జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని PMJ జ్యూవెలరీ షాపులో ఆదివారం ఉదయం దుండగులు చొరబడి కాల్పులకు తెగబడ్డారు.
ఉదయం 10 గంటల ప్రాంతంలో షాపు తెరిచిన కొద్దిసేపటికే, గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో లోపలికి ప్రవేశించారు. సిబ్బందిని బెదిరించి నగలను దోచుకునే క్రమంలో అడ్డువచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.ఈ ఘటనలో నలుగురు షాపు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.లాకర్లలో ఉన్న భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను బ్యాగుల్లో నింపుకుని దుండగులు క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు.
“పట్టపగలు, నగర నడిబొడ్డున ఇంతటి సాహసోపేత దోపిడీ జరగడం గమనార్హం”. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం.నగర సరిహద్దుల్లో పోలీసులు నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ ఘటనతో వ్యాపార వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.








