Sarkar Live

Ipl 2025 News | ఐపీఎల్ వేలం చరిత్రలో టాప్ -10 క్రికెటర్లు వీరే..

Ipl 2025 News : యూఏఈలోని అబుదాబి వేదికగా ఎంతో ఉత్తేజ‌భ‌రితంగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ 2025 ఆటగాళ్ల వేలం ముగిసింది. ఈసంద‌ర్భంగా వివిధ‌ ఫ్రాంఛైజీలు భారత క్రికెటర్లను కోట్లు కుమ్మ‌రించి కొనుగోలు చేశాయి. ఇందులో విదేశీ ఫాస్ట్

Ipl 2025 News

Ipl 2025 News : యూఏఈలోని అబుదాబి వేదికగా ఎంతో ఉత్తేజ‌భ‌రితంగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ 2025 ఆటగాళ్ల వేలం ముగిసింది. ఈసంద‌ర్భంగా వివిధ‌ ఫ్రాంఛైజీలు భారత క్రికెటర్లను కోట్లు కుమ్మ‌రించి కొనుగోలు చేశాయి. ఇందులో విదేశీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్లు భారీగా ధ‌ర‌లు ప‌లికారు. కాగా, 2008 నుంచి ఐపీఎల్ వేలం జరుగుతుండగా.. 16 ఏళ్ల వేలం రికార్డ్స్‌ను ఐపీఎల్ 2025 వేలం బ్రేక్ చేసింది.

టాప్ వ‌న్‌ పంత్, టాప్- 2 శ్రేయాస్

ఐపీఎల్ యాక్ష‌న్ లో అత్యధిక డిమాండ్ ఉన్న ఆటగాళ్ల లిస్ట్ లో సగం మందికి పైగా టీమిండియా క్రికెట‌ర్లే ఉన్నారు. అంతేకాకుండా మొద‌టి రెండు స్థానాల్లోనూ భారత ఆటగాళ్లే ఉన్నారు. గతేడాది వరకూ ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లతో అగ్ర‌స్థానంలో ఉండగా.. గత ఆదివారం ఐపీఎల్ 2025 వేలంలో రూ.27 కోట్లకి రిషబ్ పంత్ అమ్ముడుపోయి ఆ రికార్డ్‌ను బద్ధలు కొట్టాడు.

అయ్యర్ కు ఒక్క‌సారిగా క్రేజ్‌..

ఈ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర‌కు అమ్ముడుపోయిన క్రికెట‌ర్ల‌ జాబితాలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, మిచెల్ స్టార్క్ టాప్-3లో నిలవగా..నాలుగో స్థానాన్ని భారత క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ సొంతం చేసుకున్నాడు. ఈసారి వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకి కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.

సగం ధర కోల్పోయిన స్టార్క్

రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వొచ్చిన రిషబ్ పంత్‌ను.. అన్ని ఫ్రాంఛైజీలతో పోటీ పడిన లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే వేలంలో శ్రేయాస్అయ్యర్‌ని పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. గత సంవ‌త్స‌రం అత్యధిక ధరకు అమ్ముడుపోయిన మిచెల్ స్టార్క్‌ను ఈసారి వేలంలో రూ.11.75 కోట్లకి దిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు

1. రిషబ్ పంత్ రూ.27 కోట్లు (లక్నో – 2025)
2.శ్రేయాస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు (పంజాబ్ – 2025)
3.మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లు (కోల్‌కతా – 2024)
4.వెంకటేష్ అయ్యర్ రూ.23.75 కోట్లు (కోల్‌కతా -2025)
5. పాట్ కమిన్స్ రూ.20.50 కోట్లు (హైదరాబాద్ -2024)
6. సామ్ కరన్ రూ.18.5 కోట్లు (పంజాబ్ -2023)
7. అర్షదీప్ సింగ్ రూ.18 కోట్లు (పంజాబ్ -2025)
8. యుజ్వేంద్ర చాహల్ రూ. 18 కోట్లు (పంజాబ్ – 2025)
9. కామెరూన్ గ్రీన్ రూ.17.50 కోట్లు (ముంబయి – 2023)
10. బెన్ స్టోక్స్ రూ.16.25 కోట్లు (చెన్నై – 2023)


 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?