PM Modi at Vantara | క్రూర జంతువులతో మోదీ.. స్వయంగా ఆహారం పెట్టిన ప్రధాని
PM Modi at Vantara : గుజరాత్లోని వంతారా (Vantara) వద్ద ఒక విశిష్టమైన వన్యప్రాణి రక్షణ, పునరావాసం & సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. విభిన్న జాతుల వన్యప్రాణులకు ఆశ్రయం కల్పించేందుకు ఈ కేంద్రాన్ని (wildlife rescue, rehabilitation, and conservation centre) ఏర్పాటు చేశారు. ఇందులో పునరావాసం పొందిన జంతువులను మోదీ దగ్గరగా పరిశీలించారు. వాటికి అందుతున్న సేవలు, సంరక్షణపై ఆరా తీశారు.
వన్యప్రాణుల వైద్య సేవలను పరిశీలించిన మోదీ
ఈ సందర్భంగా వన్యప్రాణి ఆస్పత్రి (wildlife hospital)ని కూడా ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ ఆస్పత్రిలో వన్యప్రాణులకు MRI, CT స్కాన్లు, ఇతర ఆధునిక వైద్య పరికరాలతోపాటు ఐసీయూలు, అనస్తీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, అంతర్గత వైద్యం ...




