Sarkar Live

Day: May 14, 2026

ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీలు: ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్
State

ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీలు: ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్

ఆటోలో ప్రయాణించే అమాయక ప్రయాణికులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి, బెదిరించి నగదు దోచుకుంటున్న ఆరుగురు సభ్యుల  ముఠాను గీసుగొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక ఆటో, 5 సెల్‌ఫోన్లు మరియు రూ.15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మామునూరు ఏసీపీ ఎన్. వెంకటేష్ గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. ​ఘటన నేపథ్యం.. ​ఈ నెల 3వ తేదీన నమోదైన ఫిర్యాదు ప్రకారం.. ఏప్రిల్ 30న వరంగల్‌కు చెందిన విద్యార్థి పెరుమాండ్ల సిద్ధార్థ తన స్నేహితుడితో కలిసి ఓ వివాహ వేడుకకు వెళ్లేందుకు కోటగండి మైసమ్మ వద్ద ఆటో కోసం వేచి ఉన్నాడు. ఆటో డ్రైవర్ సాయికుమార్ తన ముఠాతో కలిసి, గిర్నీబావి వద్ద దింపుతామని నమ్మించి వారిని ఆటోలో ఎక్కించుకున్నాడు. అనంతరం గంగాదేవిపల్లి గ్రామ శ్మశాన వాటిక సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, సిద్ధార్థ వద్ద ఉన్న రూ...
కేరళ సీఎంగా వి.డి. సతీషన్: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం
State

కేరళ సీఎంగా వి.డి. సతీషన్: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం

కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం కాంగ్రెస్ అధిష్టానం కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వి.డి. సతీషన్‌ (V.D. Satheesan) ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. గత పది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలుకుతూ, పార్టీ అధిష్టానం సతీషన్ వైపే మొగ్గు చూపింది. ​అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కె.సి. వేణుగోపాల్ ​ఈ పదవి కోసం రేసులో ఉన్న మరో కీలక నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, పార్టీ నిర్ణయంపై స్పందించారు. సతీషన్ ఎంపిక పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు. "అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తాను. పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం విజయవంతం కావడానికి నా వంతు సహకారం అందిస్తాను" అని ఆయన ప్రకటించారు. ​ ​సుదీర్ఘ కసరత్తు..  సతీషన్ వైపే మొగ్గు.. కేరళ ఎన్నికల్లో యుడిఎఫ్ (UDF)...
error: Content is protected !!