TG News | శాశ్వత జడ్జిలను నియమించండి.. తెలంగాణకు సుప్రీం సిఫార్సు
TG News | తెలంగాణ హైకోర్టు (Telangana High court)కు ముగ్గురు న్యాయమూర్తులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. మద్రాస్ హైకోర్టుకు ఇద్దరిని నియమించాలని కూడా పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలో సుప్రీం కొలేజియం సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చాయి.
ఆ న్యాయమూర్తులు ఎవరెవరంటే..
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులు(Judges)గా ఉన్న న్యాయమూర్తి లక్ష్మీనారామయణ అలిశెట్టి, న్యాయమూర్తి అనిల్ కుమార్ జుకంటి, న్యాయమూర్తి సుజానా కళాసికంలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించినట్టు సుప్రీం (Supreme Court ) తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. అలాగే మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తులు వెంకటాచారి లక్ష్మీనారాయణన్, పెరియసామి వడమలైలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసినట్లు కొలేజియం తెలిపింది.
ఏయే అంశాలను ప...




