Sarkar Live

warangal

Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు
Crime, warangal

Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

Mulugu : ములుగు జిల్లా వెంకటాపురం మండలం విఆర్ కె పురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేనత్తను ఆమె అల్లుడు గొడ్డలితో నరికి చంపాడు. వివ‌రాల్లోకి వెళితే గ్రామానికి చెందిన గ్రామానికిచెందిన విజయ్ కుమార్ గత కొంత కాలంగా అత‌డు మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. మ‌ద్యానికిడబ్బులు లేకపోవడంతో తన మేనత్త ఎల్లమ్మ (60)ను త‌ర‌చూ డబ్బులు అడుగుతూ వేదించేవాడు. అయితే ఆమె త‌న వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని చెప్పడంతో వీరి మ‌ధ్య గొడవలు పెరిగాయి. ఈ క్ర‌మంలో మేనత్తపై అల్లుడు గొడ్డలితో ఒక్క‌సారిగా దాడి చేయడంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు (Mulugu Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన విజయ్ కుమార్ గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సం...
ప్రియుడి కోసం భర్త, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన తల్లి ‌‌ – Jayashankar Bhupalapalli
Crime, warangal

ప్రియుడి కోసం భర్త, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన తల్లి ‌‌ – Jayashankar Bhupalapalli

Mother kills husband and daughter : జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapalli) జిల్లా చిట్యాల మండలం వొడితల గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త పక్షవాతంతో మంచాన పడిపోవడంతో సపర్యలు చేయాల్సిన భార్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం బయటపడిపోతుందనే భయంతో, ఆమె ప్రియుడి సాయంతో భర్తతో పాటు తన 22 ఏళ్ల కూతురును కూడా కడతేర్చింది. వివరాల్లోకి వెళ్తే, జూన్ 25న కవిత తన భర్తను హత్య చేసి, అనారోగ్యంతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాక ఎలాంటి అనుమానం రాకుండా చూసుకుంది. అయితే, తమ సంబంధం విషయం కుమార్తెకు కూడా తెలిసిపోతుందనే భయంతో 22 ఏళ్ల కూతురినీ పక్కా ప్లాన్​ వేసి హత్య చేసింది. కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి–కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి, ఆధార్ కార్డు ఉంచి, క్షుద్రపూజల వల్లే చనిపోయిందనే ఊరి జ...
Ragging | ర్యాగింగ్‌పై కఠిన చర్యలు : వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక
warangal, State

Ragging | ర్యాగింగ్‌పై కఠిన చర్యలు : వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక

Warangal News | విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ (Ragging) వంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై చ‌ట్ట ప్ర‌కారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ (Warangal CP) స‌న్‌ప్రీత్ సింగ్‌ హెచ్చరించారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోవుతున్న నేప‌థ్యంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ర్యాగింగ్‌ నియంత్రణపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడడ‌మ‌నేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని, ఈ చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేలా ఉంటుంద‌ని అన్నారు. ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్‌ విద్యార్థుల పట్ల అసాంఘిక కృత్యాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల నుంచి తొలగించడంతో పాటు ర్యాగింగ్‌ లాంటి చర్యలకు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ర్యాగింగ్‌ పా...
Heavy rainfall | తెలంగాణ‌లో ఆగ‌ని భారీ వ‌ర్షాలు.. అధికారులు అల‌ర్ట్
State, Adilabad, warangal

Heavy rainfall | తెలంగాణ‌లో ఆగ‌ని భారీ వ‌ర్షాలు.. అధికారులు అల‌ర్ట్

Heavy rainfall : తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వాన‌లు ( heavy rainfall ) ప‌డ్డాయి. దీంతో జ‌న‌జీవ‌నం (Normal life) అస్త‌వ్య‌స్తంగా మారింది. మ‌రో రెండు, మూడు రోజుల్లోనూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. Heavy rainfall : జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తం భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి రవాణా అంతరాయం కలిగిస్తున్నాయి. చిన్న చిన్న చెరువులు, గుంటలు పొంగిపొర్లి లోత‌ట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. పల్లెల్లో రహదారులు నీటమునిగిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.పంట పొలాల్లోకి కూడా నీరు చేరడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండ‌గా కొన్ని ప్రాంతాల్లో వరదలు, ముంపు సమస్యలు తలెత్తుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నీటి కొరత కొనసా...
Beer bottle : బీరు సీసాలో సోంపు ప్యాకెట్ కలకలం – వరంగల్‌లో  ఘటన
Viral, warangal

Beer bottle : బీరు సీసాలో సోంపు ప్యాకెట్ కలకలం – వరంగల్‌లో ఘటన

Warangal News | వ‌రంగ‌ల్ జిల్లాలో బీరు ప్రియులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యే ఘ‌ట‌న చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఓ వైన్‌ షాపులో కొనుగోలు చేసిన కింగ్‌ ఫిషర్‌ బీరు సీసాలో సోంపు ప్యాకెట్‌ బయటపడింది. ఇల్లంద గ్రామంలో ఓ వ్య‌క్తి కింగ్ ఫిషర్ బీరు (Kingfisher Beer bottle ) కొనుగోలు చేశాడు. తాగడానికి ముందు బీరు సీసాను నిశితంగా ప‌రిశీలించి చూడగా, అందులో సోంపు ప్యాకెట్ క‌నిపించడంతో అవాక్కయ్యాడు. వెంటనే స‌ద‌రు వ్య‌క్తి వైన్ షాపు య‌జ‌మానుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాణ్య‌త‌తో కూడిన బీర్ల‌ను విక్ర‌యించాల‌ని హెచ్చ‌రించాడు. ఇలా చెత్తాచెదారం ఉన్న బీర్ల‌ను అమ్మ‌డం ఏమాత్రం స‌రైంది కాద‌ని మండిప‌డ్డాడు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీక...
error: Content is protected !!