Sarkar Live

పీసీసీ చీఫ్ టార్గెట్‌గా తెరవెనుక రాజకీయం – Telangana Congress

మహేష్ కుమార్ గౌడ్‌పై ముప్పేట దాడి.. అసలు కథేంటి? ​తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) లో అంతర్గత పరిణామాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వం, పార్టీ సమన్వయకర్తగా సాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ చుట్టూ ఇప్పుడు

Telangana Congress

మహేష్ కుమార్ గౌడ్‌పై ముప్పేట దాడి.. అసలు కథేంటి?


తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) లో అంతర్గత పరిణామాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వం, పార్టీ సమన్వయకర్తగా సాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ దుమారం రేగుతోంది. ఒక వైపు నామినేటెడ్ పదవుల భర్తీ, వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపికపై కసరత్తు జరుగుతుండగానే, ఆయనను టార్గెట్ చేస్తూ వస్తున్న కొన్ని మీడియా కథనాలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

​Telangana Congress : మీడియాలో ముప్పేట దాడి.. అసలు కథేంటి?

​ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఒక ప్రముఖ తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌లో గత రెండు రోజులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వైఫల్యాలపై వరుస కథనాలు రావడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. ఆయనను “సమర్థవంతమైన నాయకుడు కాదు” అనే కోణంలో ప్రచారం చేయడం వెనుక పార్టీలోని కొందరు వలస నేతలు లేదా అసంతృప్త శక్తుల హస్తం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
​ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలపై పీసీసీ సమర్పించిన నివేదికలే ఈ విమర్శల దాడికి కారణమనే గుసగుసలు వినబడుతున్నాయి.

​”అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది” – మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్

​ఈ పరిణామాలపై గాంధీభవన్‌లో మీడియా చిట్‌చాట్‌లో మహేష్ కుమార్ గౌడ్ గట్టిగానే స్పందించారు. ​”నా పనితీరును అంచనా వేయాల్సింది ఏఐసీసీ (AICC) అధిష్ఠానం, కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే కానీ, ఒక న్యూస్ ఛానల్ కాదు. ప్రెస్ ఫ్రీడమ్‌ను మేము గౌరవిస్తాం. ఇలాంటి చిల్లర ప్రచారాలకు నేను సమయం వృధా చేయను. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.

​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాను పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నానని, ఇది జీర్ణించుకోలేని కొందరే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

​వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం & క్యాబినెట్ విస్తరణ

​ఇదే క్రమంలో పార్టీ సంస్థాగత బలోపేతంపై ఆయన కీలక అప్‌డేట్ ఇచ్చారు.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల పోస్టుల కోసం ఆశావహుల జాబితాను ఇప్పటికే హైకమాండ్‌కు పంపామని, త్వరలోనే ఏఐసీసీ తుది నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు.
​మంత్రివర్గ విస్తరణ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిధిలోని అంశమని, అందులో తన ప్రమేయం ఏమీ ఉండదని క్లారిటీ ఇచ్చారు.

​ప్రతిపక్షాలపై ఎదురుదాడి

​ఇటీవల 17 సామాజిక వర్గాల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి జోష్‌లో ఉన్న పీసీసీ చీఫ్, విపక్ష బీఆర్ఎస్ (BRS) పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు వస్తే రద్దు చేస్తామన్న హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ… బీఆర్ఎస్‌కు హైదరాబాద్ అభివృద్ధిపై కనీస విజన్ లేదని, కాంగ్రెస్ నిర్మించే ఫ్యూచర్ సిటీ దేశానికే రోల్ మోడల్ కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

​రాజకీయ విశ్లేషణ…

​కాంగ్రెస్ అధిష్ఠానం మరియు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తన పనితీరును అభినందించారని మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నప్పటికీ, సొంత పార్టీకి అనుకూల మీడియాలోనే ఆయనపై వ్యతిరేక కథనాలు రావడం వెనుక కాంగ్రెస్‌లోని అంతర్గత గ్రూపు రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత లాంటి కొందరు నేతలు సోషల్ మీడియాలో “We Stand with Mahesh Kumar Goud” అంటూ ఆయనకు మద్దతుగా పోస్టులు పెట్టడం గమనార్హం. రాబోయే రోజుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం తర్వాత ఈ అంతర్గత పోరు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?