ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీలు: ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్
ఆటోలో ప్రయాణించే అమాయక ప్రయాణికులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి, బెదిరించి నగదు దోచుకుంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను గీసుగొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక ఆటో, 5 సెల్ఫోన్లు మరియు రూ.15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మామునూరు ఏసీపీ ఎన్. వెంకటేష్ గీసుగొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు.
ఘటన నేపథ్యం..
ఈ నెల 3వ తేదీన నమోదైన ఫిర్యాదు ప్రకారం.. ఏప్రిల్ 30న వరంగల్కు చెందిన విద్యార్థి పెరుమాండ్ల సిద్ధార్థ తన స్నేహితుడితో కలిసి ఓ వివాహ వేడుకకు వెళ్లేందుకు కోటగండి మైసమ్మ వద్ద ఆటో కోసం వేచి ఉన్నాడు. ఆటో డ్రైవర్ సాయికుమార్ తన ముఠాతో కలిసి, గిర్నీబావి వద్ద దింపుతామని నమ్మించి వారిని ఆటోలో ఎక్కించుకున్నాడు. అనంతరం గంగాదేవిపల్లి గ్రామ శ్మశాన వాటిక సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, సిద్ధార్థ వద్ద ఉన్న రూ...

