Sarkar Live

State

Kumbh Mela | త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం (Video)
State

Kumbh Mela | త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం (Video)

Pragraj Kumbh Mela 2025 | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఈరోజు కుంభమేళాలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్యస్నానం ఆచరించారు. ఉత్తరప్రదేశ్ లోని టెంపుల్ సిటీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela 2025) లో పాల్గొన్నారు. ఆయన త్రివేణి సంగమం వద్ద పూజలతోపాటు పుణ్యస్నానం చేశారు. బుధవారం ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ… ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కుంభమేళా త్రివేణి సంగమానికి వెళ్లారు. అక్కడి అరైల్ ఘాట్ నుంచి పడవలో సంగం ఘాట్‌కు చేరుకున్నారు ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. . ఆ సమయంలో ప్రధాని మోడీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. భారతదే...
Tirupati flight cancelled | తిరుపతి విమానం రద్దు.. ప్రయాణికుల ఆందోళన
State

Tirupati flight cancelled | తిరుపతి విమానం రద్దు.. ప్రయాణికుల ఆందోళన

Tirupati flight cancelled : హైదరాబాద్‌ నుంచి తిరుపతి (Tirupati) వెళ్లాల్సిన విమానం ర‌ద్దు అయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బుధవారం ఉదయం షంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) నుంచి తిరుపతికి (Tirupati) బయల్దేరాల్సిన విమానం అనుకోని సాంకేతిక కారణాలతో రద్దు అయ్యింది. దీంతో విమానాశ్రయంలో నిరీక్షిస్తున్న ప్రయాణికులు గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. ముంద‌స్తు స‌మాచారం ఇవ్వొచ్చు క‌దా..! తిరుప‌తి విమానంలో ఏడుగురు (Passengers) ప్ర‌యాణించాల్సిన ఉండ‌గా వారు కొన్ని గంట‌ల‌పాటు ఎయిర్‌పోర్టులో వేచి చూడాల్సి వ‌చ్చింది. అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం అందక‌పోవ‌డంతో ఏం జ‌రిగిందో తెలియ‌క అయోమ‌యానికి గుర‌య్యారు. సాంకేతిక లోపాల కారణంగా విమానాన్ని రద్దు చేశామని సిబ్బంది చివ‌ర‌కు ప్రకటించడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం వ్య‌క్తమైంది. విమానం రద్దయిన కారణంగా తమ దర్శన సమయాన్ని మిస్ అవుతా...
Railway projects | తెలంగాణలో రైల్వేకు మ‌హ‌ర్ద‌శ‌.. భారీ ప్రాజెక్టుల‌కు ప్ర‌ణాళిక‌
State

Railway projects | తెలంగాణలో రైల్వేకు మ‌హ‌ర్ద‌శ‌.. భారీ ప్రాజెక్టుల‌కు ప్ర‌ణాళిక‌

New Railway projects : తెలంగాణ (Telangana)లో రైల్వే వ్యవస్థ అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. మ‌రికొన్ని కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి రాబోతున్నాయి. మ‌రిన్ని సౌక‌ర్యాలు మెరుగుప‌డనున్నాయి. రైల్వే (Railway) ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను పటిష్టం చేయ‌డం, ఎల‌క్ట్రీఫికేష‌న్‌, స్టేష‌న్ల ఆధునికీక‌ర‌ణ‌, వేగంగా న‌డిచే రైళ్ల కోసం ట్రాక్‌ల అప్‌గ్రేడ్ చేయ‌డం త‌దిత‌ర ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. ముఖ్యంగా న‌మో భార‌త్ (Namo Bharat), అమృత్ భార‌త్ (Amrit Bharat) రైళ్ల‌ను త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నారు. వీట‌న్నిటికీ కేంద్రం కొత్త‌గా రూ.5,337 కోట్లు కేటాయించింది. తెలంగాణలో భారీగా పెట్టుబ‌డులు (Railway projects in telangana ) తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం రైల్వే నెట్‌వర్క్ ఇప్ప‌టికే వంద శాతం విద్యుదీకృతమైంది. దీనికి రూ. 41,677 కోట్ల భారీ పెట్టుబడి పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌తో రాష్ట్రంలో రైళ్ల వేగం పెరుగుతుంది. ఇంధ...
Vidaamuyarchi | అజిత్ మూవీ మేకర్స్ పట్టుదలతో లేరా..
State

Vidaamuyarchi | అజిత్ మూవీ మేకర్స్ పట్టుదలతో లేరా..

తమిళ స్టార్ హీరో అజిత్(Ajith) నుంచి వస్తున్న మూవీ విదాముయార్చి(Vidaamuyarchi). ఈ మూవీ తెలుగులో పట్టుదల అనే పేరుతో రిలీజ్ కాబోతోంది. గ్లామర్ క్వీన్ త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాలవల్ల విడుదల కాలేదు. ఈనెల 6న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. ఆ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ గ్రాండ్ గా ఉన్నాయి. అజిత్ స్టైలిష్ లుక్ తో అదరగొట్టారు. ట్రైలర్ తో ఈ మూవీపై సూపర్ బజ్ ఏర్పడింది. కానీ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సందడి మాత్రం లేదు. ఒక మూవీ రిలీజ్ కి ముందు ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్లు కలిసి మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూ లు ఇస్తారు. అందులో హైలెట్స్ ని చెబుతూ ప్రేక్షకులు ఆ మూవీ ఎందుకు చూడాలో, అందులో ఏముందో చెప్పి వారిలో మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తారు...
Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప‌థ‌కంలో అనర్హుల గుర్తింపు షురూ..
State

Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప‌థ‌కంలో అనర్హుల గుర్తింపు షురూ..

Indiramma Atmiya Bharosa Scheme : రాష్ట్ర ప్రభుత్వం వ్య‌వ‌సాయ రైతు కూలీల కోసం ప్ర‌త్యేకంగా ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విషయం తెలిసిందే.. ఈ స్కీమ్‌ కింద రైతు కూలీల‌కు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయాన్ని రెండు విడ‌త‌లుగా అందించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో వివ‌రాల న‌మోదుకు ఇప్ప‌టికే గ‌డువు పూర్త‌యింది. గ్రామ సభలు, మండల కార్యాలయాల్లో నాలుగు రోజులపాటు దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,24,487 కొత్త ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి దాదాపు సుమారు 6 లక్షల మందిని లబ్ధిదారులను ఎంపిక చేసింది. కొత్తగా వ‌చ్చిన 2,24,487 అప్లికేష‌న్ల‌లో 19,193 ద‌ర‌ఖాస్తుల‌ను ఆమోదించారు. 1,44,784 ద‌ర‌ఖాస్తులు తిర‌స్క‌ర‌ణ‌కు గురయ్య‌యాయి. మరో 59,542 దరఖాస్తుల‌ను పెండింగ్‌లో పెట్టారు. ఇందిరమ్మ...
error: Content is protected !!