Sarkar Live

State

Kadapa | ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య‌లో ట్విస్ట్‌..
AndhraPradesh

Kadapa | ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య‌లో ట్విస్ట్‌..

Kadapa News | కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్మీడియ‌ట్‌ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో అనేక ముఖ్య‌మైన‌ ఆధారాలు సేకరించారు. వైష్ణవి హత్యలో తన స్నేహితుడు లోకేశ్ పాత్ర లేదని డీఐజీ ప్రవీణ్ స్ప‌ష్టం చేశారు. విద్యార్థినిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తెలిపారు. కాగా, ఎర్రగుంట్ల మండలానికి చెందిన వైష్ణవి గ‌త‌ సోమవారం క‌ళాశాల‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేప‌ట్ట‌గా గండికోటలో విద్యార్థిని మృతదేహం ల‌భ్య‌మైంది.. వైష్ణవి చివరిసారిగా స్నేహితులు లోకేష్ ద్విచక్ర వాహనంపై గండికోటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అతనే హత్య చేశాడని కుటుంబం ఆరోపిస్తోంది. దీనితో పోలీసులు లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. ఇప్పటివరకు దర్యాప్తులో అతనికి హత్యకు సంబంధం లేదని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష...
TGBKS | ఎమ్మెల్సీ కవితకు షాక్‌..! బొగ్గు గని కార్మిక సంఘం నుంచి ఉద్వాసన.. ?
State

TGBKS | ఎమ్మెల్సీ కవితకు షాక్‌..! బొగ్గు గని కార్మిక సంఘం నుంచి ఉద్వాసన.. ?

TGBKS | తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TGBKS) నుంచి MLC కవితకు ఉద్వాసన పలికారు. ఇప్పటివరకు ఆ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. తెలంగాణ భవన్‌లో సమావేశమైన సంఘం నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై TGBKS.. బీఆర్ఎస్‌కు అనుబంధంగా పనిచేయాలని నిర్ణయించారు. కవిత, KTRల మధ్య విభేదాలు పెరుగుతున్న తరుణంలో KTR కొప్పుల ఈశ్వర్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల సమావేశం బుధ‌వారం సాయంత్రం జ‌రిగింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాల‌ని కేటీఆర్ సూచించార...
ACB Rids | ఏసీబీ అదుపులో  ఇరిగేషన్ మాజీ చీఫ్ ఇంజనీర్
State, Hyderabad

ACB Rids | ఏసీబీ అదుపులో ఇరిగేషన్ మాజీ చీఫ్ ఇంజనీర్

హైదరాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌ లోని పది చోట్ల ఏకాలంలో సోదాలు.. Hydrabad : నీటి పారుదల శాఖ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ మురళీధర్‌రావు (Muralidar Rao) ఇంట్లో ఏసీబీ ఆకస్మికంగా సోదాలు (ACB Rids) చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు మురళీధర్ రావుపై పలు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌.. మొత్తం 10 చోట్ల ఏకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈఎన్‌సీ జనరల్‌ (ENC General) గా కీలకంగా వ్యవహరించిన మురళీధర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేవ్ రాష్ట్రంలోనే పదవీవిరమణ పొందారు. ఆ తర్వాత ముళీధర్‌రావు పదవీ కాలాన్ని 13 సంవత్సరాల పాటు పొడిగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్నాళ్లు...
నేడు కొత్త రేష‌న్ కార్డుల పంపిణీ  – New Ration Cards
State, Nalgonda

నేడు కొత్త రేష‌న్ కార్డుల పంపిణీ – New Ration Cards

New Ration Cards Distribution | ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న ల‌క్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయ‌డానికి సిద్ధ‌మైంది. ఈరోజు (14వ తేదీ) సూర్యాపేట (Suryapet) జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించ‌నున్న కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా నిర్దేశించిన ప్రభుత్వం కొత్తగా ఈ రేషన్ కార్డులను జారీ చేయనుందని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (Minister Uttam kumar Reddy) పేర్కొన్నారు. కాగా తిరుమలగిరిలో ఏర్పాటు చేసే బహిరంగ సభ వేదికగా లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా కొత్త‌ రేషన్ కార...
Bhadradri Kothagudem : పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు
Khammmam, State

Bhadradri Kothagudem : పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు

Bhadradri Kothagudem : నక్సలిజం హింసాత్మక మార్గాన్ని విడిచిపెట్టి, వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని ఆరుగురు మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ముందు శనివారం లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసు సూపరింటెండెంట్ బి.రోహిత్ రాజు మాట్లాడుతూ, పోలీసు శాఖ "ఆపరేషన్ చేయూత" కార్యక్రమం కింద గిరిజనుల కోసం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల గురించి తెలుసుకున్న తర్వాత మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, కంపెనీ/ప్లాటూన్ కమిటీ (DVCM/CYPC), ఇద్దరు ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు (PPCM), ఏరియా కమిటీ సభ్యులు (ACM), ముగ్గురు పార్టీ సభ్యులు (PMలు) స్వచ్ఛందంగా నక్సలిజం హింసాత్మక మార్గాన్ని విడిచిపెట్టి, వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాదిలో 300 మంది ...
error: Content is protected !!