Sarkar Live

State

Road Accident | ఘోర బస్సు ప్రమాదం.. చింతూరు ఘాట్‌లో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. 15 మంది మృతి
Crime, AndhraPradesh

Road Accident | ఘోర బస్సు ప్రమాదం.. చింతూరు ఘాట్‌లో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. 15 మంది మృతి

Alluri Sitarama Raju Road Accident | అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజుగారిమెట్టు వద్ద ప్రమాదం ప్రమాదం జరిగిన సమయంలో బస్సు అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తోంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని రాజుగారిమెట్టు మలుపు వద్దకు రాగానే, బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 37 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులుగా గుర్తించారు. బస్సు కూడా చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్టు సమాచారం. ప్రమాద తీవ్రత దృష్ట్యా, ఘటనా స్థలం వద్ద ...
తొలి విడ‌త పోలింగ్ పూర్తి.. ఉత్సాహంగా ఓటు వేసిన గ్రామ‌స్థులు – Gram panchayat elections
State

తొలి విడ‌త పోలింగ్ పూర్తి.. ఉత్సాహంగా ఓటు వేసిన గ్రామ‌స్థులు – Gram panchayat elections

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram panchayat elections) తొలి దశ పోలింగ్ పూర్త‌య్యింది. తీవ్ర చ‌లి (Cold)ని కూడా లెక్క చేయ‌కుండా ఓట‌ర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్పంచ్ (Sarpanch), వార్డు సభ్యుల పదవుల (Ward member posts) కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాలకు తరలివచ్చారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా ఓటు వేయడానికి బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు (Senior citizens) ఉదయం నుంచే క్యూక‌ట్టారు. 56,19,430 మంది ఓటర్లు.. 37,562 పోలింగ్ కేంద్రాలు మొద‌టి విడ‌త పంచాయ‌తీ (Gram panchayat elections) ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు అభ్య‌ర్థులు పోటీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56,19,430 మంది ఓటర్లు ఉండ‌గా 37,562 పోలింగ్ కేంద్రాలు (Polling stations) ఏర్పాటు అయ్యాయి. పోలింగ్ మధ్యాహ్నం ఒ...
కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌- ఒక‌రి మృతి – Gram panchayat elections
State, Crime

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌- ఒక‌రి మృతి – Gram panchayat elections

Gram panchayat elections - Violent clash : పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ సూర్య‌పేట (Suryapet) జిల్లా నూత‌న్‌క‌ల్ మండ‌లంలోని లింగంప‌ల్లి (Lingampalli village)లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ ( BRS) శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త ఒక‌రు ప్రాణాలు కోల్పోగా ప‌లువురు గాయ‌ప‌డ్డారు. పోలింగ్‌కు ముందు రోజు ఈ హింసాత్మ‌క సంఘ‌ట‌న (violent clash) జ‌ర‌గ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. చిన్న‌పాటి గొడ‌వ మొద‌లై.. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంప‌ల్లిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు (Gram panchayat elections) తొలి విడ‌త (డిసెంబ‌రు 11) జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో గ్రామంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చిన్న‌పాటి గొడ‌వ‌గా మొద‌లై మాటామాట పెరిగి ఒక్క‌సారిగా ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. సుమారు 70 మంది కాంగ్రెస్, బీఆర్ఎ...
Bharat Future City లో మెగా ప్రాజెక్టులు: గ్రీన్ ఎనర్జీ, ఫిల్మ్ సిటీ, మోటార్‌స్పోర్ట్స్ & హెల్త్‌కేర్
State

Bharat Future City లో మెగా ప్రాజెక్టులు: గ్రీన్ ఎనర్జీ, ఫిల్మ్ సిటీ, మోటార్‌స్పోర్ట్స్ & హెల్త్‌కేర్

Bharat Future City projects : తెలంగాణ‌కు అత్యాధునిక హంగులు సంత‌రించుకోనున్నాయి. హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీకి అనేక కీల‌క మెగా ప్రాజెక్టులు (Mega Projects Telangana) రానున్నాయి. హైదర‌బాద్‌లో జ‌రుగుతున్న గ్లోబ‌ల్ స‌మ్మిట్ వేదిక‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ (Green energy projects), స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులు భారీగా ప్రవేశిస్తున్నాయి. రూ. 4 వేల కోట్ల‌తో 25 బయోగ్యాస్ ప్లాంట్లు గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా అహీరత్ హోల్డింగ్స్ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణలో శుభ్రమైన ఇంధన విప్లవానికి (CBG plants in Telangana ) నాంది పలికే ప్రాజెక్టును స్థాపించ‌నున్న‌ట్టు పేర్కొంది. మొత్తం 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణ...
కవ్వాల్‌లో New Tiger Corridor – రంగం సిద్ధం చేసిన అట‌వీ శాఖ
State

కవ్వాల్‌లో New Tiger Corridor – రంగం సిద్ధం చేసిన అట‌వీ శాఖ

New Tiger Corridor : తెలంగాణ రాష్ట్రంలో పులుల సంరక్షణకు అట‌వీ శాఖ (forest department) మరో పెద్ద అడుగు వేసింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోని కవ్వాల్ (Kawal) టైగర్ రిజర్వ్‌ వరకు కొత్తగా పులుల కారిడార్ (Tiger Corridor)‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. త‌ద్వారా ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పులుల సంఖ్య సహజ రీతిలో పెరగడమే లక్ష్యంగా ప్ర‌ణాళిక‌ను రూపొందించింది. New Tiger Corridor : పులులు సురక్షితంగా సంచారించాల‌నే ల‌క్ష్యం తిప్పేశ్వర్ (Tippeshwar Tiger Reserve in Maharashtra) రిజర్వ్‌లో ఉన్న పులులు జత కోసం ప్రతి సంవత్సరం న‌వంబ‌రు నుంచి జనవరి మధ్య విప‌రీతంగా సంచ‌రిస్తూ ఉంటాయి. ఆ సమయంలో అవి ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల దిశగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే.. సరైన మార్గం లేకపోవడం, మధ్యలో గ్రామాలు, వ్యవసాయ భూములు, రహదారులు ఉండటం వంటి కారణాలతో పులులకు ప్రమాదం ఏర్పడే ...
error: Content is protected !!