలలోపు ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఆమోదాలను పొందుతారు. ఈ మార్పు దాదాపు 96 శాతం కొత్త దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని, జాప్యాలను తగ్గిస్తుందని, సమ్మతి భారాలను తగ్గిస్తుందని భావిస్తున్నారు.ఈ సంస్కరణ విస్తృతమైన GST 2.0 చొరవలో భాగం, ఇందులో 5 శాతం మరియు 18 శాతం హేతుబద్ధమైన రెండు-స్లాబ్ పన్ను నిర్మాణం, లగ్జరీ, ప‌లు హానిక‌ర‌మైన‌ వస్తువులకు 40 శాతం రేటు కూడా...
Government Jobs | రిజిస్ట్రేషన్‌ శాఖలో కొత్తగా 14 మంది సబ్‌ రిజిస్ట్రార్లు
State, Hyderabad

Government Jobs | రిజిస్ట్రేషన్‌ శాఖలో కొత్తగా 14 మంది సబ్‌ రిజిస్ట్రార్లు

Hyderabad | పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌-2 నియామకాలలో ఎంపికై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో 14 మంది కొత్త‌గా సబ్‌ రిజిస్ట్రార్లుగా నియమితుల‌య్యారు. వీరంతా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని (Ponguleti Srinivas Reddy) సచివాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని మంత్రి అభినందించి ఇండియన్‌ స్టాంప్‌ యాక్ట్‌ బుక్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ . స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుందని, ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిజాయతీ, నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వ పేరు ప్రతిష్టలను ఇనుమడిరపజేయాలని ఉద్బోధించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే యువతకు ఉద్యోగావకాశాలు (Government Jobs) లభిస్తున్నాయని అన్నారు. ఆనాటి ప్రభుత్వం చేపట్టిన అరక...
Hyderabad | కవిత కుమారుడు పొలిటిక‌ల్ ఎంట్రీ తల్లితో కలిసి బీసీ బంద్‌ ధర్నాలో పాల్గొన్న ఆదిత్య!
Viral

Hyderabad | కవిత కుమారుడు పొలిటిక‌ల్ ఎంట్రీ తల్లితో కలిసి బీసీ బంద్‌ ధర్నాలో పాల్గొన్న ఆదిత్య!

BC Bandh Hyderabad | తెలంగాణ రాష్ట్ర‌ రాజకీయాల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ కుటుంబం నుంచి మరో తరం పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తోంద‌నే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తాజాగా బీసీ బంద్‌కు మద్దతు తెలుపుతూ రంగంలోకి దిగారు. ఖైరతాబాద్‌ చౌరస్తాలో తెలంగాణ‌ జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత ధర్నా చేశారు. అయితే, ఈ ధర్నాలో ఆమె కుమారుడు ఆదిత్య కూడా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తల్లితోపాటు రోడ్డుపై బైఠాయించి బీసీ రిజర్వేషన్ల కోసం నినాదాలు చేశారు. ఆదిత్య తన రాజకీయ ప్రయాణానికి తొలి అడుగు వేసినట్లు ప‌లువురు భావిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు బంద్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఆ పిలుపున‌కు మద్దతుగా కవిత సైతం ఉద్యమంలో పాల్గొని, బీసీ హక్కుల కోసం తన సమరభే...
error: Content is protected !!