HCU Land dispute | ముదురుతున్న హైదరాబాద్ వర్సిటీ భూ వివాదం..
                    HCU Land dispute : హైదరాబాద్ విశ్వవిద్యాలయ (University of Hyderabad) భూ వివాదం (Land dispute) ముదిరింది. విద్యార్థుల సంఘం (UoHSU) మంగళవారం నుంచి నిరవధిక నిరసనను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఐటీ అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కోసం కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli)లోని 400 ఎకరాల ఈ యూనివర్సిటీ భూమిని ఉపయోగించాలని నిర్ణయించగా విద్యార్థులు (students) దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ భూమి తమ విద్యాలయ పరిధిలోకి వస్తుందని, ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకోవడం తగదని వాదిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ నిరసనలో పాల్గొని తరగతులను బహిష్కరించాలని (boycott classes) యూవోహెచ్ ఎస్యూ ఉపాధ్యక్షుడు ఆకాష్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు చేస్తున్న నిరసనల (protesting)ను పోలీసు శాఖ అణచివేయడానికి యత్నిస్తోందని విమర్శించారు.
HCU Land dispute : ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత
గత ఆద...                
                
             
								



