PM Modi Kuwait Visit | కువైట్లో మోదీ చారిత్రాత్మక పర్యటన.. 43 ఏళ్లలో తొలిసారి..
PM Modi Kuwait Visit | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్కు చేరుకున్నారు. రెండు రోజులపాటు ఆయన ఈ దేశంలో పర్యటించనున్నారు. మోదీ పర్యటన చారిత్రకంగా నిలిచింది. 43 సంవత్సరాల తర్వాత గల్ఫ్ దేశానికి భారత ప్రధాని చేయబోయే తొలి పర్యటన ఇది. కువైట్ రాజు షేక్ మేశాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడి వెళ్తున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య పెరుగుతున్న సత్సంబంధాలకు ప్రతీక అని విశ్లేషకులు అంటున్నారు. భారత్, కువైట్కు ప్రయోజనకరంగా నిలవనుందని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
కువైట్తో బలమైన వాణిజ్య సంబంధాలు
భారత్, కువైట్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా శక్తి రంగంలో భారతదేశానికి కువైట్ అగ్ర వ్యాపార భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 10.47 బిలియన్ డాలర్...




