Sunita Williams | భారత్కు సునీతా విలియమ్స్.. పర్యటన ఎప్పుడంటే..
                    Sunita Williams : భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి చేరుకోవడం (coming back to Earth)తో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సాహసాలను చవిచూసిన ఆమె విజయవంతంగా తన మిషన్ (mission)ను పూర్తి చేసి భూమి (Earth)పై అడుగుపెట్టారు. ప్రస్తుతం సునీతా విలియమ్స్ కొంతకాలం నాసా (NASA) వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులను కలుసుకుని మరికొంత సమయం గడపనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత భారత్లో పర్యటించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని సునీతా విలియమ్స్ బంధువు ఫల్గునీ పాండ్యా వెల్లడించారు. జాతీయ మీడియాతో ఆయన పలు అంశాలపై మాట్లాడారు.
కుటుంబ సభ్యులతో కలిసి టూర్లు
భూమికి సురక్షితంగా సునీతా విలియమ్స్ (Sunita Williams) చేరుకోవడం తనకు అపారమైన ఆనందాన్ని కలిగించిందని ఫల్గునీ పాండ్యా తెలిపారు. డ్ర...                
                
             
								



