Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Ebola Virus | బోలా కలకలం: డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన.. భారత్‌ అప్రమత్తం!
National

Ebola Virus | బోలా కలకలం: డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన.. భారత్‌ అప్రమత్తం!

ప్రపంచం కరోనా మహమ్మారి భయాల నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో ప్రమాదకర వైరస్ వార్తలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ (Ebola Virus) మళ్లీ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యంత అరుదుగా ప్రకటించే “పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్ー ఆఫ్ ఇంటర్నేషనల్ కన్​సర్న్” (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ)ని ప్రకటించింది. ఒక వ్యాధి దేశాల సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం ఈ వైరస్ కాంగో, ఉగాండా దేశాల్లో వందల సంఖ్యలో కేసులతో వినాశనం సృష్టిస్తోంది. ఈసారి ఎందుకంత భయం? ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ కలవరం! ఎబోలా ఆఫ్రికాకు కొత్త వ్యాధి కాకపోయినప్పటికీ, ఈసారి వెలుగులోకి వచ్చిన వైరస్ “బుండిబుగ్యో” (Bundibugyo) అనే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన స్ట్రెయిన్ కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ స్ట్రెయిన్‌ను...
​Land Scam | అక్రమాల ‘డీఐ’.. అవినీతి ‘పానీయం’!
Special Stories

​Land Scam | అక్రమాల ‘డీఐ’.. అవినీతి ‘పానీయం’!

​అటెండర్ టు డీఐ ప్రమోషన్ విద్యా అర్హతలపై నీలినీడలు? ​ఎల్కతుర్తిలో సర్వే నెంబర్ మార్పిడికి భారీగా ముడుపులు! ​ముచర్ల చెరువులోని పట్టా భూమి వ్యవహారంలో ‘లకారాలు’ చేతులు మారినట్లు గుసగుసలు​సదరు అధికారికి కాదేదీ అవినీతికి అనర్హం. చిన్న ఫైలు కదలాలన్నా, పెద్ద భూమి వ్యవహారం చక్కబడాలన్నా అక్కడ ‘ముడుపుల పానీయం’ తాగాల్సిందేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటెండర్ స్థాయి నుంచి డీఐ (డివిజనల్ ఇన్‌స్పెక్టర్/భూ రికార్డుల తనిఖీ అధికారి) స్థాయికి ఎదిగిన సదరు అధికారి ప్రమోషన్ విద్యా అర్హతలపైనే ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లంచాలనే పానీ(నీళ్ల)లా మింగేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు రెవెన్యూ (Revenue Department), సర్వే శాఖల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఎల్కతుర్తి (Elkathurthi), ముచర్ల (Mucharla)పరిధిలో జరిగిన కొన్ని భూ భాగోతాలు (Land Scam) ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ​అర్హ...
ఏసీబీ సంచలనం: డిప్యూటీ కలెక్టర్ ఇళ్లపై దాడులు..
Crime

ఏసీబీ సంచలనం: డిప్యూటీ కలెక్టర్ ఇళ్లపై దాడులు..

తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో అవినీతి నిరోధక బ్యూరో (ACB) మరోసారి వణుకు పుట్టించింది. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే నమ్మదగిన సమాచారంతో.. మే 22, శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. వంశీ మోహన్‌కు సంబంధించి హైదరాబాద్, శేరిలింగంపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి సహా మొత్తం 8 ప్రాంతాలలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో భారీ అవినీతి? వంశీ మోహన్ గతంలో శేరిలింగంపల్లితో పాటు పలు కీలక ప్రాంతాలలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO)గా పనిచేసిన కాలంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. విలువైన ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు, రియల్టర్లకు కేటాయించి, వాటి ద్వారా వందల కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిఘాలో తేలి...
CJP | సామాజిక మాధ్యమాల్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ! అసలెందుకు ఇంతలా ట్రెండ్​ అవుతోంది?
Special Stories

CJP | సామాజిక మాధ్యమాల్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ! అసలెందుకు ఇంతలా ట్రెండ్​ అవుతోంది?

​దేశంలో ఒక సరికొత్త డిజిటల్ రాజకీయ విప్లవం తెరపైకి వచ్చింది. సీరియస్ రాజకీయాలకు భిన్నంగా.. వ్యంగ్యం, మీమ్స్ ఆయుధాలుగా పుట్టుకొచ్చిన ఒక సరికొత్త 'ట్రెండ్' ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అదే "కాక్రోచ్ జనతా పార్టీ" (CJP‌‌ – Cockroach Janata Party). కేవలం ఐదు రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్‌లో అధికార పక్షం (BJP) కంటే ఎక్కువ ఫాలోవర్లను సంపాదించుకుని, ఏకంగా 1.5 కోట్లకు పైగా ఫాలోవర్లతో దూసుకుపోతున్న ఈ డిజిటల్ ఉద్యమం వెనుక యువత పెను నిరసన దాగి ఉంది. ​సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో రగిలిన మంట ​ఈ ఉద్యమానికి బీజం పడింది 2026 మే 15న జరిగిన ఒక సుప్రీంకోర్టు విచారణలో ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు సందర్భంగా మాట్లాడుతూ.. "ఉద్యోగాలు లేక, వృత్తిలో రాణించలేక కొందరు యువకులు బొద్దింకల్లా, సమాజ పరాన్నజీవుల్లా మారుతున్నారు. వారంతా జర్నలిస్టులు, ఆర్‌టీఐ (RTI) కార్యకర్తలు, సోషల్ ...
​అవినీతి తిమింగలాలపై ఏసీబీ పంజా: అక్రమార్కుల గుండెల్లో రైళ్లు..!
Special Stories, State

​అవినీతి తిమింగలాలపై ఏసీబీ పంజా: అక్రమార్కుల గుండెల్లో రైళ్లు..!

తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఎప్పుడు ఎవరిపై రైడ్ జరుగుతుందోనని అధికారుల్లో టెన్షన్ టెన్షన్! ​వరుస దాడులు, ఆకస్మిక తనిఖీలతో లంచావతారులకు నిద్ర కరవు. తెలంగాణలో అవినీతిని కూకటివేళ్లతో పెకలించేందుకు యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) రూట్ మార్చింది. లంచగొండుల ఆట కట్టించేందుకు అధికారులు తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రంలోని అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అవినీతిని అంతమొందించడమే లక్ష్యంగా ఏసీబీ అడుగులు పడుతుండటంతో.. ఎప్పుడు ఎవరిపై రైడ్ జరుగుతుందో తెలియక అక్రమార్కులు బిక్కుబిక్కుమంటున్నారు. ​కూకటివేళ్లతో కదులుతున్న అక్రమాస్తుల పుట్టలు.. ​గడిచిన కొన్ని రోజులుగా ఏసీబీ జరుపుతున్న వరుస దాడులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో కేవలం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వారిపైనే చర్యలు ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్...
error: Content is protected !!