Tirumala Tirupati | తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లపై ప్రత్యేక దర్శనాలు షురూ.. టీటీడీ అప్డేట్స్
Tirumala Tirupati : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చిన సిఫార్సు లేఖల (recommendation letters) ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల (devotees)కు ప్రత్యేక దర్శనాలు ప్రారంభం కానున్నాయి. రేపటి (మార్చి 24) నుంచి ఇది అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu) ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నామని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
Tirumala Tirupati : విశేష దర్శన ఏర్పాట్లు
కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి కార్యక్రమం, ఉగాది పండుగ కారణంగా మార్చి 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాల (darshans)ను రద్దు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 24, 29 తేదీల్లో వీఐపీ దర్శనం కోసం సిఫార్సు లేఖలు స్వీకరించబడవని వెల్లడించారు
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల
మరోవైపు టీటీడీ అధికా...



