Rice Mill Scam | ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే గుట్టు రట్టు: రాజరాజేశ్వర మిల్లులో ప్రభుత్వ ధాన్యం గల్లంతు!
Vanjarapalli Rice Mill Scam | వరంగల్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో అక్రమాల పర్వం కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వైనం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. తాజాగా, సంగెం మండలం వంజరపల్లిలోని రాజరాజేశ్వర రైస్ మిల్లులో భారీ ఎత్తున ప్రభుత్వ ధాన్యం గల్లంతైనట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేస్తే మిల్లర్ భాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది.
నిల్వల్లో భారీ తేడాలు
ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసేందుకు, సివిల్ సప్లై ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తుంది. అయితే, మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలకు, రికార్డులకు పొంతన లేకుండా పోయింది. అధికారులు కనుక రాజరాజేశ్వర రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహిస్తే(ఫిజికల్ వెరిఫికేషన్) రికార్డుల్లో ఉండే నిల్వలకు మిల్లులో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉంటుంది.
అక్రమాల తీరు ఇలా..
ప్రభుత్...


