హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంగుల సంబరాల ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలు నింపాలని, ప్రతి హృదయంలో స్నేహం, ప్రేమ, ఐక్యత వికసించాలని ఆకాంక్షించారు.
ఈ హోలీ పండుగ మన సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, పరస్పర గౌరవాన్ని మరింత బలపరచాలని, విభిన్నతలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగగా నిలవాలని అన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యాలతో కళకళలాడాలని కోరుకున్నారు.
అలాగే ప్రజలు సురక్షితంగా, పర్యావరణ హితంగా సహజ రంగులతో, సంప్రదాయ పద్ధతుల్లో హోలీ వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
“రంగుల హోలీ ప్రతి మనసును రంగరించి, సంతోషాల వర్షం కురిపించాలని ఆశిస్తున్నాను” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు








