Nagar Kurnool | దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై సామూహిక అత్యాచారం.. !
ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
Nagar Kurnool : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఉగాది పర్వదినం రోజున ఆంజనేయస్వామి గుడికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన వివాహితపై ఎనిమిది మంది కామాందులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఆమెపై అత్యాచారాన్ని అడ్డుకోబోయిన బంధువుపై కూడా దాడి చేసి పారిపోయారు. కామాంధులు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన 8మందిలో ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.
Nagar Kurnool జిల్లాలోని ఉరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శనానికి వెళ్లిన 30 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగినప్పటికీ, పోలీసులు కొంతమందిని ప్రశ్నించడం ప్రారంభించడంతో పాటు, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్న తర్వాత విషయం ఆలస్యంగా వెల...




