Sarkar Live

Privacy Policy

BC Reservations |  బీసీ రిజర్వేషన్ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేస్తాం
State

BC Reservations | బీసీ రిజర్వేషన్ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేస్తాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు న్యూదిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ పోరుగర్జన BC Reservations | తెలంగాణలో కుల గణన చేపట్టొద్దంటూ తీవ్ర ఒత్తిడి వచ్చినా, తాము దానికి తలొగ్గకుండా ఆ పని పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల (BC Reservations) సాధన కోసం బీసీ సంఘాలు నిర్వహించిన మహా ధర్నా (BC Poru Garjana) లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "బీసీల హక్కులు కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. న్యాయం చేయడంలో వెనుకడుగు వేయదనిఅని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కుల గ‌ణ‌న చేప‌ట్టామని, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు తీర్మానం చేశామని తెలిపారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు రావాల‌న్నా.. స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగాల‌న్నా జ‌నగ‌ణ‌న‌లో కుల గ‌ణ‌న జర‌గాలన...
Electric vehicles | భార‌త్‌లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్‌
Business

Electric vehicles | భార‌త్‌లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్‌

Electric vehicles : భారతదేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles (EVs) విక్రయమయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (Ministry of Heavy Industries) గ‌ణాంకాలు వెల్ల‌డించింది. 11,49,334 ఎలక్ట్రిక్ టూ వీలర్లు (e-2W) అమ్ముడయ్యాయని తెలిపింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,48,561 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరుగుదల అని పేర్కొంది. అలాగే, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల (e-3W) విక్రయాలు 1,59,235 యూనిట్లకు చేరుకుని, గత సంవత్సరం 1,01,581 యూనిట్లతో పోలిస్తే 57 శాతం వృద్ధిని సాధించాయ‌ని వివ‌రించింది. గ్రీన్ మొబిలిటీకి ప్రోత్సాహం.. PM E-DRIVE పథకం ఎలక్ట్రిక్ వాహన తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో 'PM E-DRIVE' పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 2026 మార్చి 31 వరకు 10,900 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అలాగే, 2024 ఏప్రిల...
Ghibli Trend | గిబ్లి ఏఐతో జాగ్రత్త..! త‌ప్పుల త‌డ‌క‌గా ఇమేజ్ జ‌నరేష‌న్‌
Trending

Ghibli Trend | గిబ్లి ఏఐతో జాగ్రత్త..! త‌ప్పుల త‌డ‌క‌గా ఇమేజ్ జ‌నరేష‌న్‌

Studio Ghibli AI Trend : సోషల్ మీడియాలో వైరల్ అయిన స్టూడియో గిబ్లీ AI ట్రెండ్ ఊహించని మలుపు తిరిగింది. ఇది సరదాగా మొదలైనప్పటికీ కొంతమందికి భయానకంగా, మరికొంతమందికి వినోదాత్మకంగా మారింది. OpenAI కొత్త ఇమేజ్ జనరేషన్ (AI Image Generation) టూల్‌ను ఉప‌యోగించి చాలామంది తమ ఫొటోలను గిబ్లీ-స్టైల్ బొమ్మలు (Ghibl Style AI Art)గా మార్చుకుంటున్నారు. అయితే AI కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల విచిత్రమైన ఫలితాలు వస్తున్నాయి. Studio Ghibli AI Trend : కొబ్బ‌రికాయ బ‌దులు త‌ల‌కాయ‌ బీహార్‌లో ముఖ్యమైన పండుగ అయిన ఛఠ్ పూజ (Chhath Puja) జరుపుకుంటున్న మహిళల గిబ్లీ బొమ్మ ఒకటి వైరల్ (Viral AI Image) అయింది. అసలు ఫొటోలో మహిళలు పండ్లు, అగరబత్తులు, కొబ్బరికాయలతో నిండిన బుట్టలను పట్టుకుని నది ఒడ్డున నిలబడి ఉన్నారు. వీటిని సూర్య భగవానుడికి సమర్పించడానికి ఉపయోగిస్తారు. అయితే.. చాట్‌జీపీటీ ఈ చిత్రాన్ని తప్పుగా...
Waqf Amendment Bill | పార్ల‌మెంటులో వ‌క్ఫ్ బిల్లు.. ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి
State

Waqf Amendment Bill | పార్ల‌మెంటులో వ‌క్ఫ్ బిల్లు.. ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి

Waqf Amendment Bill : వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును ప్రతిపక్షాల నినాదాల (Opposition Protests) మధ్య పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ రోజు మ‌ధ్యాహ్నం ప్రవేశపెట్టారు. దీనిపై ఎనిమిది గంటల చర్చ (Parliament Debate) జరుగుతుందని, అవసరమైతే సమయం పెంచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం "బుల్డోజ్" చేస్తోందని ఆరోపించాయి. బిల్లును సభ దృష్టికి తెచ్చినప్పటి నుంచి సవరణలకు సమయం ఇవ్వలేదని వాదించాయి. Waqf Amendment Bill ప్ర‌యోజ‌న‌క‌ర‌మే : కిర‌ణ్ రిజిజు బిల్లు ప్ర‌వేశ పెట్టే స‌మయంలో కిర‌ణ్ రిజిజు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నందున ఇది చారిత్రాత్మకమైన రోజు అని ఆయన అన్నారు. 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన ఈ బిల్లు జాతీయ ప్రయోజనాల కోసమేన‌న్నారు. యావ‌త్ భార‌త‌దేశం మొత్తానికి, ముఖ్యంగా ...
Nithyananda | నిత్యానంద స్వామి జీవ సమాధి.. నిజ‌మేనా?
Trending

Nithyananda | నిత్యానంద స్వామి జీవ సమాధి.. నిజ‌మేనా?

Nithyananda : వివాదాస్పద (Controversial Figure) ఆధ్యాత్మిక గురువు (Jeeva Samadhi) నిత్యానంద స్వామి (Nithyananda) జీవ సమాధి చెందినట్టు ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ మంగళవారం ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు (Viral on Social Media) కొట్టింది. నిత్యానంద భక్తులు (Nithyananda Devotees) ఈ ప్రకటనతో తీవ్ర షాక్‌కు గురయ్యారు. కొందరు ఆయన ఆత్మ శాంతికి ప్రార్థనలు చేస్తుండగా, మరికొందరు ఈ సమాచారం నిజమా? కాదా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వార్త ఎలా వెలుగు చూసింది? నిత్యానంద స్వామి కొన్ని సంవత్సరాలుగా అనేక వివాదాలకు కేంద్ర బిందువు (Controversial Figure)గా మారారు. 2019లో ఆయనపై అత్యాచార ఆరోపణలు (Rape Allegations) వచ్చాయి. ఈ కేసులు పెరుగుతుండటంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన గురించి స్పష్టమైన సమాచారం ఎవరికీ తెలియలేదు. కొంతకాలానికి దక్షిణ అమెరికా...
error: Content is protected !!