Sarkar Live

Day: May 6, 2026

Rice Mill Scam | ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే గుట్టు రట్టు: రాజరాజేశ్వర మిల్లులో ప్రభుత్వ ధాన్యం గల్లంతు!
Special Stories

Rice Mill Scam | ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే గుట్టు రట్టు: రాజరాజేశ్వర మిల్లులో ప్రభుత్వ ధాన్యం గల్లంతు!

​Vanjarapalli Rice Mill Scam | వరంగల్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో అక్రమాల పర్వం కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వైనం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. తాజాగా, సంగెం మండలం వంజరపల్లిలోని రాజరాజేశ్వర రైస్ మిల్లులో భారీ ఎత్తున ప్రభుత్వ ధాన్యం గల్లంతైనట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేస్తే మిల్లర్ భాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది. ​నిల్వల్లో భారీ తేడాలు ​ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసేందుకు, సివిల్ సప్లై ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తుంది. అయితే, మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలకు, రికార్డులకు పొంతన లేకుండా పోయింది. అధికారులు కనుక రాజరాజేశ్వర రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహిస్తే(ఫిజికల్ వెరిఫికేషన్) రికార్డుల్లో ఉండే నిల్వలకు మిల్లులో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉంటుంది. ​అక్రమాల తీరు ఇలా.. ప్రభుత్...
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఓ చిత్తుకాగితం.. వరంగల్ రైతు సదస్సులో కేటీఆర్ ధ్వజం!
warangal

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఓ చిత్తుకాగితం.. వరంగల్ రైతు సదస్సులో కేటీఆర్ ధ్వజం!

KTR Rythu Sangrama Sadassu Warangal | అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ మే 6, బుధవారం వరంగల్ నగరాన్ని వేదికగా చేసుకుని 'రైతు సంగ్రామ సదస్సు' (Rythu Sangrama Sadassu)ను నిర్వహించింది. గ్రీన్ వుడ్ స్కూల్ సమీపంలోని 4 ఎకరాల విశాలమైన మైదానంలో జరిగిన ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సీఎం కాదని, ఆయన ఒక 'ఎగవేతల రేవంత్ రెడ్డి' అని ఎద్దేవా చేశారు. ఒట్టు పెట్టి మోసం చేశారు.. భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్ వచ్చి రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టుకున్న రేవంత్ రెడ్డి, నేడు ఆ మాట తప్పి రైతులను వంచించారని కేటీఆర్ మండిపడ్డారు. "దమ్ముంటే రేవంత్ రెడ్డి ఏదైనా ఒక గ్రామానికి రావాలి.. ఆ ఊరిలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే, నేను నా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తాను" అని కేటీఆర్ బహి...
నా మిల్లు.. నా ఇష్టం! ఫున్నెల్‌లో సత్యనారాయణ స్వామి మిల్లర్ ‘ధాన్యం’ దందా? – Rice Mill Scam
Special Stories

నా మిల్లు.. నా ఇష్టం! ఫున్నెల్‌లో సత్యనారాయణ స్వామి మిల్లర్ ‘ధాన్యం’ దందా? – Rice Mill Scam

2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి భారీగా ధాన్యం గోల్ మాల్ సుమారు 10 ఏసికేలకు పైగా ప్రభుత్వ వడ్లు గల్లంతైనట్లు ఆరోపణలు Punnel Village Rice Mill Fraud : ​"నిబంధనలు నాకు వర్తించవు.. నా ఇష్టారాజ్యమే ఇక్కడ శాసనం" అన్న చందంగా వ్యవహరిస్తున్నారు ఫున్నేల్‌లోని సత్యనారాయణ స్వామి రైస్ మిల్లు యజమాని. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వ ధాన్యం సేకరణలో భారీ గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ ప్రభుత్వానికి చెందిన వడ్లు మాయమవ్వడం ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతోంది. ​ఏకంగా 10 ఏసీకేలకు పైగా (ACKs) వడ్లు గల్లంతు! ​ప్రభుత్వ లెక్కల ప్రకారం సివిల్ సప్లైస్ విభాగం నుంచి మిల్లుకు అప్పగించిన ధాన్యంలో భారీ తేడాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 10 ఏసీకేలకు (Ack) సంబంధించిన వడ్లు మిల్లు నుండి 'మాయం' అయినట్లు తెలుస్తోంది. ఈ ధాన్యం విలువ మార్కెట్ ధర ప్రకారం కోటికి...
error: Content is protected !!