Sarkar Live

Privacy Policy

Temperatures | ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ కేంద్రం చల్లని కబురు..
Districts, State

Temperatures | ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ కేంద్రం చల్లని కబురు..

Hyderabad Temperatures : హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు చేరాయి. ఏప్రిల్ 3, ఏప్రిల్ 4 మధ్య ఉరుములతో కూడిన తుఫానుల రూపంలో కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. "రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాబోయే 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదు. ఆ తర్వాత వచ్చే 3 రోజుల్లో క్రమంగా 2 - 3 డిగ్రీల సెల్సియస్ తగ్గుదల ఉంటుంది" అని భారత వాతావరణ శాఖ (IMD)-హైదరాబాద్ ఆదివారం సాయంత్రం తన అంచనాలో తెలిపింది. Hyderabad Temperatures : హైదరాబాద్ లో వర్షాలు! ఏప్రిల్ 3, గురువారం నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోని ప్రజలు తీవ్రమైన వేడి నుంచి కొంత ఉపశమనం పొందుతారు,.ఎందుకంటే IMD కొన్ని జిల్లా...
Chiranjeevi | చిరు -అనిల్ కాంబో మొదలైంది..
State

Chiranjeevi | చిరు -అనిల్ కాంబో మొదలైంది..

మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో పోటీముడి మరి సినిమాలను చేస్తున్నారు. సీనియర్లతో పాటు యంగ్ డైరెక్టర్లతో మూవీస్ ను చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. రీఎంట్రీ తర్వాత తను చేసిన సినిమాలను చూస్తే ఖైదీ నెంబర్ 150 మూవీని వివి వినాయక్ డైరెక్షన్లో చేయగా తర్వాత సైరాను సురేందర్ రెడ్డి డైరెక్షన్లో, తర్వాత ఆచార్యను కొరటాల శివ డైరెక్షన్లో చేశారు. ఇందులో ఖైదీ నంబర్ 150 మాత్రమే చిరు (Chiranjeevi) రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత వాల్తేర్ వీరయ్య మూవీ తో వింటే జ్ చిరును చూపించాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా లేవు. బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన వశిష్ట (Vasishta) డైరెక్షన్లో విశ్వంబర మూవీని తీస్తున్నాడు. దాదాపు మూవీ షూటింగ్ కూడా కావొచ్చింది. మే లేదా జూన్ లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక తర్వాత సినిమ...
Vijay Sethupathi | పూరీ – విజయ్ సేతుపతి కాంబో సెట్ ..
Cinema

Vijay Sethupathi | పూరీ – విజయ్ సేతుపతి కాంబో సెట్ ..

Vijay Sethupathi New Movie | కొన్ని రోజులుగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh)నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడో అని జోరుగా చర్చ నడుస్తుంది. ఒకసారి హీరో గోపీచంద్ తో మూవీ తీయబోతున్నాడని, మరోసారి ఇంకో హీరోకు కథ వినిపించాడని ఇక పట్టాలెక్కడమే తరువాయని ఇలా రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఉగాది పండుగ రోజున తన నెక్స్ట్ మూవీ ఏ హీరోతో చేయబోతున్నాడో చెప్పేశారు. పూరి జగన్నాథ్ తన తర్వాత సినిమాని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో (makkal selvan Vijay Sethupathi) తీయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా తనే కూడా నిర్మించనున్నారు. అలాగే చార్మి.. పూరి జగన్నాథ్ తో గత కొన్ని సినిమాలుగా సహ నిర్మాతగా ఉంటుంది. డబుల్ఇస్మార్ట్ భారీ ఫ్లాప్ తర్వాత పూరి నెక్స్ట్ చేయబోయే మూవీకి చార్మిని (Charmi) దూరం పెట్టారని కొన్ని రోజులుగా రూమర్స్ వినపడుతూనే ఉన్నాయి. కానీ ఈ రో...
Replace School uniform : సర్కారు మరో నిర్ణయం..  పాఠశాల విద్యార్థుల‌ యూనిఫామ్‌లో మార్పు
State

Replace School uniform : సర్కారు మరో నిర్ణయం.. పాఠశాల విద్యార్థుల‌ యూనిఫామ్‌లో మార్పు

తెలంగాణ ప్రభుత్వ (Telangana government) పాఠశాలల్లో చదివే ఆరో తరగతి, ఏడో తరగతి బాలురకు ఇకపై షార్ట్స్ (నిక్క‌ర్లు) బదులుగా ప్యాంట్లు (pants) అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల అభ్యర్థనలు, ఉపాధ్యాయ సంఘాల సూచనల మేరకు ఈ మార్పును చేపట్టారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానం ఇప్పటి వరకు ఏడో తరగతి వరకు చదివే బాలురకు షార్ట్స్ (shorts), ఎనిమిదో తరగతి నుంచి ప‌దో తరగతి వరకు ప్యాంట్లు అందించేవారు. అయితే.. ఆరు, ఏడో తరగతి విద్యార్థులు (students) కూడా ప్యాంట్లు ఇవ్వాల‌ని విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల నేత‌లు అభ్యర్థించారు. దీనిపై ప్ర‌భుత్వం స్పందించింది. ఆరు, ఏడో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు నిక్క‌ర్ల బ‌దులు, ప్యాంట్లు అందించాల‌ని నిర్ణ‌యించింది. Replace School uniform : ప్ర‌తి విద్యార్థికీ రెండు ప్యాంట్లు ప్రతి ఏడాది ప్రభుత్వం (government) విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌లు ఉచితంగా ...
Ugadi celebrations | అంద‌రూ సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లాలి.. ఉగాది వేడుకల్లో సీఎం
State

Ugadi celebrations | అంద‌రూ సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లాలి.. ఉగాది వేడుకల్లో సీఎం

Telangana Ugadi celebrations : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఉగాది శుభాకాంక్ష‌లు (CM Revanth Reddy Ugadi wishes) తెలిపారు. విశ్వావ‌సు నామ సంవ‌త్స‌రంలో ప్ర‌తి ఒక్క‌రికీ శుభాలు జ‌ర‌గాల‌ని కోరుకున్నారు. అంద‌రికీ ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భించి సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లాల‌ని ఆకాంక్షించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ‌, దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ‌ల సంయుక్త ఆధ్వర్వంలో హైద‌రాబాద్‌లోని ర‌వీంద్ర‌భార‌తిలో ఈ రోజు ఉగాది వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తోపాటు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాద‌వ్‌, ఎమ్మెల్యేల‌లు అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌, శంక‌ర‌య్య‌, మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీఈ మ‌హేంద‌ర్‌రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ...
error: Content is protected !!