Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
గులాబీ జెండాకు పాతికేళ్లు: నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు! – BRS Party 25 Years
Special Stories

గులాబీ జెండాకు పాతికేళ్లు: నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు! – BRS Party 25 Years

​ తెలంగాణ రాజకీయ యవనికపై ఒక ప్రభంజనంలా ఉద్భవించి, ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ఉద్యమంగా మార్చి, గమ్యాన్ని ముద్దాడిన భారత్ రాష్ట్ర సమితి (BRS Party) నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. 2001 ఏప్రిల్ 27న 'జలదృశ్యం' వేదికగా కేసీఆర్ నాటిన మొక్క, నేడు మహావృక్షమై పాతికేళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు పండుగ వాతావరణంలో రజతోత్సవ వేడుకలకు సిద్ధమయ్యాయి. ​అస్తిత్వం నుంచి అధికారం దాకా.. ​2001లో కేవలం కొద్దిమంది అనుచరులతో, "తెలంగాణ వస్తేనే మన బతుకులు మారుతాయి" అనే నినాదంతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి 2014 వరకు అలుపెరగని పోరాటం, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమాలతో దేశం చూపు తెలంగాణ వైపు తిరిగేలా చేశారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చి పదేళ్ల పాటు ప...
తెలంగాణరాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు
State, Hyderabad

తెలంగాణరాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

సంగారెడ్డి కలెక్టర్ గా ప్రతీక్ జైన్ ఖమ్మం కలెక్టర్ గా టి ఎస్ దివాకర్ ములుగు కలెక్టర్ గా బి హేమంత్ సహదేవ్ రావు నిర్మల్ కలెక్టర్ గా భవేశ్ మిశ్రా హైదరాబాద్ కలెక్టర్ గా ప్రియాంక అలా నాగర్ కర్నూల్ కలెక్టర్ గా హేమంత కేశవ్ పాటిల్ నారాయణ పేట కలెక్టర్ గా ప్రియాంక పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ గా జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ ఆర్&బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి గా ప్రావీణ్య ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా అభిలాష్ అభినవ్ కార్మిక శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి గా దాసరి హరిచందన పంచాయతీరాజ్  ,గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి గా దాన కిషోర్ ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ గా ముకుంధ్ రెడ్డి...
‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) ప్రకటించిన కవిత!  కేసీఆర్ ఇప్పుడు మరబొమ్మ అంటూ సంచలన వ్యాఖ్యలు!
Trending, State

‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) ప్రకటించిన కవిత! కేసీఆర్ ఇప్పుడు మరబొమ్మ అంటూ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (TRS) గా ప్రకటించారు. గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను ఒప్పుకుంటూ, ప్రజలకు క్షమాపణలు చెప్పిన కవిత.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని 'కర్కోటకుడు' అని, తన తండ్రి కేసీఆర్‌ను 'మరబొమ్మ' అని అభివర్ణించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. "ఇన్‌ఫ్రంట్‌ దేరీజ్‌ క్రొకడైల్‌ ఫెస్టివల్" కవిత తన ప్రసంగంలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. "ఇది ప్రారంభం మాత్రమే, ఇన్‌ఫ్రంట్‌ దేరీజ్‌ క్రొకడైల్‌ ఫెస్టివల్ (ముందుంది మొసళ్ల పండుగ). రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా సీఎం స్పందించడం లేదు. అందుకే ఆయన్ను కర్కోటకుడు అంటున్నాను." — కల్వకుంట్ల కవిత కేసీఆర్ పై కవిత అస్త్...
సాయిరాం.. 24 ఏసీకేలు పెండింగ్! సీఎంఆర్ కు రాంరాం.. చెప్పినట్లేనా? – Sairam Rice Mill CMR
Special Stories

సాయిరాం.. 24 ఏసీకేలు పెండింగ్! సీఎంఆర్ కు రాంరాం.. చెప్పినట్లేనా? – Sairam Rice Mill CMR

​Sarkar Live Exclusive | గత కొన్నిరోజుల క్రితం ​సీఎంఆర్ (CMR - కస్టమ్ మిల్లింగ్ రైస్ ) గడువు ముగిసింది. కానీ ప్రభుత్వం మళ్ళీ అవకాశం కల్పించి గడువును పెంచింది. అయినప్పటికీ కొంతమంది మిల్లర్ లు మాత్రం ప్రభుత్వానికి పెట్టాల్సిన సీఎంఆర్ ను మాత్రం పూర్తిచేయలేకపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది మిల్లర్ లు ఇప్పటికే ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించడంవల్లే సీఎంఆర్ పూర్తిచేయలేకపోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా బొల్లికుంట రెవెన్యూ శివారులోని సాయిరాం రైస్ మిల్లు సీఎంఆర్ (Sairam Rice Mill CMR) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.2025-26ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ మిల్లర్ ప్రభుత్వానికి 47 ఏసికేల సీఎంఆర్ పెట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 23 ఏసికేల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఇంకా 24 ఏసికేల సీఎంఆర్ పెట్టాల్సి ఉండగా,అసలు 24 ఏసికే లకు సరిపడా ధాన్యం మిల్లులో ఉం...
కలెక్టర్ పట్టుదల.. రియల్టర్ల కుతంత్రాలు!
Special Stories

కలెక్టర్ పట్టుదల.. రియల్టర్ల కుతంత్రాలు!

కీర్తినగర్ హౌజింగ్ బోర్డు సర్వేను అడ్డుకునేందుకు 'విశ్వప్రయత్నాలు' Housing Board Land Survey | గీసుగొండ మండలంలోని కీర్తినగర్ (Keerthi nagar) హౌజింగ్ బోర్డు భూములు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిపై కన్నేసిన కొందరు రియల్టర్లు, దానిని చేజిక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని జిల్లా కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తుంటే, మరోవైపు రాజకీయ పలుకుబడితో సర్వేను అడ్డుకునేందుకు రియల్టర్లు 'విశ్వప్రయత్నాలు' చేస్తున్నారు. ​అధికారుల ఆదేశాలకు, రాజకీయ ఒత్తిళ్లకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో గెలుపు ఎవరిది? సర్వే సజావుగా సాగుతుందా లేక రియల్టర్ల వ్యూహమే పారుతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ​రాజకీయ ఒత్తిడితో పావులు.. ​హౌజింగ్ బోర్డుకు చెందిన ఖరీదైన భూమిలో హద్దులు నిర్ణయించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవగా, ఒక ప్రముఖ రియల్టర్ దానిన...
error: Content is protected !!