Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ఏసీబీ వలలో తహశీల్దార్
State

ఏసీబీ వలలో తహశీల్దార్

​అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. లంచం డబ్బుల కోసం బాధితులను వేధిస్తున్న ప్రభుత్వ అధికారుల గుట్టురట్టు చేస్తున్నారు. తాజాగా సోమవారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ తహశీల్దార్ (MRO) సుచరిత ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ​అసలేం జరిగిందంటే..? ​ఒక బాధితునికి సంబంధించిన రెవెన్యూ పనిని పూర్తి చేయడానికి తహశీల్దార్ సుచరిత రూ. 2 లక్షల నగదును లంచంగా డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చుకోలేక, అవినీతి అధికారికి బుద్ధి చెప్పాలనుకున్న బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం రచించారు. ​డ్రైవర్ ద్వారా లంచం.. పక్కా ప్లాన్‌తో పట్టుకున్న ఏసీబీ ​తహశీల్దార్ ఆదేశాల మేరకు ఆమె ప...
​Private School Fee | బడులు తెరుచుకోకముందే ‘ఫీజుల’ వేట.. ప్రైవేట్ స్కూళ్ల నిలువు దోపిడీ!
Special Stories

​Private School Fee | బడులు తెరుచుకోకముందే ‘ఫీజుల’ వేట.. ప్రైవేట్ స్కూళ్ల నిలువు దోపిడీ!

​Private School Fee | మరికొన్ని రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం (2026-27) ప్రారంభం కానుండటంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు మళ్లీ ఫీజుల వేట మొదలుపెట్టాయి. బడులు ఇంకా తెరుచుకోకముందే అడ్మిషన్లు, పుస్తకాలు, యూనిఫామ్‌ల పేరిట సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల జేబులకు భారీ చిల్లు పెడుతున్నాయి. ప్రభుత్వ జీవోలు, కోర్టుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రైవేట్ స్కూళ్ల ‘ఫీజు’ రాజ్యం నిరంకుశంగా సాగుతోంది. ​Private School Fee : 20% నుండి 30% పెరిగిన ఫీజులు.. నో డొనేషన్, నో సీట్! ​గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫీజులను ఏకంగా 20% నుండి 30% వరకు పెంచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ​ప్రాథమిక తరగతులకే రూ. 50 వేల నుండి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. ​హైస్కూల్ విద్యార్థులకు అయితే టెక్నో, ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటూ స్కూలు స్థాయిని బట్టి రూ. 1.5 లక్షల నుండి రూ. 3 l...
సామాన్యుడిపై ఇంధన భారం: లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 పెంపు..  – Fuel Price Hike
Business

సామాన్యుడిపై ఇంధన భారం: లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 పెంపు.. – Fuel Price Hike

10 రోజుల్లో నాలుగోసారి! Fuel Price Hike దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. ప్రభుత్వ చమురు రంగ సంస్థలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, లీటర్ డీజిల్‌పై రూ.2.71 చొప్పున పెంపు అమల్లోకి వచ్చింది. ఈ కొత్త ధరలు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఇది పది రోజుల్లోనే జరిగిన నాలుగో ధరల పెంపు కావడం గమనార్హం. వరుసగా పెరుగుతున్న ధరలతో ఇప్పటికే సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తాజా పెంపు మరింత ఆర్థిక ఒత్తిడిని మోపనుంది. 10 రోజుల్లోనే లీటరుకు రూ.8 భారం! గత పది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు కలిపి లీటరుకు దాదాపు రూ.8 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు చేరుకోగా, డీజిల్ ధర రూ.95.20కు పెరిగింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్...
తెలంగాణను వణికిస్తున్న వడగాల్పులు: ఒక్కరోజే 61 మంది, నాలుగు రోజుల్లో 168 మంది బలి!
Special Stories

తెలంగాణను వణికిస్తున్న వడగాల్పులు: ఒక్కరోజే 61 మంది, నాలుగు రోజుల్లో 168 మంది బలి!

​తెలంగాణ రాష్ట్రంలో ఎండలు నిప్పుల చెలమను తలపిస్తున్నాయి. భానుడి భగభగలకు రాష్ట్రం విలవిలలాడుతోంది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పుల (Heat Waves) కారణంగా జనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వడదెబ్బ తీవ్రతకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 61 మంది మృతి చెందడం పరిస్థితి భీకరతకు అద్దం పడుతోంది. గత నాలుగు రోజుల్లోనే మరణించిన వారి సంఖ్య 168కి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ​మరికొద్ది రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ​జిల్లాల్లో నిప్పుల కొలిమి ​రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం...
పీసీసీ చీఫ్ టార్గెట్‌గా తెరవెనుక రాజకీయం – Telangana Congress
Special Stories

పీసీసీ చీఫ్ టార్గెట్‌గా తెరవెనుక రాజకీయం – Telangana Congress

మహేష్ కుమార్ గౌడ్‌పై ముప్పేట దాడి.. అసలు కథేంటి? ​తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) లో అంతర్గత పరిణామాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వం, పార్టీ సమన్వయకర్తగా సాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ దుమారం రేగుతోంది. ఒక వైపు నామినేటెడ్ పదవుల భర్తీ, వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపికపై కసరత్తు జరుగుతుండగానే, ఆయనను టార్గెట్ చేస్తూ వస్తున్న కొన్ని మీడియా కథనాలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ​Telangana Congress : మీడియాలో ముప్పేట దాడి.. అసలు కథేంటి? ​ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఒక ప్రముఖ తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌లో గత రెండు రోజులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వైఫల్యాలపై వరుస కథనాలు రావడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. ఆయనను "సమర్థవంతమైన నాయకుడు కాదు" అనే కోణంలో ప్రచారం చేయడం వెనుక పార్ట...
error: Content is protected !!